AP

స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పనకు జనసేన కమిటీని నియమించారు. దీనికోసం 14 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన విధి విధానాలు రూపకల్పనకి ప్రత్యేక కమిటీని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఈ కమిటీలో మోత్తం 14 మంది సభ్యులను నియమించారు. విధి విధానాలతోపాటు క్షేత్ర స్థాయిలో శ్రేణుల ఆలోచనలను ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన శాసన సభ పక్షం సమావేశంలో జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా వారి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుదామని పిలుపునిచ్చారు.

కమిటీ సభ్యులు

1. శ్రీ మండలి బుద్ధ ప్రసాద్
2. శ్రీ టి.శివ శంకర్
3. శ్రీ కందుల దుర్గేష్
4. శ్రీ వల్లభనేని బాలశౌరి
5. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్
6. శ్రీ దేవ వరప్రసాద్
7. శ్రీ సీహెచ్ వంశీకృష్ణ యాదవ్
8. శ్రీమతి లోకం మాధవి
9. శ్రీ పత్సమట్ల ధర్మ రాజు
10. శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి
11. శ్రీ కొటికలపూడి గోవిందరావు (చినబాబు)
12. శ్రీ సామినేని ఉదయభాను
13. శ్రీ యనమల భాస్కర్
14. శ్రీ కొరికాన రవి కుమార్