National

National

నేడే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం..! 9 మంది మంత్రులతో తొలి కేబినెట్..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త ప్రభుత్వంలో హోం, పోలీస్, సాధారణ పరిపాలన వంటి కీలక శాఖలను విజయ్ తన వద్దే ఉంచుకోనున్నట్లు పార్టీ వర్గాలు శనివారం వెల్లడించాయి.   విజయ్‌తో పాటు తొలి విడతలో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం…

National

తమిళనాడులో ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకేనే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.   నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో…

National

బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్..! కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు (మే 7) అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి అధికారికంగా ముగిసింది. “భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, క్లాజ్ 2 ప్రకారం నాకు దఖలుపడిన అధికారాలను ఉపయోగించి, పశ్చిమ బెంగాల్ శాసనసభను 2026 మే 7 నుంచి రద్దు చేస్తున్నాను” అని గవర్నర్…

National

బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత .

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింస తీవ్ర రూపం దాల్చింది. బీజేపీ చారిత్రక విజయం సాధించిన రెండు రోజుల తర్వాత, ఆ పార్టీ కీలక నేత, ‘జెయింట్ కిల్లర్’గా పేరు పొందిన సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.   చంద్రనాథ్ రథ్ కారులో ప్రయాణిస్తుండగా…

National

సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల భారాన్ని తగ్గించి, సత్వర న్యాయం అందించే లక్ష్యంతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మినహా మిగతా జడ్జీల సంఖ్యను 33 నుంచి 37కు పెంచనుంది. ఈ మేరకు “సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026″కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.   న్యాయమూర్తుల సంఖ్య పెంపు ద్వారా సుప్రీంకోర్టు పనితీరు మెరుగుపడుతుందని,…

National

రాజీనామా చేయనంటున్న మమత.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజ్యాంగపరమైన ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో కొత్త శాసనసభ ఏర్పాటుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అధికారులు గవర్నర్‌కు సమర్పించడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ వద్దకు చేరడంతో, మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే మార్గం సుగమమైంది.   మరోవైపు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి…

National

ఆమెను బయటకు గెంటేయండి: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీపై సీనియర్ న్యాయవాది సంచలన వ్యాఖ్య‌లు..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ రాజీనామా చేసేందుకు నిరాకరించడంపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ప్రవర్తన క్షమించరానిదని, ఇది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే విసిరిన సవాల్ అని అభివర్ణించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.   “ఎన్నికల సంఘం ఫలితాలను ధ్రువీకరించిన క్షణం నుంచి ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోతారు.…

National

టీవీకేకు మద్దతుగా అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలను గెలుచుకున్న అన్నాడీఎంకేలో ఇప్పుడు భారీ ‘ముసలం’ మొదలైంది. పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ వైపు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం కార్యాలయంలో సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.   ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి…

National

బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి..?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకప్పటి తన రాజకీయ గురువైన మమతా బెనర్జీ స్థానంలో బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది.   విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎల్లుండి (శుక్రవారం) కోల్‌కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సువేందు అధికారిని…

National

విజయ్ తన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. దశాబ్దాల అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను విజయ్ చిత్తు చేసిన వైనం పెను రాజకీయ సంచలనంగా మారింది. ఇంతజేసీ విజయ్ పార్టీ స్థాపించింది రెండేళ్ల కిందటే. అయినప్పటికీ, తన ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా విజయ్ ఓటర్ల మనసులు గెలుచుకోగలిగాడు. విజయ్ గెలుపు ప్రస్థానంలో కీలకమైనది…