editor

AP

వైసీపీ లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాల్లో అధికార వైసీపీ గెలవాల్సి ఉన్నా.. క్రాస్‌ ఓటింగ్‌తో ఓ స్థానాన్ని కోల్పోయింది.. దీంతో, వైసీపీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. ఇక, దిద్దబాటు చర్యలకు దిగింది వైసీపీ అధిష్టానం.. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించింది.. తన మార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినట్టు నిర్ధారణకు వచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్‌…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ విషయం లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నారని, ఈ కారణంగానే ఆ ఇద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.…

AP

ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.వారికి సర్వీస్ సమయంలో 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్..

ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులు గుడ్ న్యూస్ వచ్చేసింది. వారికి సర్వీస్ సమయంలో 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది ఇప్పటివరకు పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే వినియోగించుకోవాలనే రూల్ ఉంది. ఒకవేళ పిల్లలు దివ్యాంగులైతే.. వారికి 22 సంవత్సరాలు వచ్చేవరకు ఈ లీవ్ వినియోగించుకునే సౌలభ్యం ఉండేది. తాజాగా జగన్ సర్కార్ ఆ నిబంధనను తీసేసింది. సర్వీస్ టైమ్‌లో ఎప్పుడైనా వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని అధికారులకు జగన్…

AP

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం…

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వపై ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఈ ప్రకటన చేసింది. తొలిదశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది. వైసీపీ ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి ఇవాళ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్‌పటేల్‌…

AP

ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్..

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో   ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించింది. ఆమెకు 23 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. స్తవానికి టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురు ఎన్నికల అనంతరం వైసీపీకి జై కొట్టారు. ఈ లెక్కన టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 19 మాత్రమే. ఒకవేళ అధికార వైసీపీపై అసమ్మతి గళం వినిపించిన.. కోటంరెడ్డి, ఆనం.. టీడీపీకి ఓటు వేసినా.. ఆ పార్టీ బలం…

CINEMA

మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్30’ ఎట్టకేలకు లాంచ్..

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్’ ఎట్టకేలకు లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్ 30 చిత్ర యూనిట్ తో పాటు, రాజమౌళి, ప్రశాంత్ నీల్ లు ముఖ్య అతిథులుగా ఈ ముహూర్త కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అనిరుధ్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్ లు ఈ ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తోనే…

TELANGANA

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిట్ కార్యాలయానికి వెళుతున్న దృష్ట అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిట్ కార్యాలయానికి వెళుతున్న దృష్ట అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాం ఎంపిటిసి విట్టల్ రెడ్డి సర్పంచ్ శ్రీనివాస్ బేతాయ సదానందం నాగయ్య విశ్వేశ్వర్ వీరాయ స్వామి అభిలాష్ రెడ్డి హనుమయ్య దుర్గయ్య జైపాల్ శ్రీనివాస్ గౌడ్ అంజా…

CINEMA

మరోసారి భీష్మ కాంబో..

నితిన్, రశ్మికా మందణ్న, వెంకీ కుడుముల కాంబోలో గతంలో వచ్చిన ‘భీష్మ’ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ చిత్రం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి సందేశం ఇస్తూనే.. ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కూడా బాగానే కురిపించింది. ఇప్పుడు ఈ కాంబో మరో ప్రాజెక్ట్ కోసం జతకట్టింది. ఉగాది పండుగ పర్వదినాన.. ఒక ఫన్నీ వీడియో ద్వారా ఈ కాంబోలో కొత్త సినిమా తెరకెక్కనున్నట్టు ప్రకటించారు. మైత్రీ…

TELANGANA

సీఎం కేసిఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటన…పంట నష్టం పై రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మూడు రోజులు కురిసిన అకాల వర్షాలు…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌ కేసులో..టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 40 మంది ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు జారీ..

తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులని విచారిస్తున్న అధికారులకు సంచలన విషయాలు వెలుగులోకి తెస్తున్నారు. టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న వాళ్లందరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 40 మంది ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు జారీ చేసింది. వీళ్లలో పేపర్‌ లీక్స్‌ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌లతో సంబంధాలు ఉన్న వాళ్లే ఉన్నట్లు సమాచారం.…