TELANGANA

TELANGANA

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు రూ. 10 వేల జరిమానా విధించింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు చూపకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతంలో ఆమెపై పిటిషన్ దాఖలైంది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి…

TELANGANA

హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి

హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. చారిత్రాత్మక హుస్సేన్‌ సాగర్‌కు ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడైంది. ఈ సాయంత్రం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ దీన్ని ప్రారంభించారు. అదే- లేక్ ఫ్రంట్ పార్క్. మొత్తం 26 కోట్ల రూపాయలతో ఈ పార్క్‌ను నిర్మించింది హెచ్ఎండీఏ. ఇందులో పార్క్ నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు, సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలను వ్యయం…

APTELANGANA

కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక

రాయ్‌పూర్: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అఖిల…

TELANGANA

టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ త్వరలోనే ఐపీవో

టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ త్వరలోనే ఐపీవోకు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే భారత్ లో ఇదే అతి పెద్ద ఐపీవో అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలే టాటా సన్స్ ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా వర్గీకరించింది. ఈ కేటగిరిలోకి వచ్చిన ఏ కంపెనీ అయినా నిబంధన ప్రకారం మూడు సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లలో లిస్టవ్వాలి. సెప్టెంబరు 14వ…

TELANGANA

రాయ్‌పూర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి

రాయ్‌పూర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వాడివేడిగా విమర్శలు, ప్రతి విమర్శలను సంధించుకుంటోన్నారు. ఆరోపణలు- ప్రత్యారోపణలకు దిగుతున్నారు అన్ని పార్టీల నాయకులు. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన సస్పెండెడ్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ తెరపైకి వచ్చారు. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై నిప్పులు చెరిగారు. ఘాటు విమర్శలను సంధించారు. ఒవైసీ వంటి…

TELANGANA

తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి రోజులు

తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి రోజులు కనిపిస్తున్నాయి. అంతా సాఫీగా పని చేసుకుంటూ పోతోంది. హైకమాండ్ మొత్తం హైదరాబాద్‌కు దిగి వచ్చి రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు, భారీ బహిరంగసభతో దేశం మొత్తం తమ వైపు చూసుకునేలా చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం కీలక నిర్ణయాలు , ప్రకటల కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది. బహిరంగసభతో బలప్రదర్శన కూడా చేయబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పాజిటీవ్ వాతావరణం ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ను…

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల నేపథ్యంలో దూకుడు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల నేపథ్యంలో దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ, కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీట్ చేసే పనిలో పడింది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 16వ…

NationalTELANGANA

రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది.

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల మందికి పైగా మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. వారిలో 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేశారు. ఒక్కో రీజియన్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో తొలి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. ప్రథమ బహుమతిగా 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు, తృతీయ 10,000 రూపాయల మొత్తాన్ని వారికి…

TELANGANA

మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ పునఃప్రారంభం

భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయి. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ…

TELANGANA

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక అప్‌డేట్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్‌ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్ 4, 5, 6, 8వ తేదీల్లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్‌…