AP

ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఆయన హస్తిన వెళ్తున్నారు.

 

వివరాల్లోకి వెళితే, ఈ నెల 14వ తేదీన, అంటే వచ్చే సోమవారం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ముఖ్యులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా కేంద్ర హోం శాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి శాఖల మంత్రులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతారు.

 

ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాధాన్యత అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురు కీలక మంత్రులతో పాటు, మరికొందరు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల సమాచారం.