National

National

ఆమెను బయటకు గెంటేయండి: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీపై సీనియర్ న్యాయవాది సంచలన వ్యాఖ్య‌లు..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ రాజీనామా చేసేందుకు నిరాకరించడంపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ప్రవర్తన క్షమించరానిదని, ఇది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే విసిరిన సవాల్ అని అభివర్ణించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.   “ఎన్నికల సంఘం ఫలితాలను ధ్రువీకరించిన క్షణం నుంచి ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోతారు.…

National

టీవీకేకు మద్దతుగా అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలను గెలుచుకున్న అన్నాడీఎంకేలో ఇప్పుడు భారీ ‘ముసలం’ మొదలైంది. పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ వైపు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం కార్యాలయంలో సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.   ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి…

National

బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి..?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకప్పటి తన రాజకీయ గురువైన మమతా బెనర్జీ స్థానంలో బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది.   విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎల్లుండి (శుక్రవారం) కోల్‌కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సువేందు అధికారిని…

National

విజయ్ తన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. దశాబ్దాల అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను విజయ్ చిత్తు చేసిన వైనం పెను రాజకీయ సంచలనంగా మారింది. ఇంతజేసీ విజయ్ పార్టీ స్థాపించింది రెండేళ్ల కిందటే. అయినప్పటికీ, తన ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా విజయ్ ఓటర్ల మనసులు గెలుచుకోగలిగాడు. విజయ్ గెలుపు ప్రస్థానంలో కీలకమైనది…

National

బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. స్పందించిన మమతా బెనర్జీ..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆమె తోసిపుచ్చారు. కౌంటింగ్ ఏజెంట్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, టీఎంసీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.   ఎగ్జిట్ పోల్స్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, 2021, 2024లోనూ…

National

డబ్బుతో కొనేశారు… ఎగ్జిట్ పోల్స్ పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. అవన్నీ బూటకమని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ (బీజేపీ) డబ్బులు ఇచ్చి, ఒత్తిడి చేసి మీడియా సంస్థల ద్వారా వాటిని ప్రసారం చేయించిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.   స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోకుండా నిరోధించడం, మే 4న…

National

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే.. !

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మళ్లింది. తాజాగా విడుదలైన వివిధ సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన హవాను కొనసాగిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. అదే సమయంలో దక్షిణాన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   అస్సాం రాష్ట్రంలో కాషాయ జెండా మరోసారి…

National

ధరలు పెరుగుతాయనే ఆందోళన, కొరత భయాలు.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ..

వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతుండటంతో ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళనతో పాటు పెట్రోల్, డీజిల్ కొరత భయాలతో హైదరాబాద్ నగరంలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద వరుస కడుతున్నారు. నిన్న, నేడు నగరవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూ కనిపించింది. నిల్వలు తగ్గిపోవడం లేదా విపరీతమైన డిమాండ్ కారణంగా పలు పెట్రోల్ బంకులను తాత్కాలికంగా మూసివేశారు.   పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా డీజిల్ దొరకడం లేదు.…

National

ఎన్నికలు అయిపోయాయి.. ధరల బాదుడు షురూ.. రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 29 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయని.. సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం పడబోతోందని ఆయన హెచ్చరించారు. “ఎన్నికల ఉపశమనం ముగిసింది, ద్రవ్యోల్బణం సెగ మొదలవుతోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు వచ్చిన లాభాలను మోదీ ప్రభుత్వం తన జేబులో వేసుకుందని.. ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రజలపై…

National

మరోసారి ఇరాన్ దూకుడు.. భారతీయులున్న ట్యాంకర్‌పై కాల్పులు..

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒమన్‌లోని షినాస్ ఓడరేవు సమీపంలో భారతీయ నావికులున్న ఒక రసాయన ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పులు జరిపినట్లు భారత ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. టోగో దేశ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సైరన్’ అనే ఈ ట్యాంకర్‌లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించినట్లు తెలిపింది.   ఏప్రిల్ 25న ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో ఆ నౌక సమీపంలో ఇతర నౌకలు కూడా ఉన్నాయని షిప్పింగ్ మంత్రిత్వ…