TELANGANA

TELANGANA

ఎవరి జాగీరు అని మీ ఫొటోలు వేసుకుంటున్నారు..? కాంగ్రెస్ నేతలపై ఈటల ఫైర్..

తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనకు ఎలాంటి వ్యత్యాసం లేదని… ఈ పాలనతో రాష్ట్ర ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని భావిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఐదు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నప్పటికీ ప్రధాని మోదీ ఫొటోను ఎక్కడా వేయడం లేదని… కానీ కాంగ్రెస్ నేతలు ఎవరి జాగీరని వారి ఫొటోలు వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ…

TELANGANA

ఏపీ వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా..? సీఎం రేవంత్ పై కవిత ఫైర్..!

యాదగిరిగుట్ట పాలకమండలిలో మెగా ఫ్యామిలీకి చెందిన వారిని నియమించడంపై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతనంగా ప్రకటించిన పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖను సభ్యురాలిగా నామినేట్ చేయండంపై తీవ్ర విమర్షలు గుప్పించారు. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిలో కొనిదెల సురేఖకు స్థానం కల్పించడంపై కవిత ఫైర్ అయ్యారు. మెగా కుటుంబాన్ని సీఎం రేవంత్…

TELANGANA

తుమ్మిడిహట్టిపై బిగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 1న ఢిల్లీలో సీడబ్ల్యూసీ కీలక భేటీ..!

ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేసిన నిరంతర ప్రయత్నాల నేపథ్యంలోనే కేంద్ర జల సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు…

TELANGANA

గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్‌.. ఎన్విడియా వెరా రూబిన్‌ జీపీయూలతో భారీ ప్రాజెక్ట్..!

హైదరాబాద్‌కు మరో మణిహారంగా నిలవనుంది ఏఐ ఫ్యాక్టరీ. ఆసియాలో మొదటి అత్యంత అత్యాధునిక ఎన్విడియా వెరా రూబిన్ ఏఐ క్లస్టర్‌ను ఏఎం ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయనుంది. దాదాపు 8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో తొలి దశలో 200 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఫార్మాలోనే కాదు ఐటీ రంగంలోనూ హైదరాబాద్ నగరం దూసుకుపోతోంది. తాజాగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండంలో తొలిసారి అత్యాధునిక ఎన్విడియా వెరా రూబిన్ క్లస్టర్లలో…

TELANGANA

కూతురి వ్యాఖ్యలతో మాకేం సంబంధం.. కాంగ్రెస్‌లోనే ఉంటాం.. కొండా మురళి క్లారిటీ..!

తన బిడ్డ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు, తమకు సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సుష్మితకు 38 సంవత్సరాలని, ఆమెకు 15 ఏళ్ల బిడ్డ, కొడుకు ఉన్నారని వివరించారు. ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉన్నాయని, ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. ఆ అంశంపై ఇప్పటికే పీసీసీ, క్రమ శిక్షణ…

TELANGANA

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేరు కానీ.. విదేశీ విద్య అందిస్తారంట!: బండి సంజయ్..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని… అలాంటప్పుడు విదేశీ విద్యను అందిస్తామని, ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఫీజు బకాయిలు అందకపోవడంతో రాష్ట్రంలో అనేక కళాశాలలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని బండి సంజయ్ తెలిపారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు…

TELANGANA

కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం కీలక మలుపు..! మంత్రి పదవి నుండి తొలగింపు..?

కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ తన నివేదికను టీపీసీసీ అధ్యక్షుడికి అందించింది. అలాగే మరో సందర్భంలో సీనియర్‌ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ తన అభిప్రాయాన్ని నివేదికలో పొందుపర్చినట్లు కమిటీ ఛైర్మన్‌, ఎంపీ మల్లు రవి వెల్లడించారు.మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో వ్యక్తుల కంటే పార్టీ, క్రమశిక్షణే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలను ఉపేక్షించబోమని చెప్పారు.…

TELANGANA

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది: సీఎం రేవంత్‌..

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని అన్నారు. కేంద్రం తీరు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. బ్రిటన్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.బ్రిటన్‌ పర్యటనకు అనుమతించారని, కానీ అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వలేదన్నారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు.…

TELANGANA

కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిన ఉదంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను బహిరంగంగా వ్యాఖ్యానించబోనని, క్రమశిక్షణా సంఘమే దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.ఇటీవల వరంగల్ జిల్లా గీసుగొండలో నిర్వహించిన మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలో ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

TELANGANA

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ.. మల్లు రవికి కీలక విజ్ఞప్తి..!

టిపిసిసి క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాసారు. తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేయిస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిటి ఛైర్మన్ మల్లు రవికి కొండా సురేఖ విజ్ఞప్తి చేసారు. టిపిసిసి క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ, తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో…