TELANGANA

TELANGANA

సింగరేణి మనుగడకు కొత్త ప్లాన్.. రాబోయే 15 ఏళ్ల కోసం కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు..!

దక్షిణ భారతదేశంలో ఏకైక ప్రధాన బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రానున్న రోజుల్లో తన సేవలను మరింత విస్తృతం చేయాలని, కొత్త గనులు సాధించి పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు తోడ్పాటును అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో శనివారం సింగరేణి సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి గనుల ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్…

TELANGANA

‘అరుంధతి పశుపతిలా కేసీఆర్‌ను బంధించారు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ప్రతిపక్షాల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు, ప్రజా కళాకారుడు గద్దరన్నకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.   ఆడబిడ్డల ఫోన్లు వినేవాడు…

TELANGANA

వైద్య చరిత్రలోనే అద్భుతం.. ఒకేసారి 5 అవయవాల మార్పిడితో యువకుడికి పునర్జన్మ..!

వైద్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన, క్లిష్టమైన ఘనతను సొంతం చేసుకుని హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే రోగికి ఒకే సమయంలో ఏకంగా ఐదు కీలక అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసి, దేశ వైద్య రంగం చూపును తనవైపు తిప్పుకుంది. కార్పొరేట్ ఆస్పత్రులకే సవాల్ విసిరేలా, ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సరికొత్త అద్భుతం జరగడం భారతీయ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.   మృత్యువుపై పోరాటం సిరిసిల్ల…

TELANGANA

మూసీ పునరుజ్జీవనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ రూపురేఖలను మార్చేసే ప్రతిష్టాత్మక ‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు’ కీలక దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి దశ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తొలి విడతలో భాగంగా రూ. 7,345 కోట్ల భారీ బడ్జెట్‌తో 21 కిలోమీటర్ల మేర మూసీ నది సుందరీకరణ, పునరుద్ధరణ పనుల టెండర్లకు క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అంతేకాదు, ఈ మెగా ప్రాజెక్టు పనులను…

TELANGANA

మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ..! నేను రెడీ..! మీరు సిద్ధమా..?

మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం –రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల ను వివరిస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావుకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. లేఖతో పాటు వీడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సాప్ ద్వారా పంపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని…

TELANGANA

స్పీడ్ పోస్టులో గంజాయి దందా.. భారీ నెట్‌వర్క్ బట్టబయలు చేసిన హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్..

భారత తపాలా శాఖకు చెందిన స్పీడ్ పోస్ట్ సేవలను అడ్డంపెట్టుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న భారీ అంతరాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్‌-న్యూ) అధికారులు రట్టు చేశారు. ఝార్ఖండ్ కేంద్రంగా సాగుతున్న ఈ నెట్‌వర్క్‌కు చెందిన ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేయడంతో పాటు, హైదరాబాద్‌లో గంజాయి కొనుగోలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   పోలీసుల కథనం ప్రకారం, ఝార్ఖండ్‌లోని గిరిడ్ జిల్లాకు చెందిన సత్యం మిశ్రా ఈ…

TELANGANA

తొలి పేపర్ లెస్‌గా తెలంగాణ కేబినెట్ సమావేశం..

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రంలో తొలిసారి పేపర్ లెస్‌గా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఎర్పాటు చేశారు. ఘతంలో మంత్రి శ్రీధర్ బాబు ఫైలెట్ ప్రాజెక్ట్ క్రింద దీన్ని ఎర్పాటు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. ఈ-క్యాబినెట్ విధానంలో రాష్ట్రంలోని మంత్రులందరు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం ఎర్పాటు చేశారు.   వీబీ జీ-రామ్ పథకం.. అయితే తెలంగాణకు ప్రధాన కార్యదర్శి…

TELANGANA

మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ..!

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసేందుకు, కంప్యూటర్ ల్యాబ్‌ల వినియోగాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,288 ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 1,644 మంది ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.   1,700 స్కూళ్ల కోసం.. మొత్తం ఇన్‌స్ట్రక్టర్లలో సమగ్ర శిక్ష పరిధిలో…

TELANGANA

పాలనపై చర్చకు సిద్ధం.. తేదీ చెప్పండి: రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ సవాల్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత పాలన, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ చర్చకు సంబంధించిన తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.   ఇటీవల రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి…

TELANGANA

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. జులై 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతోంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న కేబినెట్ హాల్‌లో జరిగే ఈ 34వ మంత్రిమండలి భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.   కేబినెట్ సమావేశం ఖరారు కావడంతో సచివాలయంలో పరిపాలనా పరమైన హడావుడి మొదలైంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన…