TELANGANA

TELANGANA

తెలంగాణలో జనసేన దూకుడు.. రంగంలోకి అధినేత పవన్..

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీ భాగ్యనగరంపై ఫోకస్ చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఆర్ఎస్ వంటి పార్టీలు తెర వెనుక పావులు కదుపుతున్నాయి. ఇదే క్రమంలో జనసేన పార్టీ ఓ అడుగు ముందుకేసింది. తెలంగాణలో ఉనికిని చాటడమే కాకుండా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తోంది.   క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు జనసేనాని కార్యాచరణ మొదలుపెట్టారు. పార్టీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, మిగతా పార్టీల నుండి వచ్చే నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడానికి…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ ఐదు కేసులను కొట్టేసిన హైకోర్టు..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి న్యాయస్థానంలో పెద్ద ఉపశమనం లభించింది. గతంలో ఆయనపై నమోదైన కొన్ని రాజకీయ కేసుల వ్యవహారంలో హైకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రచార సమయాల్లో నమోదయ్యే ఇలాంటి కేసులు ప్రజాప్రతినిధులకు తరచూ తలనొప్పిగా మారుతుంటాయి. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ కేసులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డికి చట్టపరమైన చిక్కులు తొలిగిపోయినట్లయింది.…

TELANGANA

దిల్లీ వేదికగా తెలంగాణ మెట్రో డీల్ సఫలం..!

హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్త‌ర‌ణ‌పై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం.. ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌పై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు సీఎం వరుసగా రెండ్రోజులు స‌మావేశ‌మ‌య్యారు. తొలుత సోమ‌వారం రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో సుదీర్ఘంగా చ‌ర్చించారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి మనోహర్ లార్ ఖట్టర్ నివాసంలో మరోమారు అంశంపై చర్చించారు.  …

TELANGANA

రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక స్కాం ఉంటుంది: కేటీఆర్ సంచలన వాఖ్యలు..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి ఒక్కటే ఎజెండా ఉందని, అది మెట్రో భూముల స్కామ్ అని మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, “రేవంత్ రెడ్డి కన్నంతా మెట్రో భూముల మీదే పడింది. ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ పక్కా ఉంటుంది” అని ఆరోపించారు.   మెట్రో సమీపంలో 280 ఎకరాల విలువైన భూములు…

TELANGANA

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో.. అమ్మవారి కిరీటం, హుండీ చోరీ..

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ సముదాయంలోని మహాకాళి అమ్మవారి ఆలయంలోకి చొరబడి, వెండి కిరీటంతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో భక్తులు, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.   మంగళవారం ఉదయం నిత్య పూజల కోసం వచ్చిన అర్చకులు ఆలయ ద్వారాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆలయ ప్రాంగణంలోని పై…

TELANGANA

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో ఘనవిజయం సాధించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.   ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల దొంగతనంతో పాటు…

TELANGANA

రేపు పులివెందులకు వెళుతున్న జగన్.!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రేపటి నుంచి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి జూన్ 25 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన స్థానిక నేతలతో సమీక్షలు జరపడంతో పాటు ప్రజలను నేరుగా కలవనున్నారు.   రేపు సాయంత్రానికి జగన్ పులివెందులకు చేరుకుంటారు. అక్కడ ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు…

TELANGANA

డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్న దుర్మరణం చెందిన ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఘోర ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు.   డీటీఓ వెంకన్న మరణం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదనే బలమైన సందేహాన్ని హరీశ్‌రావు లేవనెత్తారు. “రాష్ట్రంలో…

TELANGANA

నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.   రూ. 13 వేల కోట్లు.. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన…

TELANGANA

తెలంగాణలో జనసేన దూకుడు.. మణికొండలో పార్టీ ఆఫీసు..!

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యరూపం ఇచ్చారు. హైదరాబాద్ లోని మణికొండలో పార్టీ కార్యాలయాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ గడ్డపై జనసేనకు సంబంధించి ఇదే తొలి కార్యాలయం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబురాలు చేసుకున్నారు.   నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు, హోమాలను పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఆపై పార్టీ ఆఫీసు…