‘ఇండియా’ కూటమి భేటీ..! 15 నిమిషాలు మాట్లాడిన రాహుల్ గాంధీ
బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మిత్రపక్షాలన్నీ విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి రావాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒకరినొకరు విమర్శించుకోవడం మానుకొని, సమైక్యంగా ముందుకు సాగాలని మిత్రపక్షాలకు సూచించారు. సుమారు 15 నిమిషాల పాటు ప్రసంగించిన రాహుల్, “కలిసికట్టుగా ఉంటేనే మన మనుగడ సాధ్యం” అని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు, అధికార పక్షాన్ని సమర్థంగా…

