పట్నం గ్రామంలో ఉగాది సంబరాలు: హోరాహోరీగా సాగనున్న ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఈనెల 19వ తేదీన భారీ ఎత్తున ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలను నిర్వహించనున్నారు. తెలుగు వారి కొత్త ఏడాది ప్రారంభాన్ని పురస్కరించుకుని గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో గ్రామస్తులు, నిర్వాహకులు ఈ పోటీలకు సర్వం సిద్ధం చేశారు. ఈ పోటీలు పట్నం గ్రామ పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో జరగనున్నాయి. ఈ రాతిదూలం లాగుడు పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి అనంతపురం…

