TELANGANA

APTELANGANA

ఏపీ, తెలంగాణల్లో కలకలం

అమరావతి: ఏపీ, తెలంగాణల్లో కలకలం చోటు చేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సోదాలకు పూనుకున్నారు. ఈ తెల్లవారు జాము నుంచీ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు నివాసాలపై మెరుపు దాడులు చేపట్టాయి. వామపక్ష తీవ్రవాద భావజాలం ఉన్న వారు ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు ఈ తనిఖీలు చేస్తోన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఏకకాలంలో 60 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతుండటం…

APNationalTELANGANA

తెలంగాణలోని ఈ ఆలయంలో గాంధీజీ పాలరాతి విగ్రహం…

నేడు మహాత్మాగాంధీ పుట్టినరోజు…మన దేశానికి స్వేచ్ఛావాయుువులను అందించడానికి జాతిపతి మహాత్మ గాంధీ కీలక పాత్ర పోషించాడు. భారతదేశంలో చాలామంది గాంధీజీని దేవునిగా కొలుస్తారు. అంతేకాకుండా, దేశంలో ఏకంగా ఆయనకు ప్రత్యేకించి దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే, దేశంలో గాంధీజీ ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, తెలంగాణలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం. ఈ ఆలయంలోని గాంధీజీ విగ్రహం పాలరాతితో నిర్మించారు. రండి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చే గాంధీ ఆలయం గురించి గాంధీ జయంతి నాడు…

TELANGANA

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్ల రగడ

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్ల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. పీహెచ్. డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా గాంధీ జయంతి సాక్షిగా మరోమారు పీహెచ్. డీ అడ్మిషన్ల వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై గత కొద్దిరోజులు కేయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు యూనివర్సిటీ విద్యార్థులను అమానుషంగా కొట్టారని కూడా వారు ఆరోపించారు. పోలీసుల చర్యపై బీజేపీ, కాంగ్రెస్…

TELANGANA

బండి సంజయ్ ఇంటి వద్ద బైకర్ల హల్‌చల్- తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార…

TELANGANA

తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదల

న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అఖిల…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు రూ. 10 వేల జరిమానా విధించింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు చూపకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతంలో ఆమెపై పిటిషన్ దాఖలైంది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి…

TELANGANA

హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి

హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. చారిత్రాత్మక హుస్సేన్‌ సాగర్‌కు ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడైంది. ఈ సాయంత్రం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ దీన్ని ప్రారంభించారు. అదే- లేక్ ఫ్రంట్ పార్క్. మొత్తం 26 కోట్ల రూపాయలతో ఈ పార్క్‌ను నిర్మించింది హెచ్ఎండీఏ. ఇందులో పార్క్ నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు, సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలను వ్యయం…

APTELANGANA

కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక

రాయ్‌పూర్: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అఖిల…

TELANGANA

టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ త్వరలోనే ఐపీవో

టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ త్వరలోనే ఐపీవోకు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే భారత్ లో ఇదే అతి పెద్ద ఐపీవో అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలే టాటా సన్స్ ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా వర్గీకరించింది. ఈ కేటగిరిలోకి వచ్చిన ఏ కంపెనీ అయినా నిబంధన ప్రకారం మూడు సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లలో లిస్టవ్వాలి. సెప్టెంబరు 14వ…

TELANGANA

రాయ్‌పూర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి

రాయ్‌పూర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వాడివేడిగా విమర్శలు, ప్రతి విమర్శలను సంధించుకుంటోన్నారు. ఆరోపణలు- ప్రత్యారోపణలకు దిగుతున్నారు అన్ని పార్టీల నాయకులు. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన సస్పెండెడ్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ తెరపైకి వచ్చారు. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై నిప్పులు చెరిగారు. ఘాటు విమర్శలను సంధించారు. ఒవైసీ వంటి…