TELANGANA

TELANGANA

నాపై కాదు.. ముందు రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి: ఢిల్లీలో కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..!

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ… సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె… తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేస్తూ చర్యలు తీసుకోవాలనుకోవడం సరికాదని సురేఖ స్పష్టం చేశారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని రాహుల్ గాంధీ ఎప్పుడూ…

TELANGANA

తొలగింపు కాదు.. రాజీనామానే: కొండా సురేఖ విషయంలో అధిష్ఠానం నిర్ణయం..!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించడం కంటే, గౌరవప్రదంగా రాజీనామా చేయించడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న నేతలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి, పార్టీకి నష్టం వాటిల్లుతుందని సీఎం రేవంత్ రెడ్డి…

TELANGANA

కవిత వాక్యాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

కవిత వాక్యాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. నేను వారిని విడదీయటానికి ప్రయత్నించానా కలపటానికి ప్రయత్నించానా కెసిఆర్‌కు తెలుసని అన్నారు. కవిత మొండిగా వ్యవహరించి పార్టీ లైన్ దాటారు కాబట్టే పార్టీ నుండి తొలగించారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీ ఆర్ ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులం మేమని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన చర్చల్లో మాది ప్రముఖ పాత్ర ఉందన్నారు. బీఆర్ఎస్ అంటే ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్…

TELANGANA

ఫీజు బకాయిల పెండింగ్‌పై కాంగ్రెస్ సర్కార్ ను హరీశ్ రావు నిలదీత..

కాంగ్రెస్ తన 1000 రోజులు పాలనలో ప్రజలకు చేసిన మంచి కంటే సృష్టించిన విధ్వంసమే ఎక్కువ ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఇందుకు రోడ్డున పడుతున్న విద్యార్థుల భవిష్యత్తే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అంటూ బడాయి కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ లో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్ రావును కలిసి వినతి…

TELANGANA

రూ.8 లక్షల కోట్ల అప్పు.. ఇదే కేసీఆర్ మార్క్ పాలన: సీఎం రేవంత్..

హైదరాబాద్ లో పెరిగిపోతున్న ట్రాఫిక్ కి చెక్ పెట్టె క్రమంలో ‌తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.ముఖ్యంగా తూర్పు హైదరాబాద్‌ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక మూసారాంబాగ్‌ హై లెవల్‌ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈరోజు ఘనంగా ప్రారంభించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో మూసీ నదిపై దాదాపు రూ.52 కోట్ల భారీ అంచనా వ్యయంతో 400 మీటర్ల పొడవైనతో అంబర్ పేట నుండి ప్రయాణ సమయం తగ్గడంతో…

TELANGANA

ఏపీలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆయన విమర్శించారు. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు.వరద నీరు లేకున్నా, ఎటువంటి కేటాయింపులు లేకుండానే కృష్ణా బేసిన్ వెలుపలి…

TELANGANA

మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు.. ఎమ్మెల్సీని బహిష్కరించిన మజ్లిస్ పార్టీ..

మజ్లిస్ పార్టీ (AIMIM)కి చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ పై బహిష్కరణ వేటు పడింది. ఆయన్ను పార్టీ నుంచి ఏకంగా డిస్మిస్ చేస్తున్నట్లు ఎంఐఎం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రహమత్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. ఆ పత్రాన్ని శాసనమండలి ఛైర్మన్ కు అందజేయాలని పార్టీ సంయుక్త కార్యదర్శి ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ అత్తాపూర్ లో మైనర్…

TELANGANA

కేబినెట్‌లో మార్పులు అవసరం: గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వం పనితీరులో నూతనోత్తేజం వస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను అరికట్టి, క్రమశిక్షణను కఠినంగా అమలు చేయాలని సూచించారు.ప్రస్తుతం రాజకీయ పార్టీలలో క్రమశిక్షణ కొరవడిందని గుత్తా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సీనియర్ నేత…

TELANGANA

ఓటర్ల తొలగింపుపై సీఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..

తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా ఏకంగా 92.86 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించిన నోటీసులు, పరిశీలనలు వెలువడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన పౌరులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసేందుకు సమగ్ర పరిశీలన అత్యవసరమని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నిర్ణయించిన గడువులోగా నోటీసులకు స్పందించడం, అభ్యంతరాలు నమోదు…

TELANGANA

కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట..! శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..!

కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కాంగ్రెస్ అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని…