National

National

డ్యూటీలో మహిళా పోలీస్‌లు ఆభరణాలు ధరించడం, మేకప్ వేసుకోవడంపై బీహార్ పోలీసుల నిషేధం..

మహిళా పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు నగలు ధరించకూడదని, మేకప్ వేసుకోకూడదని బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాలు జారీచేసింది. దీనిని అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అదనపు డైరెక్టర్ జనరల్ (లా) పంకజ్ దరాద్ సంతకంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.   కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు అందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే, ముక్కు, చెవులకు రింగులు ధరించడం, గాజులు, ఆభరణాలు ధరించడం, విధుల్లో ఉన్నప్పుడు కాస్మొటిక్స్ ఉపయోగించడంపైనా…

National

కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.. పైలెట్ మృతి..

రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో బుధవారం మధ్యాహ్నం.. ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక ఫైటర్ జెట్‌ విమానం.. రతన్‌గఢ్ ప్రాంతంలోని ఓ పొలాల్లోకి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పైలెట్‌‌కి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఎయిర్ ఫోర్స్‌ అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.   ప్రమాదం వివరాలు సాధారణ శిక్షణ…

National

బ్రెజిల్‌లో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం..

బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ రాజధాని బ్రాసిలియాలో ఘన స్వాగతం లభించింది. సోమవారం బ్రాసిలియా చేరుకున్న ఆయనకు ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ సదస్సును విజయవంతంగా ముగించుకున్న ప్రధాని, అధికారిక పర్యటన నిమిత్తం బ్రాసిలియా విచ్చేశారు.   విమానాశ్రయంలో బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ మ్యూసియో మొంటెరో ఫిల్హో ఆయనకు లాంఛనంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్…

National

ఖాజాగూడ కబ్జా కేసులో కీలక మలుపు.. ఐదుగురికి హైకోర్టు నోటీసులు..!

ఖాజాగూడలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జారాయుళ్ల చెరనుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నడుంబిగించారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహించడంతో.. ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు. కబ్జా స్థలాల్లో జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్‌ రెడ్డి.. ఈమేరకు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణ…

National

బ్రిక్స్ వేదికగా పాక్‌పై మోదీ ఘాటు వ్యాఖ్యలు..!

ఉగ్రవాద బాధితులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని ఒకే తక్కెడలో తూయలేమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం విషయంలో కొందరు తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.   ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ…

National

డెంగ్యూపై పోరులో కీలక ముందడుగు.. త్వరలో అందుబాటులోకి టీకా..!

దేశంలో ఏటా వర్షాకాలంలో లక్షలాది మందిని వణికిస్తున్న డెంగ్యూ మహమ్మారికి అడ్డుకట్ట వేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రయోగాలు విజయవంతమైతే, ఏడాదిలోగా ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రఖ్యాత ఫార్మా సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ‘టెట్రావ్యాక్స్-డీవీ’ పేరుతో రూపొందించిన ఈ టీకా…

National

హిమాచల్ ప్రదేశ్ లో ‘క్లౌడ్ బరస్ట్’… 69కి పెరిగిన మృతుల సంఖ్య..

దేవభూమిగా పేరొందిన హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా జూన్ 20 నుంచి జూలై 3 మధ్యకాలంలో సుమారు 69 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.   వరదల తీవ్రతకు మండీ జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఇక్కడ…

National

జీఎస్టీ తగ్గింపు ఆలోచనలో కేంద్రం.. భారీగా తగ్గనున్న ధరలు..

ఆదాయపన్నులో రాయితీలతో వేతన జీవులకు కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మధ్యతరగతి, పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.   ప్రస్తుతం 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించడం లేదా ఈ శ్లాబ్ లోని పలు వస్తువులను 5 శాతం శ్లాబులోకి మార్చడం వంటి ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మార్పుల వల్ల…

National

ప్రధాని మోదీ విదేశీ పర్యటన.. 8 రోజులు, 5 దేశాల్లో పర్యటన..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. జులై 2వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శిస్తారు. బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు, గ్లోబల్ సౌత్‌లోని కీలక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.…

National

ఎల్‌వోసీ వద్ద భారీ కుట్ర భగ్నం.. సైన్యానికి చిక్కిన పాకిస్థానీ గైడ్..!

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన భారీ చొరబాటు కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. రజౌరీ జిల్లాలోని గంభీర్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన చొరబాటుదారులకు మార్గనిర్దేశం చేస్తున్న ఒక పాకిస్థానీ గైడ్‌ను సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారు. సైన్యం జరిపిన కాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు గాయపడి వెనక్కి పారిపోయినట్టు అధికారులు తెలిపారు.   రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం.. ఆదివారం…