TELANGANA

TELANGANA

అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..!

తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలగా మంచిగా మీరు మమ్మల్ని చూసుకుంటారని మంత్రి సీతక్క అన్నారు. లేని తల్లి గురించి అవమానకరంగా మాట్లాడిన తాత మధును వెంటనే సస్పెండ్ చెయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఈ విషయంపై కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాతా మధు సభ్యత్వం తొలగించాలని అన్నారు. స్పీకర్ పై అనుచిత వాఖ్యల నేపథ్యంలో మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. తాతా మదు, నవీన్ రెడ్డిపై చర్యలు…

TELANGANA

ఇది దుశ్శాసన సభ.. మహిళా నేతల జుట్టు పట్టుకుని ఈడ్చేస్తారా?: కేటీఆర్.

ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్లిన ప్రతిపక్ష సభ్యులపై పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి 1000 రోజులుగా పాలన సాగిస్తోందని, దీనిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తే తమపై ఉక్కుపాదం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో నిరసన తెలిపినట్లే తాము కూడా నిరసన తెలిపేందుకు యత్నించామని,…

TELANGANA

కొండా సురేఖ స్థానంలో ఎవరు?.. కేబినెట్‌ విస్తరణపై పీసీసీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు..

కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించిన నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం కేబినెట్‌ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.ఇటీవల తాను ఢిల్లీ వెళ్లినప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డికి సంబంధించిన అంశాలపైనే అధిష్ఠానంతో చర్చ జరిగిందని తెలిపారు.కొండా సురేఖను మంత్రి వర్గం…

TELANGANA

సమస్యలు గాలికొదిలేసి దేనికి ఈ సంబరాలు?: రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు విమర్శలు..

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన వేడుకలను జరుపుకోవడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని సంబరాలు చేసుకుంటోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల తీరు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చందంగా తయారైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పరిపాలనా విధానాన్ని, ఆయన పనితీరును ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుత…

TELANGANA

మాజీ మంత్రి కొండా సురేఖ దారి ఎటు..? కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు వైరల్..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ దారి ఎటు? గురువారం సాయంత్రం మీడియాతో చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. ఆమె ప్రెస్ మీట్ చూసినవాళ్లు మాత్రం, పార్టీ మారడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పలువురు రాజకీయ నేతలు. తాజాగా ఆమె ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వెనుక అసలు కారణమేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తర్వాత మీడియా ముందుకొచ్చారు మాజీ మంత్రి కొండా సురేఖ. చెప్పాల్సిన వన్నీ…

TELANGANA

కేసీఆర్‌కు బిగ్ షాక్..! సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ మహా ధర్నాచేయాలని నర్ణయించింది. అందుకోసం ఈనెల 6వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. గత వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అటు అసెంబ్లీకి సైతం హాజరుకాకుండా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్…

TELANGANA

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్..!

సీయం రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుండి కొండా సురేఖ బర్తరప్ అవుతుందా లేదా అన్న అనుమానాలకి ఎండ్ కార్డ్ వేస్తూ ఎట్టకేలకి కొండా సురేఖని బర్తరప్ చేస్తూ AICC కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో ప్రస్తుతం కొండా సురేఖ వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే విషయం పై కొండా సురేఖ మాట్లాడుతూ తనకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తనని క్యాబినెట్ నుండి తప్పించారంటూ వాపోయారు. పార్టీ పంపిన షోకాజ్…

TELANGANA

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..! సీఎం పై సంచలన కామెంట్స్!

మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సురేఖను తొలగించకపోతే తాను తప్పుకొంటానని అధిష్ఠానాన్ని రేవంత్‌ బెదిరించారని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకముందే.. తన బర్తరఫ్‌ను ఆమె ధ్రువీకరించారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడిన సురేఖ పలు కీలక విషయాలను వెల్లడించారు.తనను తొలగించే ముందు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.…

TELANGANA

2027 వరకు ఎల్‌నినో.. డబ్ల్యూఎంఓ సంచలన హెచ్చరిక.. భారత్‌కు మరో వాతావరణ ముప్పు..

వాతావరణ మార్పులపై ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంఓ) కీలక హెచ్చరిక చేసింది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం వేగంగా బలపడుతోందని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది చాలా తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు.. ఎల్‌నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు 100 శాతం అవకాశం ఉందని తాజా అంచనాలో వెల్లడించింది.సెప్టెంబర్‌ 3న విడుదల చేసిన తాజా నివేదికలో డబ్ల్యూఎంవో ఇంతటి అధిక స్థాయి విశ్వాసంతో ఎల్‌నినో కొనసాగింపుపై అంచనా…

TELANGANA

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రాజ్‌నాథ్‌సింగ్, రామ్మోహన్‌నాయుడితో భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’కు రాజ్ నాథ్ సింగ్ ను ముఖ్య అతిథిగా సీఎం ఆహ్వానించారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో భాగమైన డిఫెన్స్ ఎక్స్‌పోలో…