Editor

National

కేంద్రం కొత్త రూల్..! రోడ్డు నాణ్యత బాగోలేదా అయితే వాళ్లంతా జైలుకే..?

నిత్యం రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిలో లెక్కలేనంత మంది గాయపడడమో, చనిపోవడమో జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కర్ ఆసక్తకర కామెంట్లు చేశారు. దేశంలో నాణ్యత లేని రోడ్లు వేస్తే.. అందుకు కారణమైన వాళ్లను జైలుకు పంపాలంటూ వ్యాఖ్యానించారు. అవినీతి, అత్యాశ, లంచాలతో రోడ్ల నాణ్యతకు తూట్లు పొడిచేవారిని విడిచిపెట్టవద్దంటూ ఘాటూ వ్యాఖ్యాలు చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యాలు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  …

TELANGANA

ఫార్ములా -ఈ రేస్ కేసు.. ఏసీబీ ముందుకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు..

ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఈనెలాఖరులోగా విచారణ పూర్తి అవుతుందా? ఇటు ఏసీబీకి.. అటు ఈడీకి చిక్కిన, లభించిన ఆధారాలేంటి? ఈ కేసులో ఏసీబీ ముందు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు హాజరవుతున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.   ఫార్మాలా ఈ రేసు కుంభకోణంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసు ప్రారంభంలో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌రెడ్డి పేర్లు బయటకు…

TELANGANA

ఇంటర్ సిలబస్‌లో మార్పులు.. ఏఐ, డేటా సైన్స్‌కు చోటు..?

ఇంటర్ సిలబస్‌లో మార్పులు-చేర్పులు జరుగుతున్నాయా? మారిన సిలబస్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుందా? కొన్ని పాఠాలను తొలగించాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందా? రాబోయే కొత్త పాఠాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది స్టూడెంట్స్‌ను వెంటాడుతోంది.   మారుతున్న కాలానికి అనుగుణంలో ఇంటర్ విద్యలో మార్పులు చేయాలని తెలంగాణ బోర్డు ఆలోచన చేస్తోంది. ఇప్పటికే వేసిన కమిటీ కసరత్తు చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, ఆర్ట్స్‌లో కొన్ని పాఠాలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. వాటి…

AP

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌కు షాక్.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు ఏపీ సర్కార్ భారీ షాకిచ్చింది. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.   సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై వచ్చిన అభియోగాలపై సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఆదేశాలిచ్చారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ…

AP

ఆ మూడు స్కీమ్స్ కి గ్రీన్ సిగ్నల్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..

ఏపీలో ఎప్పుడు ఎప్పుడు అంటూ ఆ పథకాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో శుక్రవారం ఏపీ కేబినెట్ భేటీ సాగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాల గురించి సుధీర్గంగా చర్చ సాగింది. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి తొలితగతిన నిర్మాణ పనులు సాగేలా చర్యలు…

AP

పోలవరం పై ఏపీకి కేంద్రం బిగ్ అప్డేట్..

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పై కీలక నిర్ణయం జరిగింది. డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు ముందుకు సాగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ నిర్మాణం పూర్తయ్యేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఈ మేరకు కేంద్ర జల సంఘం తమ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి స్పష్టం చేసింది. దీని పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపు ( శనివారం) నుంచే పనులు ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది.  …

AP

ఏపీలో సచివాలయాలు రద్దవుతాయా..?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలను లబ్దిదారులకు మెరుగ్గా అందిస్తామంటూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. దాదాపు లక్షన్నర మంది ఉద్యోగుల్ని కూడా ఇందులో వివిధ విభాగాల కార్యదర్శులుగా నియమించింది. అయితే ఇంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం జరగడం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ ఇందులో ఉద్యోగుల హేతుబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్యోగుల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం…

TELANGANA

సింగపూర్‌లో సీఎం రేవంత్ టీమ్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. గురువారం రాత్రి సింగపూర్‌కు చేరుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడ పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.   తొలుత సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల నుంచి ఇరువురు చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య- నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ…

TELANGANA

లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? ఎవరు దొంగో తేలుతుంది.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

ఎన్ని ప్రశ్నలు అడిగినా… ఎన్నిరకాల పరీక్షలు పెట్టినా తాను భరిస్తానని… మరి సీఎం రేవంత్ రెడ్డి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తమపై ఉన్న కేసులకు సంబంధించి తామిరువురం ఒకేచోట కూర్చొని అధికారులు, ప్రజలు చూస్తుండగా ప్రశ్నిస్తే… అప్పుడు దొంగ ఎవరో తేలుతుందన్నారు. విచారణ అనంతరం ఆయన ఈడీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.   రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు ఉందని, అందుకే తనపై కూడా ఏసీబీ…

National

ఢిల్లీలో ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025..

దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన “భారత మండపం”, “యశోభూమి” కన్వెన్షన్ సెంటర్లలో “ఎక్స్‌పో” కొనసాగుతుంది. ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు రవాణా రంగ సంస్థలు భాగం కానున్నాయి. నేటి నుంచి జనవరి 22వ తేదీ వరకు గ్లోబల్ ఎక్స్‌పో కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఎక్స్‌పోలో పెవిలియన్ ఏర్పాటు చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా‌స్ట్రక్చర్(MEIL)కు చెందిన “ఒలెక్ట్రా” సంస్థ.…