National

National

పీఓకేలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన… భారత్‌తో కలుస్తామని హెచ్చరిక..

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రావల్ కోట్‌లోని ఈద్గా మైదానంలో గత 22 రోజులుగా వేలాది మంది ప్రజలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదని, ఇకపై ఇస్లామాబాద్ నియంత్రణలో తాము ఉండబోమని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు.   ఈ ఆందోళనలో పాల్గొన్న పౌర హక్కుల కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రభుత్వం ఆహారం,…

National

భారత్‌లో నకిలీ వస్తువుల మార్కెట్‌పై ఉక్కుపాదం..! రూ. 4 లక్షల కోట్ల ఫేక్ మార్కెట్

అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు భారత్‌లో భారీగా విస్తరించిన నకిలీ వస్తువుల మార్కెట్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి. వెర్సాచీ, మైఖేల్ కోర్స్, జిమ్మీ చూ వంటి ప్రఖ్యాత కంపెనీలు నకిలీ సరుకును అరికట్టేందుకు రహస్య ఇన్వెస్టిగేటర్లను నియమించుకుంటున్నాయి. వీరు సాధారణ కస్టమర్ల రూపంలో మార్కెట్లలోకి వెళ్లి, నకిలీ వస్తువులను విక్రయించే వారి సమాచారాన్ని సేకరించి కంపెనీలకు అందిస్తున్నారు.   ఈ సమాచారం ఆధారంగా సదరు బ్రాండ్లు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి, నకిలీ సరుకును స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యలు…

National

అయోధ్య చోరీ కేసులో సరికొత్త సంచలన విషయాలు..

అయోధ్యలోని ప్రసిద్ధ శ్రీరామ జన్మభూమి దేవాలయ కానుకల చోరీ కేసులో సరికొత్త సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై అధికారికంగా ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్) నమోదు కావడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగడానికి ముందే.. ఆలయ ట్రస్ట్ అధికారులు తమ సొంత విచారణ ద్వారా నిందితుడి నుంచి దాదాపు రూ. 58 లక్షల నగదును రికవరీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చట్టపరమైన ప్రక్రియ ప్రారంభం కాకముందే ఇంత పెద్ద మొత్తంలో సొమ్మును…

National

స్టాలిన్‌కు షాకిచ్చిన వైకో.. ఆయనకు ఝలక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. డీఎంకే కూటమి నుంచి వైకో నేతృత్వంలోని ఎండీఎంకే తప్పుకున్న 24 గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎండీఎంకేకు చెందిన 150 మందికి పైగా ముఖ్య నేతలు, జిల్లా కార్యదర్శులు, ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు ఆదివారం డీఎంకే గూటికి చేరారు.   చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సమక్షంలో వీరంతా…

National

రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలు: అమిత్ షా..

రవాణా రంగంలో సహకార స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ‘భారత్ ట్యాక్సీ’ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించబోతోందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. రాబోయే రెండు సంవత్సరాల్లో దేశంలోని 500కు పైగా నగరాలు, పట్టణాల్లో ఈ సహకార మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నేడు గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు.   గుజరాత్‌లోని అన్ని ప్రధాన…

National

అయోధ్య విరాళాల వివాదం.. మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రియాంక్ ఖర్గే..

అయోధ్య రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారంటూ కర్ణాటక హోం మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే తప్పుబట్టారు. ఈ అంశంపై ప్రధాని తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్పష్టత ఇవ్వాలని శనివారం ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురి అరెస్టులు జరగడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా చేయడంతో ఈ వివాదం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.  …

National

కేతన్ అగర్వాల్ హత్య కేసులో ట్విస్ట్: పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న నిందితులు!

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కేతన్ ను లోహగఢ్ కోటపై నుంచి తోసేసి చంపిన కేసులో నిందితురాలైన అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ ప్లాన్ అంతా అవతలి వ్యక్తిదేనంటూ పోలీసుల విచారణలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.   రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్…

National

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు ‘నో’ చెప్పిన సుప్రీంకోర్టు..!

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణ.. రాయితీలపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కు చెందిన 22ఏళ్ల పిటిషనర్.. 2025 నీట్ యూజీ పరీక్షలకు హాజరయ్యాడు. సదరు అభ్యర్థి జనరల్ కేటగిరీకి చెందిన వాడైనా ఆర్థికంగా వెనకబడిన తరగతి (ఈడబ్ల్యుఎస్)కి చెందిన వాడన్న సర్టిఫికెట్ ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వార్షిక ఫీజులు 18.9లక్షల నుంచి 25లక్షల వరకు ఉండటంతో…

National

అంతా అయిపోయింది… అసెంబ్లీలో స్టాలిన్‌ను అనుకరించిన ముఖ్యమంత్రి విజయ్..

తమిళనాడు శాసనసభ మంగళవారం నాటి సమావేశాల్లో తీవ్ర వాదోపవాదాలు, నాటకీయ పరిణామాల మధ్య అట్టుడికింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష డీఎంకే మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.   శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, డీఎంకే పార్టీ పేరుతో అక్రమంగా నిధులు సేకరిస్తోందని ఆరోపించడంతో పాటు, అవినీతికి పాల్పడిన వారిని తమ…

National

భారత్‌కు అమెరికా భారీ రక్షణ బూస్ట్.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం..

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరో కీలక ముందడుగు పడింది. భారత సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే రెండు రక్షణ ఒప్పందాలకు అమెరికా ఆమోదం తెలిపింది. మొత్తం 428.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,700 కోట్లు) విలువైన ఈ ప్యాకేజీలు భారత ఆర్టిలరీ, వైమానిక దళాల నిర్వహణ సామర్థ్యాలను పెంచనున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక భాగస్వామి అని అమెరికా మరోసారి స్పష్టం చేసింది.   అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (డీఎస్‌సీఏ) ఈ ప్రతిపాదనలను…