AP

AP

ఏపీ అసెంబ్లీ లో ఏడు కీలక బిల్లులు రాబోతున్నాయి…

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ముందుకు గురువారం రోజు ఏడు కీలక బిల్లులు రాబోతున్నాయి.. రేపు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. ప్రశ్నోత్తరాలతో బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించనున్నారు స్పీకర్‌.. ఇక, డిమాండ్స్ కి గ్రాంట్స్ పై ఓటింగ్ జరగనుంది.. సభలో ఏడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల బిల్లు, ఏపీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సవరణ బిల్లు, ఏపీ ఎస్సీ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ…

APTELANGANA

MLA మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో BRS పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీలకు చెందిన 200 కుటుంబాలు..

అశ్వారావుపేట   MLA మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో BRS పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీలకు చెందిన 200 కుటుంబాలు   *ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది – MLA మెచ్చా నాగేశ్వరరావు*   *పార్టీకి కార్యకర్తలే బలం*   *మారుమూల ప్రాంతాల్లో సైతం జరుగుతున్న అభివృద్ది*   అశ్వారావుపేట(మండలం),వినాయకపురం (గ్రామం),లో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 కుటుంబాలు BRS పార్టీ తీర్థం పుచ్చుకున్నారు… ఈ సందర్భంగా లీలా ప్రసాద్ ఇంటి…

APNationalTELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన కవిత ఈడీ విచారణ…దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో సదరు ఫోన్లు ఇవే అంటూ ఉదయం మీడియాకు ప్రదర్శించారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం వాటిని దర్యాప్తు అధికారులకు అప్పగించారు. కాగా, ఇవాళ రాత్రి వరకు విచారణ జరగడంతో క్షణం క్షణం ఎంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, మళ్లీ ఎప్పుడు…

APTELANGANA

సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందే భారత్‌ రైలు…

భారతీయ రైల్వే రూపురేఖల్ని మార్చేస్తూ వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి సైతం పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు ప్రారంభమైన రూట్స్‌లో ప్రయాణికులు పెద్ద ఎత్తున రైల్వే సేవలను వినియోగించుకున్నారు. ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ నేపథ్యంలో మరిన్ని రూట్లలో వందే భారత్‌ రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే సికింద్రాబాద్‌-విశాఖపట్నంల మధ్య తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు పెడుతోంది. అయితే…

AP

ఏపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకంలో రాగి జావా…

స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జగనన్న గోరు ముద్దు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మెనులో మరో పోషకాహారం అందించనున్నారు.   44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్ధులకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి…

AP

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం..

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక రూలింగ్ ఇచ్చారు. ఇకపై సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీకర్ పోడియం దగ్గరకు రాకూడదని స్పష్టం చేశారు. అలా వస్తే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అవుతారుని చెప్పారు. ఈ రూల్‌ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సభ గౌరవాన్ని, హోదాలకు తగ్గించే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు స్పీకర్. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకే రూలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అటు టీడీపీ సభ్యుల తీరు…

AP

అధికారం తలకెక్కిన వైసీసీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు–: పవన్ కళ్యాణ్..

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. అధికారం తలకెక్కిన వైసీసీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని జనసేన చీఫ్‌ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయంటూ ఒక ప్రకటన విడుదల చేశారు పవన్‌ కల్యాణ్‌. ‘అధికారం తలకెక్కిన వైసీసీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు. సందిగ్ధంలో…

APTELANGANA

నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో రాణించాలి…

అల్లాదుర్గం. ఉన్నత చదువులు చదువుకున్న నిరుద్యోగ యువకులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ప్రైవేట్ రంగంలో ప్రవేశించి ఉపాధి పొందవచ్చు అని అల్లాదుర్గం నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు కంచరి బ్రహ్మం అన్నారు. అల్లాదుర్గం అసెంబ్లీ సాధన సమితి ఆధ్వర్యంలో అల్లాదుర్గం ఐబి చౌరస్తాలోని శ్రీవాణి విద్యానిలయంలో శాశ్విత డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని. ఉన్నత…

APHealthNationalTELANGANA

దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల…

దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. 126 రోజలు తర్వాత శనివారం కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. శనివారం ఏకంగా 800 కన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే దేశంలో కొత్తగా కరోనా వేరియంట్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. భారతదేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ XBB1.16 కేసుల సంఖ్య 76 నమోదు అయ్యాయని INSACOG డేటా వెల్లడించింది. XBB 1.16 వేరియంట్ మొదటిసారి జనవరిలో కనుగొనబడింది. ఫిబ్రవరి నెలలో 59…

AP

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కి షాక్..

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి పట్టభద్రులు షాక్ ఇచ్చారు. శాసన మండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరించి విజయకేతనం ఎగురవేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా గ్రాడ్యుయేట్ స్థానాల్లో మాత్రం ఎదురుగాలి వీచింది. టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు పట్టంగట్టారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించగా.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ…