National

National

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..!

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అనే ముఖ్యమైన ఇతివృత్తంతో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లు, పర్యావరణ న్యాయ వ్యవస్థల బలోపేతంపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ అంతర్జాతీయ వేదికపై…

National

మెడికల్‌ షాపుల్లో సీసీటీవీ నిఘాలోనే మందులు.. కేంద్రం కొత్త ప్రతిపాదనలు..

డాక్టర్ల సిఫార్సుతో విక్రయించే మందులపై కేంద్రం మరింత కఠిన నిఘాకు సిద్ధమవుతోంది. మందుల దుకాణాలు, ఇతర లైసెన్స్‌ పొందిన రిటైల్‌ కేంద్రాల్లో ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగా మందులు విక్రయించే సమయంలో సీసీ కెమెరా నిఘా తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీసుకొచ్చింది.సెప్టెంబర్‌ 8న జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం.. రిజిస్టర్డ్‌ వైద్యుడు సూచించిన ఏదైనా మందును హోల్‌సేల్‌ విక్రయాలు మినహా ఇతర మార్గాల్లో సరఫరా చేసే సమయంలో లైసెన్స్‌ పొందిన ప్రాంగణంలో…

National

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు ఖరారు.. కస్టమర్లపై భారం లేదన్న ఎన్‌పీసీఐ..

దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక ప్రకటన చేసింది. వ్యాపారులకు చేసే చెల్లింపులపై కొన్ని రుసుములను ప్రవేశపెట్టినప్పటికీ, ఆ భారం వినియోగదారులపై పడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం కోట్లాది మంది యూపీఐ వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది.ఎన్‌పీసీఐ తాజా నిబంధనల ప్రకారం, వ్యాపార చెల్లింపులలో (మర్చంట్ పేమెంట్స్) రూ. 2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం రుసుము వర్తిస్తుంది. అయితే, ఈ…

National

పహల్గాం దాడిపై బ్రిక్స్ దేశాల తీవ్ర ఖండన.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్..

న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాలు ఉగ్రవాదంపై కీలక తీర్మానం చేశాయి. 2025లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదం ‘ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం’ అనే విధానానికే తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాయి. ఈ మేరకు సెప్టెంబర్ 12న ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’లో తమ నిర్ణయాన్ని స్పష్టం చేశాయి.2025 ఏప్రిల్ 22న పహల్గాంపై జరిగిన ఉగ్రదాడిని అత్యంత కఠిన పదజాలంతో ఖండిస్తున్నట్లు బ్రిక్స్ నేతలు తమ…

National

పుతిన్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుక..!

బ్రిక్స్ సదస్సు-2026 నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్‌కు ఒక విశిష్టమైన సాంస్కృతిక కానుకను అందజేశారు. ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథమైన ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని ఆయనకు బహూకరించారు.సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. పరస్పరం కరచాలనం చేసుకుని, ఆలింగనం చేసుకున్నారు. ఈ భేటీలో పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై వారు కూలంకషంగా…

National

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు.. సర్వం సిద్ధమన్న ప్రధాని మోదీ..

ఈ వారాంతంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ సర్వ సన్నద్ధమైంది. ఈ కీలక కార్యక్రమానికి భారత్ సిద్ధంగా ఉందని, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరిగే ఈ 18వ బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలోని భారత్ మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.ఈ మేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ప్రపంచ నేతలకు స్వాగతం పలికేందుకు సిద్ధమైన భారత్…

National

“బాత్రూమ్‌లోకి కూడా వస్తారా?”.. మీడియాపై పినరయి విజయన్ ఫైర్..

కేరళ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి మీడియా ప్రతినిధులపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు గురించి మీడియా వెంటపడడంతో సహనం కోల్పోయారు. “నాతో పాటు బాత్రూమ్‌లోకి కూడా వస్తారా?” అని వారిపై విరుచుకుపడ్డారు.వివరాల్లోకి వెళితే… బుధవారం చంగనచేరికి వెళుతుండగా మార్గమధ్యంలో విజయన్ మధ్యాహ్నం కల్లిస్సేరిలోని పీడబ్ల్యూడీ రెస్ట్ హౌస్‌లో ఆగారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులు, ఆయన కారు దిగగానే చుట్టుముట్టి ఈడీ…

National

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు..

ప్రధాని మోదీ ముంబయి పర్యటన వేళ.. అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో ఉన్న నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) వద్ద మోదీ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా.. ఇద్దరు అనుమానితులను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వారిని వెంటనే ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు. ముంబయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదుపులోకి తీసుకున్న…

National

పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత క్రీడా జట్లకు పచ్చజెండా..!

భారత్, పాకిస్థాన్ మధ్య క్రీడా సంబంధాల పునరుద్ధరణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత క్రీడా బృందాలకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతించినట్లు వార్తలు వెలువడ్డాయి. 2027లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ (శాఫ్) గేమ్స్‌లో భారత క్రీడాకారులు పాల్గొంటారని పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని, దీంతో భారత బృందం పాకిస్థాన్‌కు వెళ్లనుందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలు…

National

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ హతం..

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మధ్య కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ యాసిర్ హతమయ్యాడు. యూస్‌మార్గ్‌ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.యూస్‌మార్గ్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారంపై నిఘా వర్గాల నుంచి అందిన కచ్చితమైన సమాచారంతో స్పెషల్ ఫోర్సెస్, 53 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సంయుక్తంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాల రాకను…