TELANGANA

TELANGANA

లైంగిక వేధింపుల కేసు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి..

తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో, తీవ్ర వివాదంలో చిక్కుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది.   వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శిక్షణ పొందుతున్న ఉదయ్…

TELANGANA

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు..!

రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పడుకుందని ఎద్దేవా చేశారు. ఎల్నినో వస్తుందని శాస్త్రవేత్తలు ఆరు నెలల ముందే హెచ్చరించారని.. ప్రభుత్వం ఇప్పుడు మీటింగులు పెట్టి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. రైతులు ఇప్పటికే నష్టపోయారన్న ఆయన.. ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, దిశ లేదని మండిపడ్డారు.   బాన్సువాడ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ ను తెలంగాణ భవన్ లో…

TELANGANA

‘ఆమెతో ఏడాదిగా రిలేషన్.. ఆధారాలు ఉన్నాయి’.. సూసైడ్ నోట్‌లో ట్రెయినీ ఐపీఎస్ సంచలనాలు..!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కుమార్ రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యా యత్నానికి పాల్పడే ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది. దాంట్లో తన ఆత్మహత్యకు నలుగురు కారణమని ఉదయ్ కుమార్ రాసినట్టు సమాచారం. ఇక, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ట్రెయినీ మహిళా ఐపీఎస్ తో తాను సంవత్సర కాలంగా రిలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నట్టు తెలుస్తోంది.   సదరు మహిళా అధికారికి పెళ్లి అయిన తర్వాత…

TELANGANA

హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం.. ట్రైనీ ఐపీఎస్ పై కేసు..

దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రమైన హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న తీవ్ర ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి అనే ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.   వివరాల్లోకి వెళితే, అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక ఐపీఎస్ ప్రోబేషనర్, తన సహోద్యోగి అయిన…

TELANGANA

ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు..! మంత్రి సీతక్క కీలక ప్రకటన..

తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన, భర్తకు దూరమై ఒంటరిగా జీవిస్తున్న మహిళల జీవితాల్లో భరోసా నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారికంగా ప్రకటించారు. సమాజంలో ఎటువంటి ఆసరా లేక ఇబ్బందులు పడుతున్న ఒంటరి మహిళలకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ప్రభుత్వం ఈ…

TELANGANA

కాంగ్రెస్ స్కామ్‌ల సర్కార్..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన మోసకారి ప్రభుత్వంగా మారిందన్నారు. అందుకే సమాజంలోని ప్రతి వర్గం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విమర్శించారు.   హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కేటీఆర్ సమీక్షా సమావేశం…

TELANGANA

గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాలు..!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతర హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లంగర్ హౌస్ చౌరస్తా వద్ద శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకతో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల పాటు జరిగే బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది.   ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం…

TELANGANA

కవిత పార్టీ వివాదంపై కేటీఆర్ కౌంటర్..!

దిల్లీలో పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రక్షణ సేన) పేరు వివాదంపై ఆయన స్పందించారు. ‘టీఆర్ఎస్ పేరు పెట్టడంపై కొందరు మా పార్టీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేసి ఉండొచ్చు. మా పార్టీ పేరును వాడుకోవాలని చూస్తే కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారు. బంధం కంటే పార్టీనే ముఖ్యం’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.   మరోవైపు ఫార్మూలా రేస్ కేసుకు గురించి కూడా కేటీఆర్…

TELANGANA

వనపర్తి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..!

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించాలి. పలుగు, పార పట్టిన చేతులే.. కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. చదువొక్కటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చదువే సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుంది” అని విద్యార్థులకు ఉద్బోధించారు.   విద్యార్థినులతో ముఖ్యమంత్రి.. వనపర్తి…

TELANGANA

మీనాక్షి నటరాజన్‌కు కడియం శ్రీహరిపై కొండా సురేఖ ఫిర్యాదు..

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ అయి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించిన అన్ని అంశాలను వివరించారు.   సురేఖ వివరించిన…