TELANGANA

TELANGANA

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో రగడ..! మంత్రి పొంగులేటి వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి..

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సోమవారం నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రుల ప్రసంగాలపై స్థానిక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటు, లబ్ధిదారులకు పట్టాల పంపిణీ నిమిత్తం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం పనులను అసంపూర్తిగా…

TELANGANA

Jukkal: భారీ వర్షాలతో నిండుకుండలా మారిన కౌలాస్ నాలా ప్రాజెక్ట్.. రైతుల్లో ఆనందం

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి కొత్త నీరు వచ్చి చేరుతుండటంతో కౌలాస్ నాలా జలకళను సంతరించుకుంది. దీంతో ప్రాజెక్ట్ దాదాపు నిండుకుండలా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరిగింది. దీంతో…

TELANGANA

Hyderabad: HYDRAA ఉద్యోగాల కోసం భారీగా తరలివచ్చిన యువత.. 150 పోస్టులకు పోటాపోటీ!

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది నిరుద్యోగ యువత భారీగా తరలివచ్చారు. హైడ్రా (HYDRAA)లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్లు, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు ఎంపిక ప్రక్రియకు హాజరయ్యేందుకు పోటీపడ్డారు. తెల్లవారక ముందే స్టేడియం, పరిసర ప్రాంతాలు అభ్యర్థులతో కిక్కిరిసిపోయాయి. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో యువత పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడటంతో అక్కడ సందడి నెలకొంది. హైడ్రా విడుదల…

TELANGANA

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. 37 మంది జూనియర్ లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల మధ్య, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్రమ మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుండగా, ఉద్యోగ నియామక వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందినట్లు గుర్తించిన 37 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం…

TELANGANA

తెలంగాణ సాధనలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిది: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనని వ్యక్తి ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. సీఎం రేవంత్…

TELANGANA

మియాపూర్‌లో చైన్ స్నాచింగ్.. కొరియర్ బాయ్‌గా వచ్చి మహిళపై పెప్పర్ స్ప్రే

మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కొరియర్ బాయ్‌గా నటిస్తూ ఇంట్లోకి ప్రవేశించి, ఒంటరిగా ఉన్న మహిళపై పెప్పర్ స్ప్రే చేసి బంగారు మంగళసూత్రాన్ని అపహరించిన నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయుర్వేద మందుల కొరియర్ డెలివరీ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ ఖాజా అర్షాల్ (20)…

TELANGANA

సూర్యాపేటలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన.. విద్యార్థులతో ప్రతిజ్ఞ

సూర్యాపేటలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలన, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట పోలీసు శాఖ, సూర్యాపేట బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డులో ఉన్న జయ పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లు జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని, మంచి భవిష్యత్తు,…

TELANGANA

KTR Criticised: సీఎం రేవంత్ వ్యాఖ్యలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు.. యువజన కాంగ్రెస్ నేత శ్రీకర్ గౌడ్

ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, విద్యావ్యవస్థ బలోపేతంపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీకర్ గౌడ్ విమర్శించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ రాజకీయ స్వార్థంతో తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీకర్ గౌడ్…

TELANGANA

నిమ్స్‌లో 1000 రోబోటిక్ సర్జరీలు.. దేశంలోనే కొత్త రికార్డ్..!

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్య రంగంలో అరుదైన మైలురాయిని అధిగమించింది. మూడేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ఇదొక నూతన రికార్డు అని, సామాన్యులకు సైతం అత్యాధునిక రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రభుత్వం పేర్కొంది.ఈ అద్భుత ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్, యూరాలజీ అండ్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం సీనియర్…

TELANGANA

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసులో మరో ట్విస్ట్..! ఏపీ మహిళతో రిలేషన్..

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసు ఎంతవరకు వచ్చింది? తీగలాగితే డొంక కదులుతోందా? తాజాగా మరో మహిళతో అతడికి రిలేషన్ షిప్ ఉందా? గదిలో ప్రేమ లేఖల మాటేంటి? సదరు మహిళ ఏపీకి చెందిన మహిళా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసు కొత్త మలుపు ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన మరో…