TELANGANA

TELANGANA

భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

రాష్ట్రంలో భూ పరిపాలనను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా సర్కార్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై సర్వే నంబర్ల వారీగా డిజిటల్ సర్వే పూర్తి కాకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించకూడదని భావిస్తోంది. దీనికోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ భూ భారతిలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూమికి సంబంధించిన దస్తావేజులు ఉంటే ప్రాసెస్ పూర్తవుతుంది. కానీ,క్షేత్రస్థాయిలో ఆ భూమి ఉందా? సరిహద్దులు సక్రమంగా ఉన్నాయా? అనేది రిజిస్ట్రేషన్…

TELANGANA

రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి..! సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

బాసర క్షేత్రం సరికొత్త శోభను సంతరించుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాసరకు వెళ్లి సుమారు రూ.225 కోట్ల భారీ వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్షరాభ్యాసాలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.   ముఖ్యమంత్రి రేవంత్…

TELANGANA

నేతన్నల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. కల్వకుంట్ల కవిత విమర్శలు..!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ ద్వారా చేనేత కార్మికులకు అందాల్సిన యూనిఫాంల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మంది నేతన్నల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం…

TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రం కీల‌క‌ ప్రకటన..

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్రాజెక్టు ఆమోదానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట కాలపరిమితి లేదని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టులు భారీ వ్యయంతో కూడుకున్నవని దీని…

TELANGANA

కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు, ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్..

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి వాతావరణం అస్తవ్యస్తంగా మారింది. పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. రెండు, మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షం ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నాశనమవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల…

TELANGANA

ప్రతి గ్రామంలో.. ఫిర్యాదు బాక్సులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు..

గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులతో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2 నుంచి గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభలు ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే వేదికలన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గ్రామ స్థాయి సమస్యలను గుర్తించి తక్షణ…

TELANGANA

మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. గవర్నర్ ను కోరిన బీఆర్ఎస్ నేతలు..

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని, ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సోమవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రికి సంబంధించిన అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఆధారాలను గవర్నర్‌కు సమర్పించినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.  …

TELANGANA

హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు..! శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల దందా…

హైదరాబాద్‌లో భారీ అక్రమ గ్యాస్ సిలిండర్ల రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. గల్ఫ్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ కొరతను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ శ్మశాన వాటికలో అక్రమంగా నిల్వ ఉంచిన 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, ఈ దందాకు పాల్పడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.   హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సోమవారం ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు అధిక…

TELANGANA

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెట్రో విస్తరణకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్వాధీన ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.   మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు సభకు తెలిపారు. ప్రజారవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, ఈ నగరానికి…

TELANGANA

మూసీ ఒడ్డున భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ల నిర్మాణం ఎందుకు..?: కేటీఆర్ నిలదీత..

మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్టవిరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3 వేల ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.   తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని…