ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేయలేదు: కేంద్రం.
భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఆర్థిక సంవత్సరం చివరి వరకు పొడిగించింది. దేశీయ లభ్యతను పెంచాలని, ధరలను అదుపులో ఉంచాలని కేంద్రం కోరుతున్నందున ఎగుమతి నిషేధం మార్చి 31, 2024 వరకు కొనసాగుతుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మంగళవారం (ఫిబ్రవరి 20) తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, మార్చి 31 తర్వాత కూడా నిషేధం ఎత్తివేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే రబీ (శీతాకాలం)లో ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉంటుందని…

