తిరుమలపైకి జగన్ అనకొండలను పంపిస్తున్నారు: టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తు
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న జగన్ మోహన్ రెడ్డి ఏడుకొండలపైకి ‘అనకొండలను’ పంపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ నేతలు ఇప్పుడు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాదాపు 11 నెలల క్రితం…

