Editor

AP

తిరుమలపైకి జగన్ అనకొండలను పంపిస్తున్నారు: టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తు

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్న జగన్ మోహన్ రెడ్డి ఏడుకొండలపైకి ‘అనకొండలను’ పంపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ నేతలు ఇప్పుడు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాదాపు 11 నెలల క్రితం…

TELANGANA

ఎమ్మార్వోపై అరెస్ట్ వారెంట్ జారీ: మానవ హక్కుల కమిషన్ సంచలన ఆదేశాలు

నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్‌పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) అరెస్ట్ వారెంట్ జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక భూ వివాదం కేసులో కమిషన్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడమే కాకుండా, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్ఆర్‌సీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజ్యాంగబద్ధమైన సంస్థకు జవాబుదారీగా లేకపోవడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కేసు నేపథ్యం: తిరుమలగిరి సాగర్…

CINEMA

డాడీ.. ఇంతకంటే ఏం కావాలి? తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్!

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల తన తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమను చాటుకుంటూ సోషల్ మీడియాలో ఒక హృద్యమైన సందేశాన్ని పంచుకున్నారు. సుస్మిత పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలుపగా, వాటికి స్పందిస్తూ ఆమె ఈ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. రెండేళ్ల చిన్నారిగా తండ్రి చేయి పట్టుకుని సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టిన తాను, నేడు అదే తండ్రికి నిర్మాతగా మారడం తన జీవితం పొందిన గొప్ప వరమని ఆమె పేర్కొన్నారు. తన పోస్టులో…

TELANGANA

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా: అధికారుల మౌనంపై స్థానికుల ఆగ్రహం!

ప్రభుత్వ భూములకు రక్షణ కరువవుతోంది. సామాన్యుడు చిన్న స్థలాన్ని ఆక్రమిస్తే కఠినంగా వ్యవహరించే అధికారులు, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి కళ్లముందే కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సర్వే నంబర్ 993లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా అపార్ట్‌మెంట్లు వెలుస్తుండటం స్థానికంగా పెను దుమారం రేపుతోంది. విలేజ్ మ్యాప్ ప్రకారం అది స్పష్టంగా ప్రభుత్వ భూమి అని కనిపిస్తున్నా, నిర్మాణ పనులు మాత్రం నిరాటంకంగా కొనసాగుతుండటం గమనార్హం. ఈ భూ ఆక్రమణపై స్థానిక…

AP

అది ఆలయాల విధ్వంసం కాదు.. పునర్నిర్మాణం: ఫేక్ ప్రచారాలపై మంత్రి నారా లోకేశ్ ఫైర్!

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష వైసీపీ కావాలనే కులం, మతం మరియు ప్రాంతం పేరుతో ప్రజల మధ్య అలజడి రేపేందుకు ఫేక్ ముఠాలతో అసత్య ప్రచారాలు చేయిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ‘ఫ్యాక్ట్ చెక్’ నివేదికను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం…

TELANGANA

సిద్దిపేట జిల్లాలో కలకలం: అంతుచిక్కని వ్యాధితో 8,400 కోళ్లు మృతి.. రూ. 20 లక్షల నష్టంతో రైతు కన్నీరు!

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో ఒక కోళ్ల రైతుకు భారీ నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన రంగనబోయిన కుమార్ అనే రైతు తన ఫారంలో సుమారు నెల రోజుల వయసున్న కోళ్లను పెంచుతున్నారు. అయితే, గత రెండు రోజులుగా కోళ్లకు అంతుచిక్కని వ్యాధి సోకడంతో ఒక్కొక్కటిగా మృత్యువాత పడ్డాయి. సోమవారం ప్రారంభమైన ఈ మరణాల పరంపర మంగళవారం నాటికి తీవ్రమై, సుమారు 8,400 కోళ్లు చనిపోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. సరిగ్గా కోళ్లు చేతికొచ్చే…

AP

బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్ వార్తలపై పోలీసుల స్పష్టత

ఈ రోజు ఉదయం బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారని కొన్ని ఛానల్స్ లో వార్తలు రావడం జరిగింది. వాస్తవానికి అటువంటిది ఏమీ జరగలేదు. బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గారిని పోలీసులు ఎటువంటి హౌస్ అరెస్ట్ చేయలేదు. దేవాలయ కార్యనిర్వాహణ అధికారి (EO) గారు తేరు వద్దకు నాయకులు అందరూ ఒకే సమయంలో వస్తే ఇబ్బందులు ఉంటాయని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోమని సమాచారం ఇవ్వడంతో వారి సూచనల…

TELANGANA

తెలంగాణలో సారా దుకాణాలు మళ్లీ తెరవాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన డిమాండ్

తెలంగాణలో సారా (Sara) దుకాణాలను తిరిగి ప్రారంభించాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. సోమవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ‘బాంబు’ పేల్చబోతున్నానని ప్రకటించారు. గతంలో స్వచ్ఛమైన సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించేవారని, కానీ ప్రస్తుతం కల్తీ మద్యం తాగి 80 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన వింత వాదనను…

TELANGANA

ఐటీ కొలువులో తీవ్ర పని ఒత్తిడి: హైదరాబాద్‌లో కర్ణాటక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో పెరుగుతున్న పని ఒత్తిడిని తట్టుకోలేక 32 ఏళ్ల మనుశ్రీ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొండాపూర్‌లోని సుమధుర అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆమె, తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి వల్లే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మనుశ్రీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి. ఆదివారం…

AP

తాడిపత్రిలో ఘోరం: భార్యను హత్య చేసి కొండల్లో పడేసిన భర్త

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సుధాకర్ అనే వ్యక్తి తన భార్య శ్రీలేఖను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ముచ్చుకోట కొండల్లో పడేసి ఆచూకీ లభ్యం కాకుండా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ ఘోరానికి పాల్పడిన తర్వాత నిందితుడు సుధాకర్ నేరుగా పప్పూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడి వాంగ్మూలం మేరకు పోలీసులు ముచ్చుకోట కొండ ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం…