TELANGANA

TELANGANA

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు..!

హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు లండన్ యూనివర్సిటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ మేరకు లండన్ యూనివర్సిటీ సెనేట్ హౌస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. లండన్ యూనివర్సిటీలోని సెనేట్ హౌస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర…

TELANGANA

వివేకానంద కేసులో కొత్త మలుపు, ఎంపీ అవినాష్ ఇళ్లు సహా పలు చోట్ల ఈడీ సోదాలు..

ముఖ్యంగా హైదరాబాద్, కడపతోపాటు మరో నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోకాపేట్‌లోని ఓపెన్ స్కైస్‌లోని ఎంపీ అవినాష్‌రెడ్డి నివాసం, అలాగే పులివెందుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో బయట ఉన్నారు ఈడీ అధికారులు. ఎంపీ ఇళ్లతోపాటు నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. సీబీఐ కేసు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం,…

TELANGANA

ఎకరం రూ.264 కోట్లు.. రాయదుర్గంలో ఆల్ టైమ్ రికార్డు ధర..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరా భూమి ఏకంగా రూ. 264 కోట్లు పలికింది. మొత్తం 5.25 ఎకరాల ప్లాట్‌ విక్రయం ద్వారా ప్రభుత్వ సంస్థ అయిన టీజీఐఐసీకి రూ. 1,386 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌లో భూమి ధరకు సంబంధించి ఇదే ఆల్ టైమ్ రికార్డ్.రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నెం. 83/1లో ఉన్న ప్లాట్ నెం. P1 కోసం…

TELANGANA

కుమార్తె వ్యాఖ్యల వివాదం..! త్వరలో నిజాలు బయటపెడతా: కొండా సురేఖ…

తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ విషయంపై తాను చెప్పాల్సింది ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి వివరించానని, ప్రస్తుతం మీడియా ముందు మాట్లాడేదేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తానని ఆమె తెలిపారు.వరంగల్ జిల్లా గీసుకొండలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత…

TELANGANA

అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.108 కోట్లతో అంబేద్కర్ టవర్ నిర్మాణానికి పరిపాలనా శాఖ అనుమతిచ్చింది. ప్రస్తుత అంబేద్కర్ భవన్ స్థానంలో 1 సెల్లార్ + గ్రౌండ్ + 10 అంతస్తులతో కొత్త టవర్ ఉంది. 12 ఏళ్లుగా వినియోగంలో లేని పాత అంబేద్కర్ భవన్ పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త టవర్ నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌అండ్‌బీ అధికారులు భవన…

TELANGANA

నా కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం..! క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ..

సీఎం రేవంత్ రెడ్డి, పరకాల నియోజకవర్గంపై తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ, హైదరాబాద్‌లోని కమిటీ ఎదుట హాజరై ఈ మేరకు తన వివరణను సమర్పించారు. తన కుమార్తె అయినంత మాత్రాన ఆమె వ్యక్తం చేసిన రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయడం సముచితం కాదని, అది సహజ న్యాయ సూత్రాలకు…

TELANGANA

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల చట్టబద్ధత, ఉచిత పథకాలకు నిధుల వినియోగంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకాల నిధుల విడుదలపై ఉన్న మధ్యంతర స్టేను ఎత్తివేసేందుకు జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం నిరాకరించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘డేంజర్ బెల్స్’ మోగుతున్నాయని హెచ్చరించిన ధర్మాసనం… పరిమితి లేకుండా ఉచిత పథకాలకు నిధులు మళ్లించడం వల్ల ఇతర అత్యవసర…

TELANGANA

సీటు రగడ.. సీఎం రేవంత్‌పై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు..

పరకాల టికెట్‌పై రేవంత్‌ను ప్రశ్నించిన కొండా సుష్మితరేవూరికి టికెట్‌ ఎలా ఖరారు చేస్తారని నిలదీతటికెట్లను అధిష్ఠానమే నిర్ణయిస్తుందని స్పష్టీకరణకొండా మురళికి ఎమ్మెల్సీ హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నబీసీల పట్ల వివక్ష చూపుతున్నారని రేవంత్‌పై ఆరోపణలు తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ టికెట్‌ వ్యవహారం మరోసారి వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పిలుపునిచ్చారు. దీనిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా…

TELANGANA

రూపారెడ్డి మర్డర్ కేస్‌లో ఊహించని ట్విస్ట్.. విద్యార్థులే నిందితులా..?

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి దారుణ హత్య కేసు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నెల 11న జరిగిన ఈ ఘాతుకంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, సుమారు 80 మందిని సమగ్రంగా విచారించారు. విచారణ ఆధారంగా.. చెడు వ్యసనాలకు బానిసలైన స్థానిక తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థులే ఈ హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో…

TELANGANA

ఈసీ లక్షలాది ఓట్లను తొలగించింది: మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణ..

తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం (ఈసీ) విచక్షణారహితంగా లక్షలాది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.నగరంలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించలేదని, ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులే ఎక్కువగా నష్టపోయారని…