News

National

మా కులం అధికారులకు ఇంత అన్యాయం చేస్తారా ?, సొంత పార్టీ లీడర్ తో సీఎం షాక్, అంతే !

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్ అధికారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాటలను కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప (yediyurappa) సమర్థించారు. శామనూరు శివశంకరప్ప (congress) ప్రకటనను సమర్థిస్తున్నానని, రాష్ట్రంలో లింగాయత్ అధికారులను నిర్లక్ష్యం చేస్తున్నారని బీఎస్ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.   కర్ణాటక ప్రభుత్వ అధికారుల్లో వీరశైవ లింగాయత్ అధికారులు అధిక సంఖ్యలో ఉన్నారని బీఎస్ యడియూరప్ప(yediyurappa) చెప్పడం ఇఫ్పుడు కర్ణాటక రాజకీయాల్లో…

APTELANGANA

ఏపీ, తెలంగాణల్లో కలకలం

అమరావతి: ఏపీ, తెలంగాణల్లో కలకలం చోటు చేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సోదాలకు పూనుకున్నారు. ఈ తెల్లవారు జాము నుంచీ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు నివాసాలపై మెరుపు దాడులు చేపట్టాయి. వామపక్ష తీవ్రవాద భావజాలం ఉన్న వారు ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు ఈ తనిఖీలు చేస్తోన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఏకకాలంలో 60 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతుండటం…

AP

ఏపీలో దసరా సెలవులపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం ఎట్టకేలకు తెర

ఏపీలో దసరా సెలవులపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది.ఈసారి దసరా సెలవులపై తాజాగా పలు తేదీలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం కోసం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం కాకుండా సెలవుల్ని మార్చి ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో విద్యార్ధులు, టీచర్లు, తల్లితండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ స్పష్టమైన ప్రకటన చేసింది. ఏపీలో అన్ని పాఠశాలలకు అక్టోబర్ 14 నుంచి 24 వరకూ సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం…

AP

ఏపీలో టీడీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు

ఏపీలో టీడీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 4న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో నారాయణ హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. ఈ సమయంలోనే సీఐడీ నోటీసులు జారీ చేసింది. లోకేశ్ ను విచారణకు పిలిచిన సమయంలోనే ఇప్పుడు సీఐడీ నారాయణకు నోటీసులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్…

APNational

కాబోయే భర్తతో వెళ్లిన యువతి, గస్తీ పోలీసులు ఏం చేశారంటే ?, కొన్ని గంటలు !

న్యూఢిల్లీ/లక్నో: కాబోయే భార్యను ఓ యువకుడు (lovers) బయట తిప్పుతున్నాడు. ఇదే సమయంలో ఏకాంతంగా వెలుతున్న జంటను ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని కొన్ని గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. యవతిని కొన్ని గంటల పాటు లైంగిక వేధింపులకు గురి చేశారు. ఇద్దరిని వదిలిపెట్టాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసుల విచారణలో యువతిని వేధింపులకు గురి చేసిన ముగ్గురిలో ఇద్దరు పోలీసులు ఉన్నారని వెలుగు చూడటం కలకలం రేపింది. హీరో సల్మాన్ ఖాన్…

APNationalTELANGANA

తెలంగాణలోని ఈ ఆలయంలో గాంధీజీ పాలరాతి విగ్రహం…

నేడు మహాత్మాగాంధీ పుట్టినరోజు…మన దేశానికి స్వేచ్ఛావాయుువులను అందించడానికి జాతిపతి మహాత్మ గాంధీ కీలక పాత్ర పోషించాడు. భారతదేశంలో చాలామంది గాంధీజీని దేవునిగా కొలుస్తారు. అంతేకాకుండా, దేశంలో ఏకంగా ఆయనకు ప్రత్యేకించి దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే, దేశంలో గాంధీజీ ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, తెలంగాణలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం. ఈ ఆలయంలోని గాంధీజీ విగ్రహం పాలరాతితో నిర్మించారు. రండి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చే గాంధీ ఆలయం గురించి గాంధీ జయంతి నాడు…

AP

తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలిక..?!

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ…

TELANGANA

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్ల రగడ

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్ల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. పీహెచ్. డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా గాంధీ జయంతి సాక్షిగా మరోమారు పీహెచ్. డీ అడ్మిషన్ల వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై గత కొద్దిరోజులు కేయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు యూనివర్సిటీ విద్యార్థులను అమానుషంగా కొట్టారని కూడా వారు ఆరోపించారు. పోలీసుల చర్యపై బీజేపీ, కాంగ్రెస్…

National

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణ మహాసంగ్రామానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. తెలంగాణలో ఈసారి విజయం సాధించాలని మొదటి నుంచి భావిస్తున్న కమలనాధులు… సమయం ముంచుకురావడంతో,ఎలా ముందడుగేయాలన్నదానిపై తర్జనభజన పడుతున్నారు.వాస్తవానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో… తెలంగాణలో ఆ ప్రభావం పడిందన్న భావన సర్వత్ర వ్యాపించింది. దీంతో బీజేపీలో చేరికలు ఆగిపోవడం,…

AP

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ 34 మార్గాల్లో 68 ట్రిప్పులు వేస్తూ పరుగులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ 34 మార్గాల్లో 68 ట్రిప్పులు వేస్తూ పరుగులు తీస్తున్నాయి. అయితే ఇందులో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేదని, అటువంటప్పుడు ఎన్నిపేర్లు పెట్టి.. ఎన్నిసార్లు తిప్పినా ఉపయోగం ఏమిటంటూ రోజురోజుకూ విమర్శలు ఎక్కువవుతున్నాయి. దీంతో ఆలోచనలో పడిన భారతీయ రైల్వే సామాన్యుల కోసం వందే సాధారణ్ పేరుతో రైళ్లను తీసుకురావాలని నిర్ణయించుకుంది. చెన్నైలో తయారీ : చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి…