TELANGANA

TELANGANA

సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్..

బిఆర్ఎస్ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మికుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి ఏమైనా చూసుకుందామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ తరహాలో పనిచేయాలంటూ బొగ్గు గని కార్మికులకు పిలుపునిచ్చారు. పని చేస్తే పెద్ద ఎత్తున చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు సింగరేణి జిఎం ఆఫీస్‌ను తగలబెడితే డబ్బులు అవే వస్తాయి అంటూ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.   శాంతి భద్రతలకు…

TELANGANA

పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు పోక్సో కేసుకు సంబంధించి మల్కాజ్‌గిరి కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మేరకు మంగళవారం ప్రాసిక్యూషన్ పిటిషన్‌పై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.   విచారణ కోసం భగీరథ్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, కోర్టు మూడు రోజులకు మాత్రమే అనుమతించింది. దీంతో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని…

TELANGANA

సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ..!

సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. రాష్ట్రంలో కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు ఈ సందర్భంగా సీఎంకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు పి. సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావు, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.   కేంద్రం వైఖరిపై…

TELANGANA

రైతులపై ప్రేమ ఉంటే ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. కేంద్రానికి పొన్నం సవాల్..

పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తూ బీజేపీ ఇబ్బంది పెడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ‘రైతు ఘోస – బీజేపీ భరోసా’ పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామా ఆడుతుందన్నారు.   నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా…

TELANGANA

మేడ్చల్ హోటల్లో పాకిస్తాన్ ఏజెంట్ కలకలం..

పాకిస్తాన్‌ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జయీద్ ఖాన్ ప్రస్తుతం మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు.   దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనుమానితులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించినట్లు విచారణలో బయటపడింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం దేశ భద్రతకు ముప్పని తెలిసి కూడా అతడు…

TELANGANA

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రిపరేషన్ సాగుతోందా..?

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికలకు ఇప్పుటి నుంచే బీఆర్ఎస్ ప్రిపరేషన్ సాగుతోందా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలని కేడర్‌ను సిద్ధం చేస్తోందా? ఈ నేపథ్యంలో రోజుకో నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశాలకు ఆ పార్టీ ప్లాన్ చేసిందా? కేడర్‌లో ఉత్సాహాన్ని నూరిపోయే ప్రయత్నం చేస్తోందా? అదే సమయంలో అధికార పార్టీ వ్యాఖ్యలపై కౌంటరిచ్చే ప్రయత్నం చేస్తోంది.   గ్రేటర్‌లో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలకు ఇప్పటి నుంచి రెడీ అవుతోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ చేసింది.…

TELANGANA

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..! రాష్ట్రంలో ప్రీపెయిడ్ విద్యుత్‌ స్మార్ట్ మీటర్లు..

రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లు మినహా అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్ఎస్)లో చేరాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం సమావేశమైన కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లు మినహా మిగిలిన అన్ని గృహ, వాణిజ్య కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు.   గత ప్రభుత్వ ఒప్పందాన్నే అమలు చేస్తున్నాం: మంత్రి…

TELANGANA

తెలంగాణలో భూముల ధరల పెంపుకు ముహూర్తం ఫిక్స్..!

రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ‘రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ’ (ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం) ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.   వివిధ శాఖల…

TELANGANA

నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం..!

రాష్ట్ర కేబినెట్ మీటింగ్ శనివారం సెక్రటేరియట్ లో జరగనున్నది. ఈ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ కు మంత్రులతో పాటు ముఖ్య అధికారులంతా హాజరు కానున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఆసరా ఫించన్లు పెంపు, ఇందిరమ్మ ఇళ్లు రెండో ఫేజ్, జర్నలిస్టులకు ఇళ్లు, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన పొదుపు, సోలార్ వినియోగం తో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాలపై డిస్కషన్ చేసే ఛాన్స్ ఉన్నది. కొత్త పథకాలపై కేబినెట్ నిర్ణయం…

TELANGANA

రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ..!

తెలంగాణలో ప్రస్తుతం పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం మొద్దునిద్ర పోతారని ప్రశ్నిస్తూ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 23న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, అన్నదాతల సమస్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కొండంత ధైర్యంతో బతికిన సాగు…