బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను.
విజయనగరం జిల్లాలో వైసీపి కి పెద్ద షాక్ తగిలింది.బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. తనతో పాటు అనుచరులు కూడా టీడీపీలో చేరడం విశేషం. చంద్రబాబు స్వయంగా చిన్న శ్రీనుకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాకు చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.…

