National

National

అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం.. న్యాయమూర్తి యశ్వంత్‌వర్మ రాజీనామా..

అలహాబాద్ హైకోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు తెలుస్తోంది. అభిశంసన ప్రక్రియ నేపథ్యంలో పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.   అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం   2025 మార్చి 14న ఢిల్లీలో జస్టిస్‌ యశ్వంత్‌వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన నివాసంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన ఇంటి నుంచి…

National

కేరళ, అసోం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్… ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..

కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మూడు ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ అధికారికంగా ముగిసినప్పటికీ, పలు కేంద్రాల్లో ఓటర్లు క్యూలలో వేచి ఉండటంతో వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపును మే 4వ తేదీన…

National

శబరిమల కేసులో కీలక మలుపు..! సుప్రీంలో ఆసక్తికర పోరాటం..!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం.. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, చట్టపరమైన పోరాటాలకు వేదికగా మారింది. ముఖ్యంగా 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన గళాన్ని వినిపించింది. ఆలయ సంప్రదాయాలను గౌరవించడం ప్రాథమిక బాధ్యత అని, ఇందులో ఎలాంటి లింగ వివక్ష…

National

మణిపూర్‌లో రాకెట్ దాడి… ఇద్దరు చిన్నారుల మృతి..

మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో ఒక ఇంటిపైకి రాకెట్ దూసుకు వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మంగళవారం ఉదయం మొయిరాంగ్ గ్రామంలోని ట్రింగ్లాబి అవాంగ్ లేకై అనే ప్రాంతంలో జరిగింది.   ప్రాథమిక సమాచారం ప్రకారం, సమీపంలోని కొండ ప్రాంతం నుంచి దీనిని ప్రయోగించినట్లు భావిస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్‌లో ఉన్న సరిహద్దు భద్రతా దళ అధికారి ఒయినం మలెంగాన్బా నివాసంపైకి ఈ రాకెట్ దూసుకువచ్చింది. ఘటన…

National

ఎల్పీజీ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన..!

దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి ప్రభుత్వం ముందస్తుగానే అదనపు గ్యాస్ కార్గోలను సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో ఎక్కడా అంతరాయం కలగకుండా చమురు సంస్థల ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ సాగిస్తున్నారు. గత రెండు రోజులుగా అధికారులు స్వయంగా డిస్ట్రిబ్యూషన్…

National

దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ సీట్లు తగ్గుతాయనే ప్రచారంపై స్పందించిన మోదీ..

జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్ సభ సీట్లను కోల్పోతాయనే వాదనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. పథనంథిట్టలోని తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.   ఎన్డీయే అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరి అభివృద్ధి…

National

రాఘవ్ చద్దాకు షాక్.. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు..!

రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై నిత్యం గళమెత్తే ఒక కీలక నేతను పార్టీ పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కాక విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ గొంతుకగా పేరుగాంచిన ఎంపీ రాఘవ్ చద్దాకు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పార్టీ…

National

ఎన్డీయేను గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

త‌మిళ‌నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వంపై ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దేశంలో మళ్ళీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రాల అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం పేరును కూడా మార్చే ప్రమాదం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేపుతున్నాయి.   తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్రను దెబ్బతీయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్టాలిన్ ఆరోపించారు. “బీజేపీ…

National

ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది అరెస్ట్..

దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రలు చేసిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని నెట్ వర్క్ లో ఎవరెవరు ఉన్నారు? అన్నది తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. శ్రీనగర్ కు చెందిన షబ్బీర్ అహమద్ లోన్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ఆపరేటర్. 2007లో భారత్ లో విధ్వంసం సృష్టించటానికి కుట్రలు చేసి పట్టుబడ్డాడు. అప్పట్లో పోలీసులు అతని నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.   ఢిల్లీ సమీపంలో.. ఈ…

National

నక్సలిజం దాదాపు అంతమైంది: లోక్ సభలో అమిత్ షా ప్రకటన..

నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ఆయుధాలు పట్టుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నక్సలిజాన్ని సమర్థించేవాళ్లు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆపరేషన్ కగార్, నక్సలిజం నిర్మూలన చర్యలపై ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ, మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైందని తెలిపారు.   సమాజంలో అన్యాయాలకు పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఉన్నాయని తెలిపారు. ఆయుధాలు పట్టడం సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని…