Editor

AP

అక్టోబర్ 2 నాటికి చెత్త లేని పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు..

స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్‌ను సందర్శించి రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పలు కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా ప్రకటించారు.   నెట్‌ జీరోకు రాష్ట్రంలో పర్యావరణాన్ని…

AP

వైసీపీపై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో వైసీపీ కొత్త ఎత్తులకు పాల్పడుతుందా? కూటమి ప్రభుత్వంపై యువత, నిరుద్యోగులు అసహించుకునే స్కెచ్ వేసిందా? మంత్రి నారా లోకేష్ ఎందుకు ఆ మాటలు అన్నారు? డీఎస్సీపై వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కారణమేంటి? అన్నదే ఇప్పుడు అసలు చర్చ. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 16 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులు సైతం స్వీకరించింది. అయితే దరఖాస్తు విషయంలో పలు సమస్యలు తలెత్తడంతో…

National

మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ విజృంభిస్తున్న కేసులు..

ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్‌ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామం ఆసియా వ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తోంది.   హాంగ్‌కాంగ్‌లో ప్రస్తుతం వైరస్ కేసులు ‘చాలా ఎక్కువగా’ ఉన్నాయని నగర ఆరోగ్య పరిరక్షణ కేంద్రంలోని అంటువ్యాధుల విభాగం అధిపతి అల్బర్ట్ స్థానిక మీడియాకు తెలిపారు. ఇటీవల కాలంలో హాంగ్‌కాంగ్‌లో శ్వాసకోశ నమూనాల్లో…

TELANGANA

ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం..! ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్..

ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. మూడు రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం.. వీరి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏకధాటిగా 9 గంటల పాటు సిట్ ఇద్దరినీ విచారించిన విషయం తెలిసిందే.   రేపు వీరి ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200…

TELANGANA

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..! మరో కొత్త పథకం..

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పోడు రైతులకు ఇది ఊహించని తీపి కబురు. రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతుల కోసం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా 6 లక్షల ఎకరాల భూములకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్‌ మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.   ఇందిర సౌర గిరి జల…

TELANGANA

మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్..

తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ అనగానే గుర్తుకొచ్చేవారిలో మంత్రి కొండా సురేఖ ఒకరు. తనకు ఏదైనా తెలుస్తే ఓపెన్‌గా బయటపెడతారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. అవే ఒక్కోసారి ఆమెకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి కూడా. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..   మంత్రి కొండా సురేఖ గురించి చెప్పనక్కర్లేదు. మనసులో ఏమీ దాచుకోకుండా నిజాన్ని ఓపెన్‌గా చెప్పేస్తారు. ఆ తర్వాత ఎవరు…

National

రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు..! ‘భార్గవాస్త్ర’ ప్రయోగం విజయవంతం..!

దేశ రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. శత్రు డ్రోన్ల సమూహాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘భార్గవాస్త్ర’ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీఏఎల్) ఈ అత్యాధునిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.   ఒడిశాలోని గోపాల్‌పుర్‌ వద్ద గల సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్షలు జరిగినట్లు ఆర్మీ ఎయిర్‌…

TELANGANA

సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్.. కాళేశ్వరంలో ఘనంగా ఏర్పాట్లు..

దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి.ఇప్పటికే త్రివేణి సంగమం దగ్గర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి శ్రీధర్‌ బాబు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు 50లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.   ఉదయం 5.44…

TELANGANA

సీఈ రమణారెడ్డికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..!

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మహబూబ్‌నగర్‌ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ (సీఈ) రమణారెడ్డికి సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. “అక్కడ (గతంలో పనిచేసిన చోట) చేసినట్లు ఇక్కడ కూడా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా” అంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. రమణారెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో…

AP

వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్‌ ఎనలైజర్‌ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు.   గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హుటాహుటిన జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు…