కదిరి టౌన్ పోలీసు స్టేషన్…
కదిరి APSRTC బస్ స్టాండ్ వద్ద దొంగతనాలు చేసిన ముగ్గురు మహిళా దొంగలు అరెస్టు, వారి వద్ద నుండి సుమారు సుమారు 5,65,000/- విలువగల బంగారు ఆభరణాలు మరియు 75,000/- నగదు స్వాధీనము…
కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని APSRTC బస్ స్టాండ్ వద్ద గత 5 నెలల కాలములో వరుసగా జరుగుతున్న పర్సు మరియు బంగారు ఆభరణాల దొంగతనాలపై కదిరి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కదిరి DSP, శ్రీ జే.శివ నారాయణ స్వామి గారి పర్యవేక్షణలో కదిరి టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ డి.వి. నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో కదిరి టౌన్ ఎస్ఐ, శ్రీ K. బాబజాన్, ఉమెన్ ఎస్ఐ, శ్రీమతి భువనేశ్వరి మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జాకీర్ హుస్సైన్, మరియు కానిస్టేబుల్ శివ శంకర్ రెడ్డిలు ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేసి 06-03-2026 తేదీన కదిరి APSRTC బస్ స్టాండ్ వద్ద గస్తీ నిర్వహిస్తూ ఉండగా,
ఈ సందర్భంగా బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు మహిళలను పోలీసులు గుర్తించగా వారు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా వారి పేర్లు
1. మల్లెల గంగా @ గంగా, వయస్సు 40 సంవత్సరాలు, భర్త పేరు: మల్లెల శ్రీనివాసులు @ శీనా, ఎరికుల కులము, స్వగ్రామము చంద్రబాబు కాలనీ, కొక్కంటి క్రాస్, తనకల్లు మండలం, ప్రస్తుతము బైరాపురం గ్రామము, కొత్త చెరువు మండలం, శ్రీ సత్యా సాయి జిల్లా.
2. దేవరకొండ అంజలి @ సాకే అంజలి, వయస్సు 25 సంవత్సరాలు, భర్త పేరు: యశ్వంత్ కుమార్ బాబు, ఎరికుల కులము, స్వగ్రామము చంద్రబాబు కాలనీ, కొక్కంటి క్రాస్, తనకల్లు మండలం, ప్రస్తుతము బైరాపురం గ్రామము, కొత్త చెరువు మండలం, శ్రీ సత్యా సాయి జిల్లా.
3. కాల్వపల్లి భూదేవి, వయస్సు 54 సంవత్సరాలు, భర్త పేరు: రామ చంద్ర, పిచ్చిగుంట్ల కులము, స్వగ్రామము మారుతి కాలనీ, సోమందేపల్లి టౌన్ మరియు మండలం, శ్రీ సత్యా సాయి జిల్లా.
విచారణలో వారు కదిరి APSRTC బస్ స్టాండ్ మరియు ఇతర బస్ స్టాండ్ లలో ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో వారి దృష్టి మళ్లించి పర్సులు, నగదు మరియు బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.
పోలీసులు వారి వద్ద నుండి పలు కేసులకు సంబంధించిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
________________________________________
కేసు వారీగా నేర వివరాలు – ఫిర్యాదుదారుల పేర్లు మరియు రికవరీ
Crime No.56/2026 – U/sec 303(2) BNS
• నేరం జరిగిన తేదీ : 21-11-2025
• ఫిర్యాదుదారు : బాల గాయత్రి ప్రసాద్, భర్త: బాల ప్రకాష్ యాదవ్, జురుకువారిపల్లి, గాండ్లపెంట
• రికవరీ : రెండు జతల బంగారు కమ్మలు (సుమారు 8.5 గ్రాములు), వాటి విలువ : 1,15,000/-.
Crime No.405/2025 – U/sec 303(2) BNS
• నేరం జరిగిన తేదీ : 30-11-2025
• ఫిర్యాదుదారు : మీనుగ మంజుల, అనంతపురం
• రికవరీ : ఒక జత బంగారు కమ్మలు మరియు జుంకీలు, వాటి విలువ సుమారు 60,000/-.
Crime No.53/2026 – U/sec 303(2) BNS
• నేరం జరిగిన తేదీ : 20-12-2025
• ఫిర్యాదుదారు : గూడ మనోహర, కదిరి టౌన్
• రికవరీ : నగదు ₹20,000/-
Crime No.20/2026 – U/sec 303(2) BNS
• నేరం జరిగిన తేదీ : 21-01-2026
• ఫిర్యాదుదారు : K. అమృత రాజ్, కదిరి టౌన్
• రికవరీ :
o ఒక బంగారు తాళిబొట్టు చైన్ (సుమారు 30 గ్రాములు)
o నాలుగు జతల బంగారు కమ్మలు (సుమారు 10 గ్రాములు) వాటి విలువ సుమారు 2,50,000/-
Crime No.55/2026 – U/sec 303(2) BNS
• నేరం జరిగిన తేదీ : 07-02-2026
• ఫిర్యాదుదారు : మేదర నవీన్ కుమార్, ప్రసన్నయ పల్లి, రాప్తాడు
• రికవరీ : నగదు ₹55,000/-.
Crime No.54/2026 – U/sec 303(2) BNS
• నేరం జరిగిన తేదీ : 10-02-2026
• ఫిర్యాదుదారు : తిరుపల్లి సుగుణ, మదనపల్లి, అన్నమయ్య జిల్లా
• రికవరీ : ఒక బంగారు తాళిబొట్టు చైన్ (సుమారు 11 గ్రాములు) వాటి విలువ 1,50,000/-
________________________________________
మొత్తం రికవరీ
• బంగారు ఆభరణాలు : సుమారు 59.5 గ్రాములు, వాటి విలువ: 5.65,000/-
• నగదు : ₹75,000/-
పోలీసులు ముగ్గురు మహిళలను కొత్తగా వచ్చిన BNS చట్టం కింద అరెస్టు చేయడం జరిగింది.
పోలీసుల గమనిక: రద్దీ ప్రదేశాలలో ప్రయాణికులు తమ పర్సులు, నగదు మరియు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కదిరి ఉప పోలీసు అధికారి (SDPO) గారు ప్రజలకు సూచించడము జరిగింది.
J. శివ నారాయణ స్వామి,
డిఎస్పి, కదిరి సబ్ డివిజన్.

