TELANGANA

అప్పులపై కాగ్ రిపోర్ట్..! ఏం తేల్చింది..?

తెలంగాణ అసెంబ్లీలో టేబుల్ చేసిన కాగ్ రిపోర్ట్ చుట్టూ ఇప్పుడు పెద్ద డిబేటే నడుస్తోంది. జమాఖర్చులు, అప్పులు, రీపేమెంట్ల చుట్టూ గందరగోళం సీన్ క్రియేట్ చేసేలా మ్యాటర్ మారింది. అయితే ఈ కాగ్ రిపోర్ట్ ను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంటే.. బీఆర్ఎస్ హయాంలో బడ్జెట్ ఊహలకు, చేసిన ఖర్చులకు పొంతన లేదని కాంగ్రెస్ లెక్కలు చూపిస్తోంది. ఈ విషయంలో ఎవరి లెక్క వారిదే అన్నట్లుగా మారింది. అయితే ఏది నిజం? బీఆర్ఎస్ అప్పులు తెచ్చి సంపద సృష్టించిందన్నది కాగ్ రిపోర్ట్ తేల్చిందా? కాంగ్రెస్ చెబుతున్నట్లు బీఆర్ఎస్ హయాంలో అన్ని అప్పులు చేయలేదా?

 

తెలంగాణ అప్పులపై కాగ్ రిపోర్ట్ ఏం తేల్చింది?

 

మంత్రులకు కాగ్ రిపోర్ట్ అర్థం కావట్లేదని, దాంతో స్వయంగా హరీష్ రావు వెళ్లి ఎక్స్ ప్లెయిన్ చేసి వచ్చినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్న పరిస్థితి. కాగ్ లెక్కలను అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుందా? సో అసలు మ్యాటర్ ఏంటంటే.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్ట్ ను ఎవరికి వారే అన్వయించుకుంటున్నారు. అందులో ఎవరికి అనుకూలంగా ఉన్న సంఖ్యలను వారు చెప్పుకుంటున్నారా అన్న డౌట్లు జనంలో పెరుగుతున్నాయి. అయితే వాస్తవం ఏంటో ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం.

 

2023-24 నాటికి అప్పు 4,03,664 కోట్లు

 

2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2023-24 ముగిసే వరకు తెలంగాణ రాష్ట్ర రుణాల మొత్తం 4 లక్షల 3 వేల 664 కోట్లు అని, వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు 2 లక్షల 20 వేల కోట్లు అని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. 45 శాతం రెవెన్యూలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేతనాలు, పెన్షన్లు, ఇంట్రెస్ట్ పేమెంట్ల చుట్టూనే కథ నడిపించిందని తేల్చింది.

 

అప్పుగా తెచ్చిన సొమ్ముతో ఆస్తుల సృష్టి ఏదన్న కాగ్

 

ఎస్ అప్పులు తెచ్చాం.. ఆస్తులు సృష్టించాం.. రాష్ట్రాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లాం.. ఇదీ బీఆర్ఎస్ నేతలు తరచూ అప్పులను సమర్థించుకుంటూ చెప్పే మాటలు. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారం తేలిందేమిటి? తెచ్చిన అప్పులను ఆస్తుల సృష్టికి వాడలేదని తేల్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పు తెచ్చిన మొత్తంతో మూలధన వ్యయం కింద ఆస్తులను సృష్టిస్తుంది. కానీ.. రాష్ట్రంలో 2019 నుంచి ఏనాడూ అప్పుల సొమ్మును ఆస్తుల సృష్టికి పూర్తిస్థాయిలో కాగ్ రిపోర్ట్ హైలెట్ చేసింది. రాబడులు తక్కువై, ఖర్చులు పెరిగినప్పుడు అప్పులు చేయాల్సిందే. అయితే ఈ అప్పుల్ని సాగునీటి ప్రాజెక్టులకు, మౌలిక వసతుల కల్పనకు వాడాలి. అప్పుడు జనం ఆదాయానికీ మేలు జరుగుతుంది. తిరిగి అది మార్కెట్ లోకి వస్తుంది. తెలంగాణలో మాత్రం అప్పులను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. తెచ్చిన అప్పులను పూర్తిస్థాయిలో మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టినట్లు కనిపించడం లేదన్నది.

 

గతానికి, ఇప్పటికి మారింది ఆర్థిక క్రమశిక్షణ

 

గత ప్రభుత్వానికి, ఇప్పటికి మారిందేమిటి అంటే.. ఆర్థిక క్రమశిక్షణ. ఇష్టారాజ్యంగా అప్పులు తెచ్చి ఏదేదో చేయడం కాదు.. వాస్తవాలకు తగ్గట్లు వాడడం, అంతే కాదు.. బడ్జెట్ కూడా వాస్తవాలకు దగ్గరగా పెట్టడం. ఇదే చేశారు. గత 5 ఆర్థిక సంవత్సరాలలో ఎప్పుడూ వాస్తవానికి దగ్గర బడ్జెట్ ప్రతిపాదించలేదని కాగ్ నివేదికతో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. 2020-–21లో రూ.1.38 లక్షల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. రూ.1.23 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే అనుకున్న దానికంటే 11% తేడా వచ్చింది. 2020-21లో ఈ గ్యాప్ 24శాతంగా తేలింది. 2022–23లో 19 శాతం వ్యత్యాసం, 2023–24లో రూ.2.34 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్లో అంచనాలు వేశారని.. కానీ అనుకున్న లక్ష్యంలో 28% ఖర్చు పెట్టలేదని కాగ్ తేల్చిన లెక్క.

 

బీఆర్ఎస్ బడ్జెట్ అంచనాలు ప్రతిసారీ తలకిందులే

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు ప్రతిసారీ తలకిందులైయ్యాయి. బడ్జెట్‌‌‌‌లో భారీగా అంచనాలు వేయడం.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ ప్రకారం ఇన్ కమ్ రాకపోవడంతో అంచనాల మేర ఖర్చు చేయలేదని కాగ్ తేల్చింది. గత ప్రభుత్వం అవగాహన లేకుండా బడ్జెట్ పెట్టినట్టు ఉందని కాగ్ పేర్కొంది. సో రిపోర్ట్ చుట్టూ అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ పెరిగింది.

 

2019–20 నుంచి 2023–24 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇదే పరిస్థితి

 

అయితే కాగ్ రిపోర్ట్ ను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుంది. తెచ్చిన అప్పులన్నీ అభివృద్ధి కోసమే అని చెప్పుకుంటున్న పరిస్థితి. మూలధన వ్యయంతో సొంతరాబడులు పెరిగాయని, ఏ రిపోర్ట్ చూసినా తెలంగాణ దిగ్గజ రాష్ట్రమే అని కేటీఆర్ చెబుతున్న మాట. అవకాశం లేనిచోట కూడా ఎక్కువ ఆదాయాన్ని అంచనా వేయడం, ఫలితంగా ఖర్చులు దేనికి చేయాలని ఉద్దేశించారో దానికి చేయలేకపోయారని కాగ్ ఐడెంటిఫై చేసింది. అందుకే అప్పులు తెచ్చుకోవడం ద్వారానే అభివృద్ధి సాధించినట్లు సమర్థించుకుంటే అది వర్కవుట్ కాదని మంత్రి పొన్నం కౌంటర్ కూడా ఇచ్చారు. గ్రాంట్ ఇన్ఎయిడ్‌‌‌‌లో పెద్ద మొత్తంలో చూపించి బడ్జెట్‌‌‌‌ను సరిగా ప్లాన్ చేయలేదని.. చివరకు కీలకమైన స్కీంలను కూడా పక్కకు పెట్టి బడ్జెట్‌‌‌‌లో పేర్కొనని కార్యక్రమాలు అమలు చేసినట్టు కాగ్ గుర్తించింది. 2019–20 నుంచి 2023–24 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు వెల్లడించింది.

 

చ్చిన నిధులు ఖర్చు చేయకుండా ఏం చేసినట్లు? ఎటు మళ్లించినట్లు?

 

ఏ రాష్ట్రానికైనా, ఏ ఇంటికైనా ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అదే. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టడం, పెట్టిన బడ్జెట్ లో మ్యాగ్జిమమ్ ఖర్చు చేసేలా చూసుకోవడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. పదేళ్ల భ్రమలు వద్దు.. రియాల్టీలోనే ఉందాం అని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెబుతున్న మాట. ఇంకోవైపు గత ప్రభుత్వం అప్పుగా తెచ్చిన నిధులు ఖర్చు చేయకుండా ఏం చేసినట్లు? ఎటు మళ్లించినట్లు? ఇది కూడా పెద్ద డౌట్లే క్రియేట్ చేస్తోంది.

 

తెచ్చిన అప్పుల్లో రూ.81,469 కోట్లు దారి మళ్లాయన్న కాగ్

 

బీఆర్ఎస్ హయాంలో అక్షరాలా 81 వేల 469 కోట్ల రూపాయల అప్పులు దారి మళ్లాయి. ఇది ఎవరో చెబుతున్న మ్యాటర్ కాదు. సాక్షాత్తూ రాజ్యాంగ సంస్థ కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనలర్ చెబుతున్న లెక్కలే. గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు, డెవలప్మెంట్ పనుల కోసం క్యాపిటల్ఎక్స్ పెండిచర్ కింద తీసుకున్న అప్పులను దారి మళ్లించినట్లు గుర్తించింది. ప్రాజెక్టులు, పనుల కోసం అప్పులను తీసుకుంటున్నట్టు చూపించి.. వాటి కోసం ఖర్చు చేయలేదని కాగ్ క్లారిటీ ఇచ్చింది. 2019-20 నుంచి 2023-24 వరకు ప్రతిసారి వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు తెలిపింది. ఫలితంగా ఆస్తుల సృష్టి జరగలేదని ఖుల్లం ఖుల్లాగా చెప్పేసింది కాగ్.

 

2019-20లో రూ. 38,285 కోట్ల అప్పులు

 

2019-20లో 38 వేల 285 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటే అందులో 25 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా మొత్తం అంటే 12 వేల 726 కోట్లు వేరే వాటికి మళ్లాయి. 2020-21లో 47 వేల 132 కోట్లు అప్పులు తీసుకుంటే.. 26 వేల కోట్లు మాత్రమే క్యాపిటల్ ఖర్చులు చేశారు. 2021-22లో 46 వేల 995 కోట్లు మూలధనం వ్యయం కోసం అప్పులు చేయగా.. అందులో 17వేల 881 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 50వేల 528 కోట్లు అప్పు చేస్తే.. 43వేల 918 కోట్లు ఖర్చు చేశారు. మిగతా మొత్తం రూట్ మార్పించేశారన్నది కాగ్. ఓవరాల్ గా వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్ట్ ల కింద రొటేషన్ అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని నడిపినట్టు కాగ్ తెలిపింది. ఈ రెండూ లేకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవహారం చక్కబెట్టమే కష్టం అన్న సీన్ క్రియేట్ అయిందన్నది కాగ్.

 

దారిమళ్లిన అప్పులు

 

ఏడాది దారిమళ్లిన నిధులు (రూ.లలో)

2019–20 12,726

2020–21 20,342

2021–22 18,112

2022–23 23,679

2023–24 6,610

 

జీఎస్డీపీలో 27 శాతం అప్పులు

 

అప్పుల విషయంలో 2019-20లో ఎఫ్ఆర్‌‌‌‌బీఎం పరిధిలో 2.32 లక్షల కోట్లు ఉండగా.. 2023-24 నాటికి 4.03 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం జీఎప్డీపీలో 27 శాతం అప్పులు తీసుకున్నారన్నది కాగ్. గ్యారంటీ అప్పులకు సంబంధించి 200 శాతం పెంచుకునేందుకు ఎఫ్ఆర్ బీఎం యాక్ట్ 2020కు సవరణ చేసి మరీ అప్పులు చేశారన్నది కాగ్. ఎంత చేసినా తెలంగాణ రెవెన్యూ సర్ ప్లస్ స్టేటే అని కేటీఆర్ అంటున్నారు. వస్తున్న ఆదాయానికి, చేస్తున్న ఖర్చులకు పెద్ద తేడా లేదంటున్నారు.

 

గత అప్పులు తీర్చాలంటే రూ.6 లక్షల కోట్లు అవసరం

 

అయితే అప్పుల విషయంలో చాలా గందరగోళ పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. దీనిపై ఏఐ గ్రోక్ ఆన్సర్లను కూడా కొందరు సరదాగా అడిగి చూశారు. ఒక రాష్ట్రానికి అప్పులు ఎన్ని ఉన్నాయన్నది ఆయా సంస్థలు క్లారిటీగా చెప్పే విషయంపై ఆధారపడి ఉంటాయి. ఇందులో మెయిన్ సోర్స్ గా తీసుకున్నవి చూపిస్తుంటారు. కార్పొరేషన్లు తీసుకున్న అప్పులను ప్రభుత్వ అప్పులుగా చూపరు. అవే తెచ్చుకున్నాయి.. అవే కట్టుకుంటాయన్న వాదనను బీఆర్ఎస్ వినిపించింది. అయితే కార్పొరేషన్ లోన్లు కూడా ప్రభుత్వ అవసరాలకే వాడుకున్న పరిస్థితి ఉంది. అందుకే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే 6 లక్షల కోట్లు స్ట్రెయిట్ అవే కావాలంటున్నారు సీఎం రేవంత్.

 

జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు 2023-24లో రూ.75,456 కోట్లు

 

కాగ్ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వ ఖర్చుల్లో 45 శాతం ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు, గత అప్పులకు కడుతున్న వడ్డీలే ఉన్నాయి. ఇది ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూ పోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడింటికి ఖర్చు చేసిన మొత్తం 75వేల 456 కోట్లుగా ఉంది. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే గత ప్రభుత్వం ఎడాపెడాగా తీసుకొచ్చిన అప్పుల్లో 81 వేల 469 కోట్ల రూపాయలను వేరే వాటికి మళ్లించినట్లు కాగ్ గుర్తించింది. ఎటు మళ్లించారు.. ఒక పేరుతో అప్పు చేసి వేరే పనికి ఎందుకు వాడారన్నది పెద్ద డౌట్. ఆ లెక్కలన్నీ తేలాల్సిన టైమ్ వచ్చిందంటున్నారు కాంగ్రెస్ నేతలు.