National

National

ఎన్నికల షెడ్యూల్‌లో సవరణలు చేసిన ఈసీ.. జూన్ 2వ తేదీ నాడే ఓట్ల లెక్కింపు..

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాయి. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలను నిర్వహించడంలో తలమునకలయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన, విజయం సాధించడానికి అవసరమైన వ్యూహ, ప్రతివ్యూహాలను పన్నుతున్నాయి.   లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ శనివారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ…

National

7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు.. ఏపీలో మే 13న పోలింగ్..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ప్లీనర్ హాల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్, జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు.   రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు.. దేశంలో 97 కోట్ల ఓటర్లు ఉన్నారని తెలిపారు. 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు.…

National

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు..

సార్వత్రిక ఎన్నికల(Lok Sabha election 2024)కు ముందు కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా అధిక ఇంధన ధరలతో అవస్థలు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గిస్తున్నట్లు గురువారం రాత్రి వెల్లడించింది.   చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు…

National

ఈసీ చేతికి రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు.. సుప్రీంకోర్టులో ఎస్బీఐ అఫిడవిట్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా‌.. మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అందజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. దాన్ని పాటించినట్లు వివరించింది.   ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు.. గతంలో ఎస్బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చే ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై కిందటి నెల 15వ తేదీన…

NationalTELANGANA

బీజేపీ రెండో జాబితా విడుదల, తెలంగాణ నుంచి డీకే అరుణ సహా పోటీలో వీరే..!

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారం విడుదల చేసింది. ఈ 72 మందిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇప్పటి వరకు మొత్తం 15 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక, ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.   తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో…

National

కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..!

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. తన మలి జాబితాను విడుదల చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి 43 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. మొత్తం అయిదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పోటీ చేసే వారి పేర్లను వెల్లడించింది.   ఇటీవలే 36 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణకు చోటు దక్కింది. మొత్తం నలుగురి…

National

సీఏఏ అమలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన..

దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. వివాదాలకు తెర తీసినట్టవుతోంది.   రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై…

National

కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన మమత..

దేశంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇంకో రెండు మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో ఈ షెడ్యూల్‌ను విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్.. చర్యలు తీసుకుంటోంది. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.   ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ..…

National

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా..

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.   దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో…

National

మళ్లీ రెండు సీట్లలో రాహుల్ పోటీ.? ఈసారి.. కాంగ్రెస్ తొలి జాబితా రెడీ..

జాతీయ స్దాయిలో ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధుల తొలి జాబితాను దాదాపుగా సిద్దం చేసింది. త్వరలో దీన్ని విడుదల చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ తమ తొలి జాబితాలో తాము కీలకంగా భావిస్తున్న 10 రాష్ట్రాల్లోని ఆరు రాష్ట్రాల్లో అభ్యర్ధుల పేర్లను విడుదల చేయబోతోంది. ఇందులో పార్టీ కీలక నేతలంతా ఉంటారని అంచనా.   కాంగ్రెస్ పార్టీ లోక్ సభ…