AP

AP

కారుమూరి అరెస్టుపై నోరు విప్పిన జగన్..!

మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి మాజీ సీఎం జగన్ కొత్త విషయాలు చెబుతుంటారు. ఈసారి కూడా అదే చేశారు. కాకపోతే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి అంటగలిపే ప్రయత్నం చేశారు. ఆయన అరెస్టు వెనుక ముమ్మాటికీ ప్రభుత్వం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. తాడేపల్లిలో వైసీపీ ఆఫీసులో మాట్లాడిన ఆయన, కొన్ని విషయాలు వెల్లడించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుపై…

AP

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకేసిన మాజీ సీఎం జగన్..

చంద్రబాబు ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగాయి మాజీ సీఎం జగన్. కేవలం మూడు అంశాలను ప్రధాన టార్గెట్ గా పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు.…

AP

తెలిసి తెలిసి నా గొంతు కోశారు.. ఇది పక్కా ప్రణాళికతో చేసిన మోసం..! మేఘన సంచలన ప్రెస్ మీట్..

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంలో చెలరేగిన వివాదం పెను సంచలనంగా మారింది. ఆయన కోడలు మేఘన మంగళవారం మీడియా ముందుకు వచ్చి, తన అత్తింటి వారిపై కఠినమైన, తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్త జోగి రాజీవ్‌కు ఉన్న సమస్య గురించి ముందే తెలిసి కూడా, కేవలం తమ పరువు కోసం తన జీవితాన్ని బలి చేశారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అదనపు కట్నం వేధింపుల నుంచి మత మార్పిడి ఒత్తిడి వరకు తాను…

AP

ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. టెక్నాలజీతోనే సేవలు: సీఎం చంద్రబాబు..

ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందాలని, ఇందుకోసం ఏఐ అసిస్టెంట్, బ్లాక్ చెయిన్ వంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పదేపదే వాటిని అప్‌లోడ్ చేసే పనిలేకుండా ‘డేటా ఇంటిగ్రేషన్’ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

AP

ఏపీలో స్థానిక ఎన్నికలంటూ ప్రచారం.. ఎస్ఈసీ హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అంటూ సోషల్ మీడియా, వాట్సాప్‌లలో విస్తృతంగా ప్రచారమవుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని, నకిలీదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఈ ఫేక్ షెడ్యూల్‌ను ప్రజలు నమ్మవద్దని, ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠినమైన సైబర్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించారు.ఎన్నికల కమిషన్ అధికారిక చిహ్నాలు, లోగోలను…

AP

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన “జాబ్ క్యాలెండర్-2026″ను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆగస్టు 22, 2026న జీవో నెం.81ను జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియను నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ, ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు), డీఎస్సీ వంటి…

AP

డీఎస్సీపై చర్చకు రా.. టైమ్, డేట్ నీ ఇష్టం..! జగన్‌కు నారా లోకేశ్ ఐదోసారి సవాల్..

డీఎస్సీ నియామకాలపై చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్‌ కు తాను ఐదోసారి సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. “టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చోవడం కాదు, బయటకు రా!” అని లోకేశ్ తీవ్ర స్వరంతో జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా…

AP

స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పనకు జనసేన కమిటీని నియమించారు. దీనికోసం 14 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన విధి విధానాలు రూపకల్పనకి ప్రత్యేక కమిటీని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో మోత్తం 14 మంది సభ్యులను నియమించారు. విధి విధానాలతోపాటు క్షేత్ర స్థాయిలో శ్రేణుల ఆలోచనలను ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన…

AP

జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీకి తేడా తెలియదు: మంత్రి నారా లోకేశ్..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీల మధ్య గల వ్యత్యాసం కూడా తెలియదని, ఆ అజ్ఞానం వల్లే గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు జగన్ పాత ప్రెస్ మీట్ వీడియోను లోకేశ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.“ఏపీపీఎస్సీ అంటే ఏమిటో తెలియదు, డీఎస్సీ అంటే ఏమిటో తెలియదు. రెండూ ఒకటే అని…

AP

స్థానిక పోరుకు జనసేన సై..! ఆ వ్యూహం గత ఎన్నికలకే పరిమితమన్న పవన్ కల్యాణ్..

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికలే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానికి భిన్నంగా, క్షేత్రస్థాయి బలాబలాలకు అనుగుణంగా ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావశీలమైన పోటీ ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం…