ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అనే ముఖ్యమైన ఇతివృత్తంతో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లు, పర్యావరణ న్యాయ వ్యవస్థల బలోపేతంపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ అంతర్జాతీయ వేదికపై…

