తిరుపతి లడ్డూ కేసు: సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందన్న జగన్ – చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ సీఎం!
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ వచ్చిన ఆరోపణల కేసులో తమ పార్టీ నేతలకు సీబీఐ సిట్ (SIT) క్లీన్ చిట్ ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన సీబీఐ నివేదికలో తమ నాయకుల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదని, దీనిని బట్టే తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శించిన సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు…

