లోకేష్`యువగళం`కోలాహలం,సంప్రదాయబద్ధంగా పయనం
భావోద్వేగాల నడుమ హైదరాబాద్ నివాసం నుంచి లోకేష్ పాదయాత్రకు(Yuvagalam) బయలు దేరారు. తల్లి భువనేశ్వరి, తండ్రి నారా చంద్రబాబునాయుడు(CBN), మామ బాలక్రిష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. అత్తమామలు, తల్లీదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలను అందుకున్నారు. సతీమణి బ్రాహ్మణి వీరతిలకం దిద్ది, హారతి ఇచ్చి సాగనంపారు. అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాత ఎన్టీఆర్ కు నివాళర్పించారు. ఆ తరువాత షెడ్యూల్ ప్రకారం కడపకు లోకేష్ బయలు దేరారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం…