News

National

జీఎస్టీ తగ్గింపు ఆలోచనలో కేంద్రం.. భారీగా తగ్గనున్న ధరలు..

ఆదాయపన్నులో రాయితీలతో వేతన జీవులకు కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మధ్యతరగతి, పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.   ప్రస్తుతం 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించడం లేదా ఈ శ్లాబ్ లోని పలు వస్తువులను 5 శాతం శ్లాబులోకి మార్చడం వంటి ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మార్పుల వల్ల…

TELANGANA

సిగాచి ఫ్యాక్టరీ పేలుడుపై అనుమానాలు..?

హైదరాబాద్ శివారులోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫ్యాక్టరీలో ఏం జరిగింది? ఘటన వెనుక మానవ తప్పిదమే కారణమా? ఆ కంపెనీ ఓనర్ హైదరాబాద్‌లో ఉన్నారా? కేవలం సెబీకి సమాచారం ఇవ్వడం వెనుక అసలు కథేంటి? ఘటన జరిగి మూడు రోజులైనా ఎందుకు స్పందించలేదు? ప్రమాదంలో ఆపరేషన్స్ వ్యవహారాలు చూస్తున్న వ్యక్తి ఉన్నారా? అందుకే మేనేజ్‌మెంట్ సైలెంట్‌గా ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.   హైదరాబాద్‌లోని సిగాచి పరిశమ్రలో మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ కంపెనీని…

TELANGANA

మేడారం సమ్మక్క సారలమ్మ డేట్స్ ఫిక్స్..!

తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలను అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే ఈ మహా జాతర.. 2026వ సంవత్సరానికి సంబంధించి.. జనవరి 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్నట్లు జాతర పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు.   2026 జాతర ప్రధాన తేదీలు: జనవరి 28 – సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు ఆహ్వానం  …

AP

సీనియర్లకు చెక్ పెడుతున్న జగన్..!

వైసీపీ యూత్ వింగ్ మీటింగ్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పాదయాత్ర చేపట్టబోతున్నానని, అప్పుడు అందర్నీ ప్రత్యేకంగా కలుస్తానన్నారు. యూత్ వింగ్ నేతల అంతిమ లక్ష్యం ఎమ్మెల్యే కావడం అని ఉద్బోధించారు. జనంలోకి వెళ్లి, జనంతో మమేకమై స్థానికంగా బలపడాలన్నారు, సోషల్ మీడియాని వాడుకోవాలన్నారు. ఒకరకంగా ఇటీవల కాలంలో జగన్ పెట్టిన అన్ని మీటింగుల్లోకి ఇదే కాస్త ఆసక్తికరంగా ఉంది. మిగతా నేతలతో మొక్కుబడిగా మాట్లాడి ముగించిన జగన్, యువ నేతలతో మాత్రం…

AP

ఏపీ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు మరోసారి పాత రోజులు గుర్తొచ్చే అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మద్యం దుకాణాల లోపలే తాగడానికి ప్రత్యేక గదులు ఉండేవి అవే పర్మిట్ రూమ్స్. అయితే, వాటిని రద్దు చేసిన తర్వాత బహిరంగంగా తాగడం పెరిగి, మద్యం ప్రియులకు అసౌకర్యంగా మారింది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం మళ్లీ పర్మిట్ రూమ్స్‌ను మంజూరు చేయడానికి సిద్ధమవుతోంది.   తాజా సమాచారం ప్రకారం, ఈ పర్మిట్ రూమ్స్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు…

AP

అమెరికాలో సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతిలో క్వాంటం వ్యాలీ: చంద్రబాబు..

అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ని ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీనిని 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు.   విజయవాడలో సోమవారం నిర్వహించిన ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన…

National

ప్రధాని మోదీ విదేశీ పర్యటన.. 8 రోజులు, 5 దేశాల్లో పర్యటన..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. జులై 2వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శిస్తారు. బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు, గ్లోబల్ సౌత్‌లోని కీలక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.…

TELANGANA

బీజేపీకి రాజాసింగ్ రాజీనామా..! కారణం అదేనా..?

తెలంగాణ బీజీపీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, ఇకపై బీజేపీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.   వివరాల్లోకి వెళితే, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజాసింగ్ ఈ మధ్యాహ్నం తన మద్దతుదారులతో కలిసి…

TELANGANA

బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్..!

రాయలసీమకు గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ (ఈఏసీ) నిరాకరించింది. ప్రాజెక్టుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు జారీ చేసింది.ట్రిబ్యునల్ తీర్పే ప్రధాన అడ్డంకిపోలవరం నుంచి బనకచర్ల వరకు గోదావరి జలాలను తరలించే…

AP

బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి: ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ..

సోలార్ విద్యుత్ పరిశ్రమ కోసం ఉలవపాడు వద్ద చేపట్టిన బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలోని దాసరి భవన్‌లో నిన్న పది వామపక్ష పార్టీల సమావేశం జరిగింది.   ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. అలాగే ఉలవపాడు వద్ద చేపట్టిన బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్…