TELANGANA

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో ఘనవిజయం సాధించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల దొంగతనంతో పాటు సీట్ల దొంగతనానికి కూడా బీజేపీ పాల్పడుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆయన అన్నారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రస్తుతం సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా ముందుకు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను కావాలనే తిరస్కరించారని ఆరోపించారు. పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే లక్ష్యంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.