AP

తిరుపతి-షిర్డీ రైలుపై సీఎం చంద్రబాబు ప్రతిపాదన..! కేంద్రం ఆమోదం..

తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వరకు తాత్కాలిక ప్రాతిపదికన నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 07637/07638)కు రైల్వే శాఖ శాశ్వత హోదా కల్పించింది. ఈ మేరకు రైలును క్రమబద్ధీకరించి రెగ్యులర్ రైలుగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు.

 

ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 2న రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ పంపారు.

 

ఈ రైలు రేణిగుంట, ధర్మవరం, రాయచూరు, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా తిరుపతి నుంచి షిర్డీ వరకు ప్రయాణిస్తుంది. రైలును వారానికి ఒకటి లేదా రెండుసార్లు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.

 

ఈ రైలు ద్వారా తిరుపతి, షిర్డీ పుణ్యక్షేత్రాల మధ్య భక్తులకు ప్రయాణం సులభతరం అవుతుంది. విశ్వసనీయమైన, అందుబాటు ధరల్లో రవాణా సౌకర్యం లభిస్తుందని రైల్వే శాఖ పేర్కొంది.