తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా తెలంగాణలో సుమారు రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రధాని ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన కీలక ప్రాజెక్టుల వివరాలు ఇవి: హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్: ఇందులో భాగంగా సూరారం నుంచి మహబూబ్నగర్…

