పిఠాపురం నుంచే పవన్ ప్రచారం-మూడు రోజులు అక్కడే.. !
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం సీటు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నెల 27న పిఠాపురం వెళ్లి అక్కడ ప్రచారం చేశాక రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రెగ్యులర్ గా వెళ్లేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇవాళ జనసేన నేతలతో చర్చించి ఆయన షెడ్యూల్ ఖరారు చేశారు. ఈసారి ఎన్నికలకు తాను పోటీ…