శ్రీ సత్య సాయి జిల్లా..
- జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో..
- పేకాట స్థావరంపై పోలీసులు దాడులు..
- 8 మంది జూదరులు అరెస్టు..
రూ,64,340 నగదు
8 సెల్ ఫోన్లు స్వాధీనం..
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి సబ్ డివిజన్లో డిఎస్పీ శివన్నారాయణ స్వామి ఆధ్వర్యంలో పేకాట జూద కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.
గాండ్లపెంట మండలంలోని కాటరుపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న రాబడిన సమాచారం మేరకు గాండ్లపెంట ఎస్సై సుమతి తమ సిబ్బందితో బుధవారం పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి ఎనిమిది మంది జూదారులు , 8 సెల్ ఫోన్లు,
రూ 64, 340, నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమతి తెలిపారు.

