National

National

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి..

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పుకు దారితీసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. అనంతరం, ఆయన స్థానంలో సీనియర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది.   నీట్ పేపర్ లీక్…

National

రాజకీయాల్లోకి ‘కాక్రోచ్’ పార్టీ..?

నీట్ పేపర్ లీక్ వివాదంపై నెల రోజులుగా సాగుతున్న ఆందోళనలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాతో ముగిశాయి. నిరసనలకు నాయకత్వం వహించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో సుదీర్ఘ పోరాటం ముగిసింది. అయితే, ఈ విజయం తర్వాత సీజేపీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తుందా? అనే చర్చ మొదలైంది. దీనిపై ఆ పార్టీ నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.   ఈ పరిణామాల అనంతరం ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన…

National

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొననున్న మమతా బెనర్జీ..

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. పోటీ పరీక్షల్లో సంస్కరణలు కోరుతూ యువత చేపట్టిన ఉద్యమానికి ఆమె తన మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా, జూలై 27న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని శుక్రవారం వెల్లడించారు.   ఇదే సమయంలో, లోక్‌సభలో టీఎంసీ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా సీనియర్…

National

ఎప్పుడైనా రండి.. చర్చలకు మేం రెడీ.. సీజేపీకి కేంద్ర మంత్రి ఆహ్వానం..!

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు నిరసనకారులతో మాట్లాడేందుకు ముందడుగు వేసింది.   నిరసనకారులకు కేంద్రం ఆఫర్   ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు, కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నాయకులకు చర్చల పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఆందోళనకారులకు అనుకూలమైన…

National

పార్లమెంటులో నీట్‌పై చర్చిద్దాం.. విపక్షాలకు కేంద్రం పిలుపు..

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించేందుకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై సభలో పారదర్శకంగా చర్చించడం ద్వారా విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చని ఆకాంక్షించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది.   విద్యార్థుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని…

National

మోదీ నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ భేటీ..

నీట్ పరీక్ష అక్రమాలు, విద్యార్థులపై లాఠీచార్జి అంశాలపై దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఆసక్తికర పరిణామాలకు వేదికైంది. లోక్ కల్యాణ్ మార్గ్లఓ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కలుసుకుని కొద్దిసేపు మాట్లాడారు. నిరసన ఉద్రిక్తతల నడుమ చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.   వివరాల్లోకి వెళితే, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధాని నరేంద్ర…

National

ఢిల్లీలో హింసాత్మక నిరసనలు.. 5 ఎఫ్ఐఆర్‌ల నమోదు..

నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో అవకతవకల అంశం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ మద్దతుదారులు, విద్యార్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నేడు ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. నిన్న‌ జరిగిన ఈ ఆందోళనల్లో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.   వివరాల్లోకి వెళితే.. నీట్ పేపర్ లీకేజీ…

National

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి..

ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ నిలిచివున్న ఒక సరకు రవాణా (కార్గో) నౌకపై జరిగిన భీకర దాడిలో నలుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. యుద్ధ వాతావరణం నడుమ జరిగిన ఈ ఘోర ఉదంతం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.   అధికారుల సమాచారం ప్రకారం.. గినియా-బిసావు దేశ పతాకంతో సముద్రంలో ప్రయాణిస్తున్న ‘ఎంవీ గోల్డెన్ లియో’ అనే వాణిజ్య నౌక ఒడెసా…

National

వర్షాల కోసం వింత పూజ.. గాడిదలకు గులాబ్ జామూన్లు తినిపిస్తున్న జనం..!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో స్థానికులు వర్షాల కోసం ఒక వింత ఆచారాన్ని ఆశ్రయించారు. నగరంలో తీవ్రమైన ఉక్కపోత, పొడి వాతావరణం నెలకొనడంతో.. వానలు పడాలని కోరుకుంటూ గాడిదలకు ‘గులాబ్ జామూన్లు’ తినిపించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గాడిదలకు ఎంతో ఇష్టంగా ఈ భారతీయ సంప్రదాయ స్వీటును తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం…

National

ఢిల్లీలో అఖిలపక్ష భేటీలో రగడ.. విపక్షాల వాకౌట్..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కొన్ని గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో గందరగోళం చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీలకు ఆహ్వానం పలకడాన్ని నిరసిస్తూ విపక్ష పార్టీల నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అయితే, ఇది కేవలం సాంకేతిక నిరసన మాత్రమేనని తెలిపి, కొద్ది నిమిషాలకే తిరిగి సమావేశంలో పాల్గొన్నారు.   సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల అజెండాను చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన, పార్లమెంటరీ…