National

National

సరిహద్దులు దాటిన ‘బొద్దింకల ఉద్యమం’..! బయోలో ఆసక్తికర కొటేషన్స్….

భారత్‌లో వ్యంగ్యంగా పుట్టిన ‘బొద్దింకల ఉద్యమం’ ఇప్పుడు సరిహద్దులు దాటి పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు పాకింది. అక్కడి సోషల్ మీడియా వేదికలను ప్రస్తుతం ఈ ‘బొద్దింకల పార్టీలు’ ముంచెత్తుతున్నాయి. పాక్ లోని ప్రధాన రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ అక్కడి జెన్-Z యువత పెద్ద ఎత్తున కాక్రోచ్ మూవ్ మెంట్ ను లేవనెత్తుతున్నారు. అక్కడి పార్టీలను ప్రతిబింబించేలా కాక్రోచ్ పార్టీల పేర్లు పెట్టి.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.   భారత్‌లో పుట్టిన ‘సీజేపీ’ (CJP) వాస్తవానికి…

National

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాక్రోచ్ పార్టీ..! ఐదు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీని, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టిన కాక్రోచ్ పార్టీ..!

భారతదేశంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి, దాన్ని పెద్ద పార్టీగా చేసేందుకు దశాబ్దాల కాలం పడుతుంది. కేవలం 5 రోజుల్లో… అవును, కేవలం 5 రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించి, ఏకంగా దేశాన్ని ఏలుతున్న అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను దాటేసిన ఒక వింత పొలిటికల్ మూవ్‌మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   దాని పేరే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party – CJP). ఏంటి..…

National

పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ ఖతం.. పీఓకేలో ‘అజ్ఞాత వ్యక్తుల’ ఆపరేషన్..!

2019 పుల్వామా ఉగ్రదాడి మాస్టర్‌మైండ్స్‌లో ఒకడైన హంజా బుర్హాన్ అలియాస్ ‘డాక్టర్’ హతమయ్యాడు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ రాజధాని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.   చదువు పేరుతో వెళ్లి ఉగ్రవాదిగా.. హంజా బుర్హాన్ అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ దార్. పుల్వామా జిల్లా రత్నిపోరా ప్రాంతానికి చెందిన అతడు 2017లో ఉన్నత చదువుల కోసమంటూ పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘అల్-బదర్’లో చేరి కమాండర్‌గా ఎదిగాడు.…

National

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

దేశంలో కులగణన (Caste Census) ప్రక్రియపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును చేపట్టడానికి న్యాయస్థానం లైన్ క్లియర్ చేసింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వాటిని పూర్తిగా కొట్టివేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇటువంటి పరిపాలనాపరమైన…

National

బెంగాల్‌లో బీజేపీ మరో సంచలన నిర్ణయం..!

బెంగాల్ లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని ఇమామ్‌లు, ముఅజ్జిన్‌లకు, హిందూ దేవాలయాల అర్చకులకు అందిస్తున్న నెలవారీ గౌరవ వేతనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అలాగే కోల్ కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వెనుకబడిన తరగతుల జాబితా (OBR)ను రద్దు చేసి.. కోటా అర్హతను నిర్ణయించడానికి కొత్త ప్యానెల్ ఏర్పాటు కేబినేట్ అమోదం తెలిపింది.…

National

‘ఇన్‌స్టాగ్రామ్‌ అమ్మాయిల కోసమే’.. ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు..

ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వేదిక కేవలం అమ్మాయిల కోసమేనంటూ సోషల్‌ మీడియాలో రచ్చకు దారితీశారు.   సోషల్‌ మీడియాలో ప్రజల అలవాట్లు, వారి జీవితంలోని వివిధ దశలు ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై ఓ వైరల్‌ థ్రెడ్‌ నడుస్తోంది. అందులో ఫొటోలు పెట్టడం, రీల్స్‌ చేయడం, వంట ఫొటోలు షేర్‌ చేయడం వంటి పనులపై జోకులు పేలాయి. ఈ చర్చలోకి ఎంటర్‌ అయిన మస్క్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ అమ్మాయిల కోసమే…

National

అలర్ట్… ఈ నెల 20న మెడికల్ షాపులు బంద్..! కారణం అదేనా..?

దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన 12.4 లక్షలకు పైగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఆలిండియా అర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయంటూ కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫార్మసీ కంపెనీలు ఈ పోటీని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు చెబుతున్నారు.   అనియంత్రిత ఆన్‌లైన్ అమ్మకాలు,…

National

రూటు మార్చిన బెంగాల్ మాజీ సీఎం మమత..! న్యాయవాదిగా న్యాయస్థానానికి మాజీ సీఎం..

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూటు మార్చారు. ఎన్నికల తర్వాత తొలిసారి ఆమె బయటకు వచ్చారు. నల్లటి న్యాయవాది గౌను ధరించి న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పార్టీ ఘోర పరాజయం తర్వాత ఎన్నికల సందర్భంగా జరిగతిన హింసాకాండ ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం కలకత్తా హైకోర్టుకు హాజరయ్యారు.   రూటు మార్చిన బెంగాల్ మాజీ సీఎం మమత   బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ గురువారం కోల్‌కత…

National

ఉత్తర్‌ప్రదేశ్‌లో గాలివాన బీభత్సం.. 54 మంది మృతి..

ఉత్తరప్రదేశ్‌లో నిన్న‌ సాయంత్రం సంభవించిన పెను తుపాను తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షం, ధూళి, బలమైన ఈదురు గాలులతో కూడిన ఈ విలయానికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మృతుల సంఖ్య 54కి చేరింది. ఈ ప్రకృతి ప్రకోపానికి వందలాది చెట్లు నేలకూలాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.   అధికారిక లెక్కల ప్రకారం ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 16 మంది మరణించారు. భదోహీలో 15 మంది,…

National

రైతులకు గుడ్ న్యూస్.. పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి భారీ ఊరటనిచ్చింది. రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.   రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా, ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. పెట్టుబడి ఖర్చుపై 50 శాతం అదనంగా కలిపి కొత్త ధరలను ఖరారు చేశారు. వరి క్వింటాల్‌కు రూ.…