TELANGANA

TELANGANA

ఆపరేషన్ ముస్కాన్ -12 సక్సెస్.. 6,307 మంది చిన్నారులను కాపాడిన తెలంగాణ పోలీసులు..!

బాల కార్మిక వ్యవస్థ.. బాలల అక్రమ రవాణాను అరికట్టటంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆపరేషన్ ముస్కాన్-12లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించారు. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేశాయని మహిళా…

TELANGANA

వచ్చే ఎన్నికల్లో 50 శాతానికి పైగా జెన్‌-జీ తరం ఓటర్లే కీలక పాత్ర-: కేటీఆర్..

వచ్చే ఎన్నికల్లో 50 శాతానికి పైగా జెన్‌-జీ తరం ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల నీట్ పరీక్ష వైఫల్యంపై జరిగిన పోరులో ‘ఇన్‌స్టా పిల్లలు’ విజయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మారుతున్న రాజకీయ సమీకరణాలు, యువతరం ప్రాధాన్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   “యువతరం సరికొత్త రీతిలో ఢిల్లీలో కదం తొక్కింది. ఎవరితోనైతే ఘర్షణకు వెళ్లకూడదో, ప్రధాని మోదీ…

TELANGANA

“క్రిమినల్ వేస్ట్”.. ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..

తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యార్థుల ఉపాధి నైపుణ్యాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి.   హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిఏటా 1.1 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నప్పటికీ, వారిలో కొందరు కనీసం ఉద్యోగ దరఖాస్తును కూడా నింపలేకపోతున్నారని ఆయన…

TELANGANA

హైడ్రా నుంచి రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయండి: హైకోర్టు తాజా ఉత్తర్వులు..

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను, ఆయన్ను తక్షణమే ఆ పదవి నుంచి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తాజాగా, రంగనాథ్ స్థానంలో మరొక అధికారిని నియమించాలని నేడు ఉత్తర్వులు జారీ చేసింది.   లోతుకుంట భూముల వ్యవహారంలో హైడ్రాకు, శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన…

TELANGANA

స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హైలెవల్ మీటింగ్..!

ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి తదితర…

TELANGANA

ఆమెతో అలా పరిచయం.. ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సజ్జనార్..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదు మేరకు అరెస్టయిన అతడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో నిందితుడిని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.…

TELANGANA

శివరాజ్ సింగ్ చౌహాన్ తో రేవంత్ రెడ్డి భేటీ..! కీలక అంశాలపై చర్చ..!

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పలు కీలక గ్రామీణాభివృద్ధి అంశాలు, గృహ నిర్మాణం, ఉపాధి హామీ పథకాల విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు.   గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గ్రామీణ గృహనిర్మాణ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రేవంత్ వివరించారు. ఈసారి నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు…

TELANGANA

బ్లాక్‌మెయిల్ కోసమే హైడ్రా: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్..

హైడ్రా కమిషనర్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బ్లాక్‌మెయిల్ సాధనంగా వాడుకుంటోందని, హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు వంటిదని ఆయన విమర్శించారు.   మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, బిల్డర్లను, సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేయడానికే హైడ్రాను…

TELANGANA

హైదరాబాద్ పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి..

మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఆయన్ను గుర్తించిన పోలీసులు, అనంతరం హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.   హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు…

TELANGANA

ఇకనుంచి ఒకే ఒక్క కార్డు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకొనుంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అతి ఫ్యామిలీ రిజిస్టర్ తీసుకురానున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని మీసేవా కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకనుండి ప్రభుత్వ సేవలకు ఒకే కుటుంబ రికార్డు అందుబాటులోకి తేచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.   మీ సేవా కేంద్రాల ద్వారా.. అయితే కుటుంబ వివరాల ధృవీకరణను సులభతరం చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ప్రజలందరు రేషన్ కార్డు డేటా…