National

National

అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా..

తనతో సహా ఏడుగురు ఎంపీలు భయంతో ఆమ్ ఆద్మీ పార్టీని వీడలేదని, కేజ్రీవాల్ విధానాల కారణంగా బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం సరైన మార్గంలో వెళ్లడం లేదని విమర్శించారు. పార్టీ కోసం నిత్యం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.   మరికొందరు నాయకులు కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం…

National

ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టిషాక్…? బీజేపీలోకి రాఘవ్ చద్దా..

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, కీలక నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా బీజేపీలో చేరనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తనతో పాటు మూడింట రెండొంతుల మంది ఆప్ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో విలీనం కానున్నారని చెప్పడం సంచలనం సృష్టించింది.   ఈరోజు ఢిల్లీలో సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా ఈ ప్రకటన…

National

తమిళనాడు, బెంగాల్ లో ముగిసిన పోలింగ్… రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు..

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేఏ అవకాశం కల్పించారు. ఇవాళ తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, పశ్చిమ బెంగాల్ లో 152 స్థానాల్లో తొలి విడత పోలింగ్ నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ…

National

భారత్‌ను తాకితే ‘డాట్ డాట్ డాట్’.. పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా ఏడాది. పహల్గాం సమీపంలోని బైసరణ్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జర్మనీ పర్యటనలో ఉన్నప్పటికీ, అక్కడి నుంచే పాకిస్థాన్‌కు అత్యంత శక్తిమంతమైన హెచ్చరికలు జారీ చేశారు.     “భారత్ తనంతట తానుగా ఎవరిపైనా దాడి చేయదు. కానీ మా పొరుగున ఒకే ఒక దేశం ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తుంది. ఆ దేశం…

National

తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచార గడువు..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరుకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల కీలకమైన “నిశ్శబ్ద సమయం” (సైలెన్స్ పీరియడ్) అధికారికంగా ప్రారంభమైంది. దీంతో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రసంగాలకు ఫుల్‌స్టాప్ పడింది. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్‌లో 152 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, బెంగాల్ లో తొలి దశ పోలింగ్ జరగనుంది.  …

National

భారత్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు.. మోదీతో అత్యవసర భేటి..

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ (Lee Jae-myung) మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రపతి భవన్ లో ఆయనకు అధికారిక సైనిక వందనం నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన సైనికుల గౌరవాన్ని స్వీకరించారు. అయితే దక్షిణ కొరియా అధ్యక్షుడి పర్యటన వెనుక కీలక అజెండా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతో భేటి సందర్భంగా ఇరువురి నేతల మధ్య చర్చకు…

National

లక్షల కోట్ల అప్పుతో రాజధానా..? అమరావతిపై విజయసాయి రెడ్డి కీలక సూచనలు..

ఏపీ రాజధాని అంశంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. టీడీపీ ప్రతిపాదించిన అమరావతి నమూనాతో పాటు వైసీపీ ప్రస్తావించిన ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. రాజధాని నిర్మాణం ఎలా ఉండాలో వివరిస్తూ, ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సుదీర్ఘ పోస్టు పెట్టారు.   ఢిల్లీ నిర్మాణం గురించి విజయసాయి రెడ్డి విశ్లేషిస్తూ.. “1911లో కేవలం 42.7 చదరపు కిలోమీటర్ల (సుమారు 10,550 ఎకరాలు) విస్తీర్ణంలో…

National

మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు..!

దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) అమలు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాతే రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఈ అడ్డంకులను అధిగమించేందుకు కేంద్రం కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది.   ఈ బిల్లు అమలుకు సంబంధించి ఏకాభిప్రాయం సాధించేందుకు, త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలతో మరోసారి విస్తృత స్థాయి చర్చలు జరపాలని…

National

మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే.. విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఫైర్..!

భారత రాజకీయాల్లో మహిళలకు చారిత్రక సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్’ సవరణను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు “గర్భంలోనే చంపేశాయని” ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఈ బిల్లు వీగిపోవడంపై శనివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత మహిళల ఆకాంక్షలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ చారిత్రక తప్పిదంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే పక్షాలదే ప్రధాన పాపమని నేరుగా…

National

మీకు మహిళల ఉసురు తగులుతుంది.. విపక్షాలపై అమిత్ షా ఫైర్..

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భవిష్యత్ ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని, వారి ఉసురు మీకు తగులుతుందని హెచ్చరించారు. బిల్లును తిరస్కరించడం మహిళలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. బిల్లు వీగిపోయిన అనంతరం గెలిచామంటూ నినాదాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.   లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై…