National

National

వరుస షాకులు, కేజ్రీవాల్ ఆ పిటీషన్ తిరస్కరించిన ట్రయల్ కోర్టు..!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న ఢిల్లీ హైకోర్టు కేజ్రివాల్ అరెస్ట్ అక్రమమని, ఈడి అధికారుల అరెస్ట్ ను రద్దు చేయాలంటూ దాఖలుచేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసి కేజ్రీవాల్ కు షాకిచ్చింది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కూడా మరొక గట్టిషాక్ ఇచ్చింది.   లాయర్లను కలిసే సమయం పెంచాలన్న…

National

కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించనున్న ఢిల్లీ హైకోర్టు..

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.   హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జాబితా ప్రకారం, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తారు.   తన అరెస్ట్‌తో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో తన తదుపరి రిమాండ్‌ను…

National

మణిపూర్ మౌనం.. కనిపించని ఎన్నికల హడావిడి..

మణిపూర్ గత ఏడాది నుంచి అల్లర్లతో అట్టుడికిపోయింది. మైతీ, కుకీ తెగల మధ్య జరుగుతున్న గొడవలతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ హింసాత్మకమైన ఘటనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయ పడ్డారు. చాలా ఇళ్లు, వాహనాలు, దుకాణాలకు ఆందోళన కారులు నిప్పంటించారు. హింసాత్మక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు సురక్షితప్రాంతాలకు తరలించి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు.   ఇక ప్రస్తుతానికి గొడవలు…

National

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా చైనీస్ హ్యాకర్స్.. మైక్రోసాఫ్ట్ సంచలన నివేదిక..

తైవాన్ అధ్యక్ష ఎన్నికలలో ట్రయల్ రన్ తర్వాత భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలను తారుమారు చేయడానికి చైనా కృత్రిమ మేధస్సుతో రూపొందించిన కంటెంట్‌ను ఉపయోగించవచ్చని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విశ్లేషణ ప్రకారం, ఉత్తర కొరియా మద్దతుతో చైనా సైబర్ గ్రూపులు యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియాలో ఎన్నికలను లక్ష్యంగా చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాయని వెల్లడించింది.   “చైనా తన ప్రయోజనాలకు లాభం చేకూర్చేందుకు AI- రూపొందించిన కంటెంట్‌ని సృష్టిస్తుంది. దాన్ని విస్తరింపజేస్తుంది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం…

National

డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు.. ఎక్కడో తెలుసా..?

లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైళ్లు దేశంలో తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీస్ మొట్టమొదటి సారిగా చెన్నైలో రానుంది. ఈ మేరకు ఆగస్టు నెలలో మొదటి డ్రైవర్ లెస్ మెట్రో రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది.   ఈ సందర్భంగా చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ అధికారులు మాట్లాడుతూ.. రాబోయే నెలలో అదనపు డ్రైవర్ లెస్ సెట్లు వస్తాయని వెల్లడించారు. 26 కిలో మీటర్ల మేరా 28 మెట్రో స్టేషన్లను ఈ ప్రాజెక్టులో భాగం చేయనున్నారు.…

National

కేజ్రీవాల్ ఫోన్ అనలాక్‌కు నో చెప్పిన ఆపిల్.. తలపట్టుకున్న ఈడీ….

తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఫోన్‌ను యూజర్ గోప్యత దృష్ట్యా అన్‌లాక్ చేయడానికి ఆపిల్ కంపెనీ నిరాకరించింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో సహకరించడానికి ఆపిల్ నిరాకరించినట్లు తెలుస్తోంది.   సెట్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించి డివైజ్ యజమాని మాత్రమే డేటాను యాక్సెస్ చేయగలరని ఆపిల్ తేల్చిచెప్పినట్లు సమాచారం.   నివేదికల ప్రకారం, కేజ్రీవాల్ ఫోన్‌ను తెరవడానికి ఈడీ అనేకసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఇక తప్పేది లేక ఆపిల్…

National

కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాతో సహా ఢిల్లీ మద్యంకేసు కీలక నిందితులంతా తీహార్ జైల్లోనే..!!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగి నెల రోజులైంది. వరుసగా తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరు కావడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరాకరించడంతో, ఆయన ఇంటికి వెళ్లి సోదాలు జరిపిన ఈడి అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.   భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఆసక్తికర పరిణామం అని…

National

కాశ్మీర్‌లో విరిగిపడిన కొండచరియలు.. జమ్మూ-శ్రీనగర్ రోడ్ బ్లాక్…

జమ్మూ-కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆదివారం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.   270 కిలోమీటర్ల పొడవైన హైవేపై ట్రాఫిక్‌ను త్వరగా పునరుద్ధరించేందుకు కిష్త్వారీ పథేర్, మెహర్-కెఫెటేరియా మోర్ వద్ద రోడ్డు క్లియరెన్స్ పనులు ఉదయం నుంచి కొనసాగుతున్నాయని, కాశ్మీర్‌ను దేశంలో మిగిలిన ప్రాంతాలతో కలిపే ఏకైక ఆల్-వెదర్ రోడ్ అని ట్రాఫిక్ విభాగం అధికారి ఒకరు తెలిపారు.   అర్ధరాత్రి సమయంలో బనిహాల్ ప్రాంతంలోని…

National

మరో నోటీసు.. రూ. 1,745 కోట్లు కట్టాలని కాంగ్రెస్‌కు ఐటీ సమన్లు..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ ప్రభుత్వం కష్టాల ఊబిలోకి నెట్టేలా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. 1,745 కోట్లు కట్టాలని సూచిస్తూ మరోసారి సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే(రెండ్రోజుల క్రితం) రూ. 1,823 కోట్లు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ…

National

ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ కీలక నిర్ణయం..! ..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి అదృష్టం పరీక్షించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. అదే సమయంలో ఏ రాజకీయ పార్టీ ముందుంది, ఏ అభ్యర్ధికి ప్రజల్లో ఆదరణ ఉందన్న దానిపై సర్వేలు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహణలో ఏజెన్సీలు తలమునకలై ఉన్నాయి. దీంతో నిత్యం ఎన్నో సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపై ఇప్పటివరకూ ఎన్నో సర్వేలు వచ్చేశాయి.…