AP

AP

ఏపీలో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూత… క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల..

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొన్ని పెట్రోల్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడం, ప్రజలు క్యూలలో నిలబడటం వంటి పరిణామాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.   కేవలం సరఫరా లోపాల కారణంగానే కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇంధన నిల్వలకు లోటు లేదని ఆయన తెలిపారు. కొందరు వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరతను సృష్టిస్తూ బ్లాక్ మార్కెటింగ్‌కు…

AP

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సిట్ సోదాలు..

ఏపీ లిక్కర్ రవాణా ఆరోపణలకు సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సిట్ సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే సిట్ అధికారులు విచారణ కూడా చేపట్టారు.   జూబ్లీహిల్స్‌లోని కారుమూరి నివాసంలో సిట్ అధికారులు ఆయనను సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఆయన వయసు 60 ఏళ్లు పైబడటంతో, చట్ట ప్రకారం…

AP

11 మందికి లీగల్ నోటీసులు పంపిన ఏబీ వెంకటేశ్వరరావు..

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన చర్యలపై న్యాయపోరాటం ముమ్మరం చేశారు. పలువురు ఐపీఎస్ అధికారులు, కీలక వ్యక్తులకు ఈరోజు ఆయన పంపిన లీగల్ నోటీసులు ఐపీఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పరువుకు భంగం కలిచారంటూ ఏకంగా 11 మందికి ఆయన పరువునష్టం నోటీసులు పంపారు.   అక్రమ కేసులు బనాయించడం, తప్పుడు సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం ద్వారా తనను మానసిక వేదనకు గురిచేశారని ఆయన…

AP

ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు….

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. ఒకవైపు వీరి నివాసాల్లో ఈడీ సోదాలు జరుగుతుండగానే, మరోవైపు న్యాయస్థానంలో కూడా వారికి ఊరట లభించకపోవడం గమనార్హం.   మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇరువర్గాల వాదనలు విన్న…

AP

జులైలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా.. విజయసాయి సంచలన ప్రకటన..!

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే జులై నెల నుంచి తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో భాగంగా తన నివాసంలో ఈడీ సోదాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.   రాజకీయాల్లోకి పునరాగమనం చేయడమే కాకుండా, త్వరలోనే మీడియా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు…

AP

అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్..?

కలకలం రేపుతున్న అనంతపురంలో హనీట్రాప్ కేసు ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. అమాయకులను, ధనవంతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దందాలో ఒక రాజకీయ నేత పేరు బయటకు రావడం జిల్లాలో సంచలనంగా మారింది. డబ్బున్న వారిని వల వేసి ట్రాప్ చేసి, లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠా వెనుక వైసీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు…

AP

అమరావతి రైతులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్..

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి జీవనోపాధికి భరోసా కల్పిస్తూ వార్షిక కౌలును గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్ట భూములకు ఎకరాకు ఇచ్చే కౌలును రూ.40 వేలకు, జరీబు భూములకు రూ.60 వేలకు పెంచింది. అంతేకాకుండా, రాబోయే పదేళ్లపాటు ప్రతీ ఏటా మెట్ట భూములకు రూ.3 వేలు, జరీబు భూములకు రూ.5 వేల చొప్పున కౌలు పెంచేందుకు కూడా ఆమోదం తెలిపింది.   గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి…

AP

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణంతో ఒక కీలక రాజకీయ అధ్యాయం ముగిసినట్లయింది. ప్రస్తుత ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి పితృవియోగం కలగడం పట్ల పలువురు నేతలు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.   నాదెండ్ల భాస్కరరావు పేరు చెప్పగానే మనకు 1984 నాటి రాజకీయ…

AP

పిఠాపురం వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వర్మ తీరుపై అసంతృప్తి..!

కాకినాడ జిల్లా పిఠాపురంలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన నేతల మధ్య చెలరేగిన ప్రోటోకాల్ వివాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కారణంతో మొదలైన ఈ గొడవ, తోపులాట వరకు దారితీయడంపై ఆయన సీరియస్‌గా స్పందించారు. ఇలాంటి ఘటనలు కూటమికి నష్టం కలిగిస్తాయని, పునరావృతం కాకుండా చూడాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.   వివరాల్లోకి వెళితే… మంగళవారం పిఠాపురంలో జరిగిన…

AP

అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్… ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సుమారు రూ. 5,400 కోట్ల వ్యయంతో సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) ముందుకొచ్చింది. ఈ మెగా ప్రాజెక్టుకు ఏప్రిల్ 23న ముఖ్యమంత్రి చంద్రబాబు, రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హాతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.   ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 4,200 కోట్లతో 6 గిగావాట్ల సామర్థ్యం…