National

National

దూసుకొస్తున్న ఎన్ నినో..! భారత్‌పై దాని ప్రభావం ఎంతో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అదే దానిపేరు గాడ్జిల్లా ఎల్‌ నినో. నార్మల్‌గా అయితే రెండేళ్ల నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చే ఈ తరహా ఎల్‌‌నినో.. ఈసారి అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు.   దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో .. ఆల్రెడీ సంకేతాలు   ప్రపంచ వాతావరణ సంస్థ-WMO-యూరప్‌కు చెందిన వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన నివేదికలతో ప్రపంచవ్యాప్తంగా అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. ఎల్‌ నినో అనేది పసిఫిక్‌…

National

పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకుంటే.. దాని ఆధారంగా వారి ప్రవర్తన లేదా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో సాగిన ఇలాంటి సంబంధాలను చట్టం ఏమాత్రం నిషేధించలేదని స్పష్టం చేసింది.   తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే అభ్యర్థి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ 2014లో అతనిపై ఓ యువతి క్రిమినల్ కేసు పెట్టింది. ఆ తర్వాత 2015లో లోక్…

National

జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే అల్టిమేటం..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏడు రోజుల్లోగా మంత్రి తన పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలను ఉద్ధృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.   నిన్న జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తాము చేపట్టిన శాంతియుత నిరసన ఒక చరిత్ర అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. “‘బొద్దింకలు’ ఏకమైతే…

National

ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్… ప్రపంచంలో ఇదే మొదటిసారి..!

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో మైలురాయిని అధిగమించింది. ఏఐ సహాయంతో రూపొందించిన ప్రపంచపు తొలి వ్యాక్సిన్, ప్రాథమిక దశ మానవ ప్రయోగాల్లో (క్లినికల్ ట్రయల్స్) విజయవంతమైంది. భవిష్యత్తులో సంభవించే మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనే దిశగా ఇది ఒక కీలక పరిణామమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు.   ‘pEVAC-PS’ పేరుతో పిలిచే ఈ నూతన వ్యాక్సిన్‌ను తొలి దశలో భాగంగా 39 మంది ఆరోగ్యవంతులపై పరీక్షించారు. ఈ ప్రయోగాల్లో వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని,…

National

తమిళనాడులో బీజేపీకి గట్టి షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా..!

తమిళనాడు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన అన్నామలై మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పించారు.   మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, 2020లో బీజేపీలో చేరి అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు. అయితే, పార్టీలో తనకు సరైన అవకాశాలు లభించడం…

APNational

24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల..!

దేశంలోని 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమీషన్ ఆప్ ఇండియా విడుదల చేసింది. ఏపీ, కర్ణాటక, గుజరాత్‌లలో 4 స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకుగాను ఎన్నికలు జరగనున్నాయి. ఇక జార్ఖండ్‌లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానలంన్నింటికి నామినేషన్లు దాఖలు చేయాలని కోరుతూ ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.   నామినేషన్లు విత్ డ్రా.. జూన్ 8వ తేది వకరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ఎన్నికల కమీషన్ తెలిపింది.…

National

దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్.. పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్..

దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భగ్నం చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తోనూ, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు వీరు పథకం రచించినట్లు తెలిపారు.   దేశంలోని అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్లు…

National

టీవీ చానళ్లకు భారీ ఎదురుదెబ్బ…! ఇకపై గంటకు 12 నిమిషాల యాడ్స్..

టెలివిజన్ ఛానళ్లలో ప్రకటనల సమయంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విధించిన పరిమితిని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు ప్రసారం చేయరాదన్న నిబంధన రాజ్యాంగబద్ధంగానే ఉందని స్పష్టం చేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ పలు ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, ప్రాంతీయ ఛానళ్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.   జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై…

National

అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సూచన..

అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. సకాలంలో అనుమతులు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఈ సమస్యలను అధిగమించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కెన్-బెట్వా ప్రాజెక్టు నమూనాను ఉదహరించారు.   భారతదేశంలో మొట్టమొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు కెన్-బెట్వా ప్రాజెక్టు. మధ్యప్రదేశ్‌లోని కెన్ నదిలో ఉన్న అదనపు జలాలను కాలువ ద్వారా…

National

త్రిభాషా సూత్రం.. కేంద్రం, ఎన్సీఈఆర్టీలకు సుప్రీంకోర్టు నోటీసులు..

ఎన్‌సీఈఆర్టీలో త్రిభాషా సూత్రానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీలకు నోటీసులు జారీ చేసింది. జులై 1వ తేదీ నుంచి 9, 10వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.   ఈ క్రమంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు…