రాజస్థాన్లో వరుసగా రెండో రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్లోని హర్మారా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహా మండి ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే, లోహా మండీ నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను, జనాలను ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో 10 మంది మరణించగా, మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. టిప్పర్ సృష్టించిన బీభత్సానికి 10కి పైగా వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి, వీటిలో ఎక్కువగా బైక్లు, కార్లు, ఆటోలు ఉన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్లో 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండో ఘోర రోడ్డు ప్రమాదం ప్రజల్లో భయాందోళనలను పెంచింది.

