ఉత్తర్ ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం
ఉత్తర్ ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని సర్వే చేయాలిన నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సమస్యను అలహాబాద్ హైకోర్టు నిర్ణయానికి వదిలివేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు విచారిస్తోంది. ఈ వివాదంపై దాదాపు 10 పిటిషన్లు అలహాబాద్ హైకోర్టు దాఖలైనట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.…