TELANGANA

TELANGANA

హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణ నా కల: సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించడమే తన వ్యక్తిగత కల అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. క్రీడా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.   హైదరాబాద్‌‍లోని గచ్చిబౌలిలో ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’తో పాటు గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి యూనివర్సిటీ లోగో,…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని రూ. 1,400 కోట్లపై విచారణ జరిపించాలి: కవిత..

బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 1,400 కోట్ల నిధులు స్వచ్ఛమైనవి కావని అన్నారు. అవన్నీ క్విడ్ ప్రోకో ద్వారా వచ్చినవేనని ఆరోపించారు. ఆ నిధులపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, ఆ డబ్బును తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు పంచాలి అని డిమాండ్ చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని…

TELANGANA

కాంగ్రెస్‌లో ‘ఢీ’ అంటే ‘ఢీ’.. కడియంపై టీపీసీసీకి మంత్రి సురేఖ ఫిర్యాదు..

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పార్టీ క్రమశిక్షణా కమిటీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి కడియంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి నుంచి తనకు ఎదురవుతున్న ఇబ్బందులు, దేవాదాయ శాఖ మంత్రిగా తన అధికార పరిధిని ప్రశ్నించేలా ఇటీవల ఆయన వ్యవహరించిన తీరును ఆమె వివరించారు.   దేవాదాయశాఖ మంత్రిగా సీఎం రేవంత్…

TELANGANA

‘సర్’ ప్రక్రియపై సైబర్ ముఠా కొత్త స్కెచ్..!

టెక్నాలజీ మారుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు తమ రూట్ మారుస్తున్నారు. జనాన్ని బురిడీ కొట్టించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ  ప్రక్రియను ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలను లూటీ చేసేందుకు సరికొత్త స్కెచ్ వేశారు. ఈ నేపథ్యంలోనే నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు.   ఎన్నికల అధికారుల పేరిట నకిలీ ఫోన్ కాల్స్   ప్రస్తుతం…

TELANGANAUncategorized

నాకు మంత్రి పదవి ఇవ్వండి.. నీళ్లు తెచ్చి చూపిస్తా: హరీశ్..

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. తనకు మూడు నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగిస్తే, కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేసి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తానని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రక్రియలో విఫలమైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.   మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు పవర్‌పాయింట్…

TELANGANA

రూ.37 వేల కోట్లు ఇచ్చాం.. మరి ధాన్యం ఏవి? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి..!

ధాన్యం కొనుగోళ్లు, రైస్ మిల్లింగ్ మరియు కేంద్ర నిధుల విడుదలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ మందగమనం, కేంద్రం ఇస్తున్న రుణాల వినియోగం, సన్నబియ్యం పంపిణీలో కేంద్ర వాటాపై కీలక వ్యాఖ్యలు చేశారు.   కొనుగోళ్లలో వైఫల్యం..   రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కిషన్ రెడ్డి…

TELANGANA

రవాణా శాఖలో తెలంగాణ సర్కార్ సంచలన జీవో..!

మైనర్లు వాహనాలు నడపడిపితే మోటారు వాహనాల చట్టం సెక్షన్ 199-ఏ ప్రకారం తల్లిదండ్రులు, సంరక్షకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని రవాణాశాఖ స్పష్టం చేసింది. జీవోను బుధవారం విడుదల చేసింది. అన్ని రవాణాశాఖ కార్యాలయాలకు జీవో కాపీలను పంపించింది. 18ఏళ్ల లోపు వయస్సు గల వారికి వాహనాలు నడపడానికి ఇవ్వవద్దనితల్లిదండ్రులు, సంరక్షకులకు రవాణాశాఖ విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.   సెక్షన్ 199-ఏ ప్రకారం.. మోటారు…

TELANGANA

‘డిజిటల్ గవర్నెన్స్’కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్..

పరిపాలనలో మరింత పారదర్శకత కోసం డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.…

TELANGANA

సింగరేణికి కేంద్రం భారీ ఊరట.. తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయిస్తూ కీలక నిర్ణయం..

తెలంగాణ ఆర్థిక రంగానికి, సింగరేణి సంస్థ భవిష్యత్తుకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్‌ను నేరుగా సింగరేణి సంస్థకే కేటాయిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో సంతకం చేశారు. ఈ మైనింగ్ లీజ్ కేటాయింపు తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఎంతో మేలు చేకూర్చనుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.…

TELANGANA

కేసీఆర్ ఒప్పుకుంటే రేపే అసెంబ్లీ.. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి- సీఎం రేవంత్..

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు దెబ్బతినడానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి స్వార్థమే కారణమని మండిపడుతూ, దీనిపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.   ప్రాణహిత నుంచి కాళేశ్వరం దాకా.. అంచనాల పెంపు   వైఎస్సార్ హయాంలో 16.40 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో తక్కువ అంచనా వ్యయంతో (రూ. 39 వేలు)…