11 మందికి లీగల్ నోటీసులు పంపిన ఏబీ వెంకటేశ్వరరావు..
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన చర్యలపై న్యాయపోరాటం ముమ్మరం చేశారు. పలువురు ఐపీఎస్ అధికారులు, కీలక వ్యక్తులకు ఈరోజు ఆయన పంపిన లీగల్ నోటీసులు ఐపీఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పరువుకు భంగం కలిచారంటూ ఏకంగా 11 మందికి ఆయన పరువునష్టం నోటీసులు పంపారు. అక్రమ కేసులు బనాయించడం, తప్పుడు సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం ద్వారా తనను మానసిక వేదనకు గురిచేశారని ఆయన…

