మహిళా ఎస్సైని తోసేసిన వైసీపీ నేత..!
శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్లో కలిసేందుకు వైసీపీ అధినేత జగన్ పర్యటించిన సందర్భంగా జిల్లా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జగన్ పర్యటనకు సంబంధించి రోడ్షోలు, జనసమీకరణ చేయకూడదని పోలీసులు విధించిన నిబంధనలు, ఆంక్షలను వైసీపీ నేతలు, కార్యకర్తలు ధిక్కరించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్మనోహర్ నాయకత్వంలో భారీగా తరలివచ్చిన శ్రేణులు… జైలుకు కిలోమీటరు ముందు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు…

