TELANGANA

TELANGANA

తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా తెలంగాణలో సుమారు రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.   ప్రధాని ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన కీలక ప్రాజెక్టుల వివరాలు ఇవి: హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్: ఇందులో భాగంగా సూరారం నుంచి మహబూబ్‌నగర్…

TELANGANA

బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు..!

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఆయనపై పోక్సో కేసు నమోదు కాగా, తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని సదరు యువతి కుటుంబం బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు చేశారు. ఈ పరస్పర ఫిర్యాదులతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.   హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ సుచిత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లి శుక్రవారం పేట్‌బషీరాబాద్…

TELANGANA

నేడు తెలంగాణలో మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డికి ఆహ్వానం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపింది. ఆదివారం (మే 10) హైదరాబాద్‌లో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం హాజరు కావాలని కోరుతూ కేంద్రం శనివారం ఆహ్వాన పత్రం అందజేసింది.   జాతీయ రహదారుల విభాగం రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ స్వయంగా ఈ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి అందించారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా ప్రధాని…

TELANGANA

తెలంగాణ బీడీ కార్మికులకు గుడ్ న్యూస్.. పెరిగిన వేతనాలు..

తెలంగాణలోని లక్షలాది మంది బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. బీడీ పరిశ్రమ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో కార్మికుల వేతనాలు పెరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు కొత్త వేతన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 7 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు.   తాజా ఒప్పందం ప్రకారం వెయ్యి బీడీలు…

TELANGANA

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు.. వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది.   దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ పదో…

TELANGANA

రేషన్ ఫాపుల్లో ఇకపై అవి కూడా పంపీణీ..?

రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. మొక్కజొన్న, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కవ ధరకు రేషన్ దుకాణాల ద్వారా నేరుగా పేదల చెంతకు చేర్చేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ పంటలను బహిరంగ మార్కెట్‌లో వేలం వేసి మధ్యవర్తులకు లాభం చేకూర్చకుండా, సివిల్ సప్లై శాఖ ద్వారా రేషన్ షాపుల లో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. త్వరలోనే…

TELANGANA

రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్..

వరంగల్ వేదికగా జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని కొనియాడిన కేటీఆర్, ఇక్కడి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. నాలుగేళ్ల క్రితం వరంగల్‌లో కాంగ్రెస్ ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ ఒక నయవంచన అని, అది కేవలం ఓట్ల కోసమే చేసిన ‘కొంగజపం’ అని ఆయన మండిపడ్డారు. డిక్లరేషన్‌లో ఇచ్చిన 34 హామీలను గాలికొదిలేశారని,…

TELANGANA

రఘురాం రాజన్‌తో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్..

తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నిన్న జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రఘురాం రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సలహాలు, సూచనలు అందించారు.   ఈ సందర్భంగా…

TELANGANA

రేవంత్ రెడ్డి కవితతో పార్టీ పెట్టించారు.. ధర్మపురి అరవింద్ కిలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవితతో పార్టీని పెట్టించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. కవిత స్థాపించిన ‘టీఆర్ఎస్’ ప్రభావం కేసీఆర్, కేటీఆర్ పైనే ఉంటుందని అన్నారు. ఇక ఏ పార్టీపై ప్రభావం ఉండదని అభిప్రాయపడ్డారు. కవిత పార్టీకి రేవంత్ రెడ్డి అండ ఉందని ఆరోపించారు. మద్యం పాలసీ కేసులో ఆమెకు క్లీన్ చిట్ రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోందని తెలిపారు.   రానున్న…

TELANGANA

ఉద్యోగులకు సీఎం రేవంత్ నాలుగు వరాలు.. పీఆర్సీపై కీలక ఆదేశాలు..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు కీలకమైన శుభవార్తలు చెప్పారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో శనివారం జరిగిన సమావేశంలో వారి దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయాలతో సంతృప్తి చెందిన ఉద్యోగ సంఘాలు, మే 5న తలపెట్టిన ధర్నాతో పాటు ఇతర నిరసన కార్యక్రమాలను విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో ఉద్యోగుల సేవలను సీఎం ఈ సందర్భంగా అభినందించారు.   జూన్ 1 నాటికి హెల్త్ కార్డులు ఉద్యోగులందరికీ…