శ్రీ సత్య సాయి జిల్లా కదిరి
- కార్డెన్ సర్చ్…..
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో భారీ గా పోలీస్ తనిఖీలు
- ఉదయం 5 గంటల నుంచి నిజాం వలి కాలనీలో పోలీసుల సోదాలు
- డీఎస్పీ కదిరి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో ఆపరేషన్
- పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు
- రికార్డులు లేని పలు వాహనాలు స్వాధీనం
- గంజాయి కేసులపై ప్రత్యేక దృష్టి
రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ తనిఖీ - చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసుల
శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు.ఈ రోజు ఉదయం 5 గంటల నుంచే కదిరి టౌన్లోని నిజాం వలి కాలనీలో
డీఎస్పీ కదిరి ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసులతో,విస్తృత స్థాయిలో ఇల్లు సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా రికార్డులు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అలాగే గంజాయి కేసులు, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్కు సంబంధించి
సమగ్ర తనిఖీలు కొనసాగుతున్నాయి.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని వెల్లడించారు.

