TELANGANA

TELANGANA

హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు..

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించినప్పుడే వారి నుంచి మెరుగైన ఉత్పాదకతను సాధించగలమని తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలు సామాజిక భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించడంతో పాటు నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.   మంగళవారం హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో ప్రారంభమైన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్ – 2026 ప్రారంభోత్సవంలో మంత్రి…

TELANGANA

తెలంగాణ అభివృద్ధికి 6 సూత్రాలు.. ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల సాధనపై ఎంపీలతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం బీజేపీ ఎంపీలు సైతం చొరవ చూపాలని కోరారు.…

TELANGANA

కాళేశ్వరంపై కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో, గోదావరి జలాలను ఉద్దేశపూర్వకంగానే సముద్రం పాలు చేస్తూ రైతులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆయన మండిపడ్డారు.   సోమవారం కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం…

NationalTELANGANA

వచ్చేస్తోంది బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్‌కు 3 కొత్త కారిడార్లు..!

భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు 2027 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్‌) కారిడార్‌లో భాగంగా సూరత్-బిలిమోరా మధ్య తొలి సర్వీసును నడపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గం దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ రైలు మార్గంగా నిలవనుంది.   508…

TELANGANA

తెలంగాణలో వరి సాగు సగానికి పడిపోనుందా? ఎల్ నినో పై ప్రభుత్వం షాకింగ్ అంచనా..!

ఎల్ నినో పరిస్థితులతో రైతులకు నష్టం కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయం, ఇక్రిశాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, సీఆర్ఐడీఏ శాస్త్రవేత్తలు, ఐఎండీ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, భూగర్భ జల విభాగం అధికారులతో సోమవారం ఇక్రిశాట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే…

APNationalTELANGANA

వియత్నాంలో ఘోర ప్రమాదం..!15 మంది మృతి..

వియత్నాంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌ బోట్ సముద్రంలో బోల్తా పడి మునిగిపోయింది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.   ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన ‘ఏజీ-26751’ అనే పర్యాటక స్పీడ్‌ బోటులో భారత పర్యాటకులు సిబ్బందితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్…

TELANGANA

కాంగ్రెస్ సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు..! దమ్ముంటే ఎన్నికలకు రండి: కేటీఆర్ సవాల్..!

ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు 117 కాదు కదా.. 7 కూడా రావు అని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే 78 సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయని చెప్పింది ముమ్మాటికి వాస్తవమన్నారు. ముఖ్యమంత్రి తాను సర్వే చేయించుకోలేదన్న విషయం నిజమైతే.. ఆ మేరకు దేవుడిపైన ఒట్టు వేసి చెప్పాలని డిమాండ్ చేశారు. తన పాలనపై అంత నమ్మకం ఉంటే…

TELANGANA

తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది..: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

క్రైం రివ్యూల్లో ఐపీఎస్ అధికారులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. నిందితుడి పూర్వపరాలు, అతడి వివరాలు తెలుసుకొని, కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని అడగాలి కదా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసులకు చేతకాకపోతే ప్రైవేట్ కేసు పెడతా.. తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్ గా మారిందని చెప్పడానికి చాలా బాధగా ఉంది, కానీ వాస్తవం అన్నారు. రాత్రి 11 నుంచి 1 గంట…

TELANGANA

2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగవు: సీఎం రేవంత్‌..

2028 డిసెంబర్‌లో ఎన్నికలు జరగవని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. అప్పటికీ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 25కు పెరుగుతాయని అన్నారు. 182 స్థానాల్లో కనీసం 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 65 సీట్లు గెలుస్తుందని తాము ముందే చెప్పి చేసి చూపించామని గుర్తు చేశారు. ఖమ్మం…

TELANGANA

‘అన్న రాజ్యం’ కాదు.. ‘అక్క రాజ్యం’ ఎలా ఉంటుందో చూపిస్తా: కవిత..

తెలంగాణ రక్షణ సేన ఎన్నికల్లో విజయం సాధిస్తే ‘అన్న రాజ్యం’ కాదు.. ‘అక్క రాజ్యం’ ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత అన్నారు. రైతును నిజమైన రాజును చేస్తానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రైతులకు ప్రత్యేక గౌరవ కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ఒక వినూత్న ఆలోచన చేశామని… త్వరలోనే దాని వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. ‘పాంచజన్యం’ అనే నినాదంతో మార్పు కోసం ముందుకు…