TELANGANA

TELANGANA

సర్కారీ బడుల్లో ఇక చేపల కూర.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు.   సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే…

TELANGANA

జగిత్యాలలో హైటెన్షన్.. వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి..

జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఉదయం టీపీసీస అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ సందడి మొదలైంది. పార్టీ అంతర్గత పరిణామాలు గందరగోళానికి దారితీయడంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నేరుగా రంగంలోకి దిగింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది.   ఈ సంక్షోభ నివారణ…

TELANGANA

డీలిమిటేషన్ పై పోరాటం.. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి- సీఎం రేవంత్ రెడ్డి..

“నేను దేశ రాజకీయాల్లో పనిచేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. మోడీ త్రీడి పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతం ఐక్యం కావల్సి ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేరళ, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక నుంచి కేంద్రంలో తక్కువ ప్రాతినిధ్యం ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ పై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. వెంకయ్య నాయుడును రాష్ట్రపతి ఎందుకు చేయాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు…

TELANGANA

దేశంలోనే తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద మల్టీ-లేన్ అండర్‌పాస్..

హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏళ్లుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద వాహనాల రాకపోకల కోసం మల్టీ-లేన్ అండర్‌పాస్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి అనుమతులు సాధించినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.   సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. సుచిత్ర జంక్షన్ నుంచి ప్యారడైజ్…

TELANGANA

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు: పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ సీజ్!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌ను పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు. ఈ ఫాంహౌస్‌ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ‘అసైన్డ్ భూమి’లో నిర్మించినట్లు రెవెన్యూ యంత్రాంగం గుర్తించడమే కాకుండా, డ్రగ్స్ పార్టీకి వేదికగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీకి…

TELANGANA

మాజీ డీజీపీ మనవరాలి పేరుతో భారీ సైబర్ మోసం: వాట్సాప్ మెసేజ్‌తో రూ. 1.2 కోట్లు స్వాహా!

హైదరాబాద్ నగరంలో ఒక హైప్రొఫైల్ సైబర్ నేరం కలకలం సృష్టించింది. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనవరాలైన దివ్యారెడ్డి దొడ్ల పేరును ఉపయోగించి సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ. 1.2 కోట్లు కాజేశారు. వాట్సాప్‌లో ఆమె ఫోటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టి, తానే స్వయంగా మాట్లాడుతున్నట్లు నమ్మించి కంపెనీ అకౌంటెంట్‌ను బురిడీ కొట్టించారు. ఈ తరహా మోసాన్ని సైబర్ నిపుణులు ‘సీఈవో ఫ్రాడ్’ (CEO Fraud) లేదా ‘వాట్సాప్ ఇంపర్సనేషన్ స్కామ్’ అని పిలుస్తున్నారు. దొడ్ల డెయిరీ…

TELANGANA

గ్యాస్ కష్టాలకు చెక్: కొండారెడ్డిపల్లి ‘సౌర’ విప్లవం.. సీఎం రేవంత్ సొంతూరి స్మార్ట్ స్టోరీ

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత మరియు డెలివరీలో జాప్యం నెలకొన్నా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామస్తులు మాత్రం నిశ్చింతగా ఉన్నారు. ఈ గ్రామంలో గ్యాస్ వినియోగం కంటే ఇండక్షన్ స్టవ్‌ల వాడకమే ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. రెండేళ్ల క్రితం టీజీరెడ్కో ఆధ్వర్యంలో ఇక్కడ పీఎం సూర్యఘర్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేశారు. గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటిపైనా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడంతో గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోయింది.…

TELANGANA

ఉద్యోగాల పేరుతో మోసం: బెజ్జూర్ మహిళల అక్రమ రవాణా కేసు గుట్టురట్టు

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన మహిళల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాధితులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించి సురక్షితంగా తీసుకువచ్చారు. మంచిర్యాల ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు యువతులకు ఉద్యోగాల పేరుతో ఎర వేసిన నిందితులు, వారిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయించినట్లు సిఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. బాధితులను వారి కుటుంబ సభ్యులకు…

TELANGANA

జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి: కాంగ్రెస్‌లో రేగిన దుమారంపై మంత్రి వివరణ

సంగారెడ్డిలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపినట్లుగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పీసీసీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయన్న విమర్శలు రావడంతో మంత్రి వెంటనే…

TELANGANA

మూసీ ప్రాజెక్టు రూ.1.5 లక్షల కోట్ల స్కామ్: అసెంబ్లీలో కేటీఆర్ సంచలన ఆరోపణలు.. బీఆర్‌ఎస్ వాకౌట్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పేరుతో భారీ ఆర్థిక కుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.5 లక్షల కోట్లుగా చూపుతూ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) లేకుండానే వేల సంఖ్యలో ఇళ్ల కూల్చివేతకు, భూసేకరణకు ప్రభుత్వం ఎలా సిద్ధమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిలో పారదర్శకత లేదని నిరసిస్తూ కేటీఆర్ మరియు బీఆర్‌ఎస్…