బీఆర్ఎస్ను తుక్కుతుక్కు చేసినట్టే బీజేపీని చేయాలి..
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని తుక్కుతుక్కు చేసినట్లే దేశంలో బీజేపీని తుక్కుతుక్కుగా తొక్కాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణా నదులు కలిసి తుక్కుగూడలో సునామీ సృష్టిస్తే ఎలా ఉంటుందో అలా ఉందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జూన్ 9 ఢిల్లీలో మువ్వెనల జెండా ఎగరాలని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టం వల్ల తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.…

