పెట్రోల్, డీజిల్ లభ్యత, ధరలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
రిటైల్ ఇంధన లభ్యతపై కేంద్రం భరోసా ఇచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టపోవడం పట్ల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే ఆ భారాన్ని దేశీయ వినియోగదారులపై మోపే పరిస్థితి రావొచ్చని అభిప్రాయపడ్డారు. దేశంలో చమురు సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. చమురు సరఫరాలో ఇబ్బందులేమీ లేవని హామీ…

