TELANGANA

TELANGANA

ఈసీ లక్షలాది ఓట్లను తొలగించింది: మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణ..

తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం (ఈసీ) విచక్షణారహితంగా లక్షలాది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.నగరంలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించలేదని, ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులే ఎక్కువగా నష్టపోయారని…

TELANGANA

భూలక్ష్మి పేరుతో కవిత సంచలనం..! వారికి ఎకరం భూమి ఫ్రీ..!

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేదల సంక్షేమం లక్ష్యంగా ఓ భారీ ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం చొప్పున భూమిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. పేదల ఆర్థికాభివృద్ధికి భూమే మూలాధారమని…

TELANGANA

22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తామన్నారు. దీనిపై బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండవచ్చుని మంత్రి స్పష్ట్రం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నామని, బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హమీ ఇచ్చారు. దీనికోసం ఎవరు…

TELANGANA

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లను నీరుగార్చే కుట్ర..! రేవంత్ ప్రభుత్వంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్..

తెలంగాణలో పేదల సంక్షేమానికి సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పథకాలను యథాతథంగా కొనసాగించాలని, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్…

TELANGANA

రేవంత్ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉంది: హరీశ్ రావు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని, దానిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.సోమవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి నివాసానికే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య ప్రజల గతి ఏమిటి?” అని ప్రశ్నించారు.…

TELANGANA

తెలంగాణలో ‘సర్‌’ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 92 లక్షల మందికి నోటీసులు..!

తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. సర్‌కు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించిన 2,64,87,214 మంది పేర్లతో ముసాయిదా జాబితా రూపొందించినట్లు చెప్పారు.మొత్తం ఓటర్లలో 78.03 శాతం మంది పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు 73 లక్షల మంది ఓటర్లు…

TELANGANA

ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌తో కలవను: కల్వకుంట్ల కవిత..

తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీతో భవిష్యత్తులో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, “ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయను” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగత సంబంధాలు వేరని, రాజకీయాలు వేరని ఆమె తేల్చి చెప్పారు. అయితే, బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా చేయడం తమ సిద్ధాంతం కాదని కూడా అన్నారు.పార్టీ నుంచి తనను బహిష్కరించిన తీరుపై…

TELANGANA

బీఆర్ఎస్ చేతబడి చేయిస్తోంది.. సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు..!

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో శనివారం ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని, యువత…

TELANGANA

టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. వచ్చే వారం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర..!

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రెండు కీలక ప్రకటనలతో ఉద్యోగార్థుల్లో కొత్త…

TELANGANA

కల్తీకి చెక్.. తెలంగాణలో ‘టీజీ సేఫ్’ ఏర్పాటు..!

తెలంగాణలో ఆహార, ఔషధాల నాణ్యతను పర్యవేక్షించేందుకు, కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వేర్వేరుగా పనిచేస్తున్న ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ), ఔషధ నియంత్రణ (డ్రగ్స్ కంట్రోల్) విభాగాలను విలీనం చేస్తూ ఏకీకృత పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ కొత్త సంస్థకు ‘టీజీ సేఫ్’ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) అని నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు…