బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు రూ. 10 వేల జరిమానా విధించింది. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు చూపకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతంలో ఆమెపై పిటిషన్ దాఖలైంది. 2018 ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి…