National

National

భారత అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయం.. నేడే ‘విక్రమ్-1’ ప్రయోగం..!

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, దేశంలో తొలిసారిగా ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగానికి సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఈ చరిత్రాత్మక ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికైంది. ‘ఆగమన్’ (రాక) అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ మిషన్‌ను నేడు ఉదయం 11:30 గంటలకు ప్రయోగించనున్నారు. వాతావరణ పరిస్థితులు, భద్రతా అనుమతులకు లోబడి ఈ ప్రయోగం జరగనుంది.   విక్రమ్-1 రాకెట్…

National

భారత రైల్వేలో నవశకం..! పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు..

భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 17న ప్రారంభించనున్నారు. హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ హిత రవాణా దిశగా భారత రైల్వే వేసిన ఈ అడుగు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ…

National

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్..!

ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ దిగ్గజం ‘స్విగ్గీ’ వినియోగదారుల కోసం మరో సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో చేతులు కలిపి ఆన్-డిమాండ్ ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీని ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ సేవ ద్వారా ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సిలిండర్ వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. తొలిదశలో భాగంగా బుధవారం బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించారు.   వినియోగదారులు ఇకపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్…

National

భారత్‌ చుట్టూ విదేశీ నిఘా..? వరుస ఘటనల వెనుక ఏం జరుగుతోంది..?

భారత్‌తో పాటు దక్షిణాసియా ప్రాంతంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస ఘటనలు భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అమెరికా, ఉక్రెయిన్‌కు చెందిన వ్యక్తుల అరెస్టులు, బంగ్లాదేశ్‌లో అమెరికా ప్రత్యేక దళాల అధికారి అనుమానాస్పద మృతి వంటి పరిణామాలు ప్రాంతీయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పటివరకు ఏ అధికారిక సంస్థ కూడా నిర్ధారించలేదు.   నేపాల్‌ సరిహద్దులో అమెరికా పౌరుడు ఈ నెల ఉత్తరప్రదేశ్‌లోని సోనౌలి సరిహద్దు…

National

నార్వే గుహలో బయటపడ్డ 75,000 ఏళ్ల నాటి రహస్య జీవ ప్రపంచం..!

నార్వేలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఒక అద్భుతమైన చారిత్రక విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 75,000 ఏళ్ల క్రితం, చివరి హిమయుగంలోని ఒక వెచ్చని కాలంలో ఆర్కిటిక్ ప్రాంతం ఎంతటి గొప్ప జీవవైవిధ్యంతో విలసిల్లిందో తెలియజేసే కీలక ఆధారాలను ఒక గుహలో కనుగొన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ఈ ఆవిష్కరణ యూరోపియన్ ఆర్కిటిక్‌లో ఇప్పటివరకు కనుగొన్న జంతు సమాజాలలో ఇదే అత్యంత పురాతనమైనదిగా రికార్డు సృష్టించింది. ఈ గుహలోని సహజ నిక్షేపాలు సున్నితమైన ఎముకలు,…

NationalTELANGANA

వచ్చేస్తోంది బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్‌కు 3 కొత్త కారిడార్లు..!

భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు 2027 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్‌) కారిడార్‌లో భాగంగా సూరత్-బిలిమోరా మధ్య తొలి సర్వీసును నడపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గం దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ రైలు మార్గంగా నిలవనుంది.   508…

APNationalTELANGANA

వియత్నాంలో ఘోర ప్రమాదం..!15 మంది మృతి..

వియత్నాంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌ బోట్ సముద్రంలో బోల్తా పడి మునిగిపోయింది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.   ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన ‘ఏజీ-26751’ అనే పర్యాటక స్పీడ్‌ బోటులో భారత పర్యాటకులు సిబ్బందితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్…

National

బెంచ్‌పైకి కాగితాలు విసిరి.. సుప్రీంకోర్టులో పిటిషనర్ వీరంగం..!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ హద్దులు మీరు ప్రవర్తించాడు. న్యాయమూర్తులపై దూషణలకు దిగడమే కాకుండా, కేసు పత్రాలను వారి వైపు విసిరికొట్టి తీవ్ర గందరగోళం సృష్టించాడు. తక్షణమే అప్రమత్తమైన భద్రతా అధికారులు అతడిని కోర్టు హాలు నుంచి బలవంతంగా బయటకు పంపించారు.   అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ కేవీ విశ్వనాథన్,…

National

ఈ రాత్రికి ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తాం.. ట్రంప్‌ సంచలన ప్రకటన..

అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. గత రాత్రి భారీ దాడులు నిర్వహించామని తెలిపారు. అవసరమైతే మరోసారి కూడా అదే స్థాయిలో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్‌ తీరుతెన్నులు మారకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.   టర్కీలోని అంకారాలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని ప్రస్తావించారు. గత రాత్రి తీవ్ర స్థాయిలో దాడులు నిర్వహించామని, అవసరమైతే ఈ…

National

‘ఉగ్రం’ రైఫిల్‌కు కేంద్రం పచ్చజెండా..!

రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణకు చెందిన స్టార్టప్ సంస్థ ‘ద్విప డిఫెన్స్’ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 7.62×51 ఎంఎం ‘ఉగ్రం’ అసాల్ట్ రైఫిల్, భారత సైన్యం మరియు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నిర్వహించిన కఠిన పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించింది. ఈ ఫలితంతో కేంద్ర సాయుధ పోలీస్ బలగాల (సీఏపీఎఫ్) అమ్ములపొదిలోకి ఈ స్వదేశీ ఆయుధం చేరేందుకు మార్గం సుగమమైంది.   రక్షణ పరిశోధన మరియు…