TELANGANA

TELANGANA

కొడంగల్‌లో 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి… వాటితోనే రేవంత్ గెలిచారా?: కవిత..

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎనిమిది సార్లు ‘సర్‌’ ప్రక్రియ జరిగిందని తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7 వేల ఓట్లు తీసేశారని… దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో కేవలం…

TELANGANA

ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు.. తెలంగాణ కొత్త విధానం..! గ్లోబల్ మార్కెట్‌పై తెలంగాణ ‘రైస్’ మార్క్..

తెలంగాణ రాష్ట్రం కేవలం ధాన్యం పండించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతి కేంద్రంగా అవతరించబోతోంది. రాష్ట్రంలో బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన, దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న విస్తృత అవకాశాలను తెలంగాణ సద్వినియోగం చేసుకోబోతోందని స్పష్టం చేశారు.   ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు..…

TELANGANA

తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుంది: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్..

తెలంగాణలో త్వరలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు మరింత పట్టుదలతో శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.   ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన శంషాబాద్‌లో రంగారెడ్డి రూరల్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనితో పాటు మరో తొమ్మిది జిల్లాల కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ…

TELANGANA

ధైర్యముంటే చర్చకు రండి.. విపక్షాలకు రేవంత్ బహిరంగ సవాల్..

తెలంగాణలో తమ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం శాసనసభ, శాసనమండలిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ సవాల్ విసిరారు.   తమ ప్రభుత్వ రెండేళ్లన్నర పాలనను, బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పాటు కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల…

TELANGANA

‘నాకు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం తన సెక్యూరిటీని తొలగించిందని బీఆర్ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. భవిష్యత్తులో తనకు ఏదైనా హాని జరిగితే దానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిదే పూర్తి బాధ్యత అని సంచలన వ్యాఖ్యలు చేశారు.   రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రవీణ్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే అధికార పార్టీ తనను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. విపక్ష నేతగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.…

TELANGANA

యూరియా యాప్‌లో పెద్ద స్కామ్..? రియల్ ఎస్టేట్ దందా కోసమేనా..? కేతిరెడ్డి సంచలన ఆరోపణలు..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘యూరియా యాప్’ వివాదంలో చిక్కుకుంది. ఈ మొబైల్ అప్లికేషన్ నుండి మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పేర్లు మాయం కావడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వం పెద్ద కుట్రకు తెరలేపిందని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం తీరును ఎండగడుతూ పలు ప్రశ్నలు సంధించారు. రియల్ ఎస్టేట్ దందా కోసమేనా? ప్రభుత్వం ఎంతో…

TELANGANA

తెలంగాణ రైతులకు అలర్ట్..! వరి సాగుకు బ్రేక్..! మారనున్న గ్రామీణ ఆర్థిక చిత్రం..

రాష్ట్రంలో సాంప్రదాయ వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకువస్తూ, రైతులను లాభసాటి పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా పంటల మార్పిడిపై ఒక ఉన్నత స్థాయి ‘రాష్ట్రస్థాయి కమిటీ’ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు మార్చేలా ప్రోత్సహించడానికి ఈ కమిటీని రంగంలోకి దించనుంది. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి రైతులకు విస్తృత అవగాహన కల్పించనున్నారు.…

TELANGANA

ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి..? కవిత షాకింగ్ కామెంట్స్..

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేవలం ఇంజనీరింగ్ చేసిన పొరుగు రాష్ట్రాల పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెబుతున్నారని కవిత అన్నారు. ఇది చాలా అన్యాయమని ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలు కూడా ఆంధ్రాకి వెళ్లి ఇంజనీరింగ్ చేస్తే అక్కడ ఉద్యోగాలు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. మన పిల్లల్ని అక్కడ నాన్-లోకల్స్ అంటారని పేర్కొన్నారు. మరి అక్కడి పిల్లలు ఇక్కడకు వచ్చి చదువుకున్నప్పుడు ఉద్యోగాలు ఎందుకివ్వాలని ప్రశ్నించారు.   హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్…

TELANGANA

నీటి సమస్యకు.. శాశ్వత పరిష్కారం కావాలి.. తుంగభద్ర వేదికగా సీఎం రేవంత్ విజ్ఞప్తి

కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాల్లో ‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌’లో భాగంగా తమకు కేటాయించిన 15 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం తుంగభద్ర కింద కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామన్న రేవంత్.. మిగిలిన 10 టీఎంసీల నీరు అందడం లేదని చెప్పారు.   కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన…

TELANGANA

ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 14 బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్వయంగా ఒప్పందాలపై సంతకాలు చేసి పథకాన్ని ప్రారంభించారు.   ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, ప్రభుత్వం కోసం కష్టపడే ఉద్యోగుల భద్రతను కాపాడటం…