TELANGANA

TELANGANA

కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.   ఆసుపత్రికి చేరుకున్న నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించింది. శకుంతల గారి గుండెకు స్టంట్ వేసి, ప్రస్తుతం ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.  …

TELANGANA

బండి సంజయ్ కిందిస్థాయి నుంచి వచ్చారు, కుమారుడి కారణంగా తలవంపులు: సీఎం రేవంత్ రెడ్డి..

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కిందిస్థాయి నుంచి పైకి వచ్చారని, కుమారుడి కారణంగా ఆయనకు తలవంపులు వచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసుపై ముఖ్యమంత్రి స్పందించారు. బండి భగీరథ్ పారిపోవడం తప్పని స్పష్టం చేశారు. బండి సంజయ్ బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలని సూచించారు.   అలా చేస్తే బండి సంజయ్ గౌరవం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని,…

TELANGANA

బండి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలనం..!

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలిక మైనరా? కాదా? అన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో.. దానిపై రీ-వెరిఫికేషన్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం మధ్యంతర బెయిల్ పై తీర్పును రేపు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.   మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ను ఏ క్షణమైనా సిట్ అధికారులు అరెస్టు చేయవచ్చన్న…

TELANGANA

తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీ..!

తెలంగాణలో వాహనాల పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. రోడ్లపై అడ్డగోలుగా వాహనాలు నిలపడం, రోజుల తరబడి వదిలేయడం వంటి చర్యలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కొత్త పార్కింగ్ పాలసీ ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, వాహనదారుల జేబుకు చిల్లు పడటమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాహనాన్ని…

TELANGANA

బండి సంజయ్ నీతులు కొడుకు దగ్గర పనిచేయవా..! కేటీఆర్ తీవ్ర విమర్శలు..?

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే ఎన్నిక అంటూ దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాలను కోరుతున్న బీజేపీ.. తమ వారి విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. బుధవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పోక్సో చట్టం ఒక్కటే అయినప్పటికీ కేంద్రమంత్రుల పిల్లలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో…

TELANGANA

పోక్సో కేసులో కీలక పరిణామం..! పోలీసులకు బండి భగీరథ్ లేఖ..!

బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు భగీరథ్ ఓ లేఖ పంపించారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయినట్లు లేఖలో తెలిపారు. అయితే మే 15వ తేదీన సిట్ విచారణకు వస్తానని స్పష్టం చేశారు.   విచారణకు హాజరయ్యే సమయంలో కీలక ఆధారాలు, సాక్ష్యాలతో వస్తానని బండి భగీరథ్ లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారుల…

TELANGANA

బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ..

ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్ పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఫోకస్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.   రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై కేసీఆర్ ప్రత్యేక…

TELANGANA

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం..

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియమితులయ్యారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, ఆరుగులు సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరాలను నియమించారు. వీరి పదవీకాలం ఐదేళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్రంలోని మహిళల హక్కులను పరిరక్షించడానికి, వారిపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులను అరికట్టడానికి ఏర్పాటు చేయబడిన…

TELANGANA

బండి భగీరథ్ అంశంపై డీజీపీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి..

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు. ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.   ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని…

TELANGANA

తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను… ఈసారి వచ్చేది బీజేపీనే: ప్రధాని మోదీ..

తెలంగాణలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని, వారి కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకుంటున్నారని అన్నారు.   ప్రధాని మోదీ తన…