News

AP

జూన్ 9 నుంచి వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటన..

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుతూ విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు.   22 రోజులపాటు పర్యటన వైఎస్ షర్మిల చేపట్టనున్న ఈ రాష్ట్రస్థాయి పర్యటన…

TELANGANA

జగిత్యాల కోర్టు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ..

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో నిన్న అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీ, పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారయ్యాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, కాపలా ఉన్న కానిస్టేబుల్ దృష్టి మరలిన క్షణంలో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు, పోలీసుల భద్రతా వైఫల్యంపై చర్చకు దారితీసింది.వివరాల్లోకి వెళితే, పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ అనే…

National

సీఆర్పీఎఫ్ జవాన్ గూఢచర్యం కలకలం.. ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..!

దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. మోతీరామ్ జాట్ అనే ఈ జవాను పహల్గామ్‌లో ఉగ్రదాడికి ఆరు రోజుల ముందు వరకూ అక్కడే విధులు నిర్వర్తించాడు.   అధికారల కథనం ప్రకారం.. మోతీ రామ్ జాట్ 2023 నుంచి పాకిస్థాన్ గూఢచార సంస్థలకు సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నాడు. అతడి…

TELANGANA

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు… తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసులను ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగంగానే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు వచ్చాయని అర్థమవుతోందని అన్నారు. తమ పార్టీ నాయకులను…

AP

ఏపీలో కరోనా వ్యాప్తి… కొత్తగా మరో మూడు కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మూడు కేసుల్లో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన ఒక వృద్ధుడు ఉన్నారు. వీరికి తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కరోనా సోకిన వృద్ధుడి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో, వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.…

AP

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్..?

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి (వర్కింగ్ ప్రెసిడెంట్) బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ పార్టీలోని మంత్రులు, సీనియర్ నేతల నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై మహానాడులో అధికారికంగా ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ లోకేశ్ తన సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు.   మహానాడులో పాల్గొనేందుకు కడపకు…

CINEMA

మహానాడుకు రమ్మంటూ అన్నగారి పిలుపు..

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమానికి తరలిరావాలంటూ అన్న ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికతతో టీడీపీ ఈ వీడియోను సృష్టించి ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఈ పోస్టులో ఏఐ ద్వారా నందమూరి తారకరామారావు మాట్లాడినట్లు వీడియో సృష్టించారు.   ‘ప్రియమైన నా…

AP

పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాలపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు..

రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.   “ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో…

National

కొత్త టోల్ పాలసీ తీసుకువస్తున్న కేంద్రం..

జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్‌లతో ఇబ్బందులు పడే వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఖర్చు తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.   తాజా ప్రతిపాదనలో భాగంగా, వాహనదారులు త్వరలో రూ.3 వేల వార్షిక రుసుము చెల్లించే అవకాశం రావచ్చు. తద్వారా వారు ఏడాది పొడవునా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేలపై…

TELANGANA

కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. ఢిల్లీలోనే రేవంత్‌రెడ్డి..

తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకొనేందుకు అందుబాటులో ఉండాలంటూ అధిష్ఠానం పెద్దల నుంచి రేవంత్‌రెడ్డికి సమాచారం అందింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ హైదరాబాద్ తిరిగి చేరుకోవాల్సి ఉండగా, అధిష్ఠానం సూచన మేరకు హస్తినలోనే ఉండిపోయారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్‌రెడ్డి నేడు భేటీ కానున్నారు.   గత రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్…