News

AP

మ‌రో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేదు: నాగబాబు..

ఏపీలో మ‌రో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేదని జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నాగ‌బాబు అన్నారు. విశాఖ‌ప‌ట్నం జిల్లా అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో నిన్న న‌గ‌రంలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో నాగబాబు మాట్లాడారు.   “కూట‌మి ఏర్పాటు, ఎన్నిక‌ల్లో విజ‌యానికి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, బీజేపీ నేత‌లు కృషి చేశారు. ప‌ద‌వుల విష‌యంలో కార్య‌క‌ర్త‌లు అసంతృప్తి చెందొద్దు. ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి లోక్‌స‌భ స్థానాన్ని ఆశించాను. సీట్ల పంప‌కాల్లో…

AP

సింగపూర్ పర్యటనలో 3వ రోజు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం..

సీఎం చంద్ర‌బాబు సింగపూర్ పర్యటనలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇవాళ‌ 3వ రోజు పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ రోజు చంద్ర‌బాబు ప‌దికి పైగా సమావేశాల్లో పాల్గొనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు.   క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా సంస్థల ప్రతినిధులతో చర్చలు జ‌రప‌నున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనుంది. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ…

National

పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ రచ్చ.. సహనం కోల్పోయిన అమిత్ షా..

లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ తీవ్ర రచ్చకు దారితీసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను విపక్షాలు పదేపదే అడ్డుకోవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహనం కోల్పోయారు. విపక్షాలు దేశ విదేశాంగ మంత్రిని నమ్మకుండా, విదేశీ వాదనలను నమ్ముతున్నాయని తీవ్రంగా విమర్శించారు.   పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ వాదనలను జైశంకర్ ఖండించారు. మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఆయన స్పష్టం…

TELANGANA

బీసీ బిల్లు సాధ‌న కోసం మూడు రోజుల‌ దీక్ష: ఎమ్మెల్సీ క‌విత‌..

బీసీ బిల్లు సాధ‌న కోసం 72 గంట‌లు దీక్ష చేయ‌నున్న‌ట్లు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత ప్ర‌క‌టించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవ‌స‌ర‌మో చాటి చెప్పేందుకు ఆగ‌స్టు 4, 5, 6 తేదీల్లో 72 గంట‌లు దీక్ష చేయ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. ఈ రోజు హైద‌రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో క‌విత మాట్లాడారు.   బీసీ బిల్లు సాధ‌న కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయ‌నున్న‌ట్టు చెప్పారు.…

National

ఉగ్రవాదుల మతం చూసి బాధపడొద్దు.. అఖిలేశ్ యాదవ్ కు అమిత్ షా కౌంటర్..

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు. ఇది అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయని, ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించడంతో పాటు వారు దేశం దాటకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చేపట్టిన చర్చలో హోంమంత్రి అమిత్ షా ఈ రోజు మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాదులను…

TELANGANA

ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ఉపాధ్యాయ లోకానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. దీనితో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. రానున్న రెండు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.   తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన పలువురు ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదోన్నతులు కల్పిస్తామని…

AP

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలం: చంద్రబాబు..

పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో అక్కడి భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.   సీబీఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు.. సింగపూర్ ప్రభుత్వంలో, పారిశ్రామిక వేత్తల్లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు…

TELANGANA

కేటీఆర్ గురించి సీఎం రమేశ్ చెప్పింది నిజమే: బండి సంజయ్..

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, సిరిసిల్ల టికెట్ రావడానికి సీఎం రమేశ్ కేటీఆర్‌కు ఆర్థికంగా సాయం చేశారని, దాని వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని బండి సంజయ్ అన్నారు. సీఎం రమేశ్ తో చర్చకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కరీంనగర్‌లో చర్చకు వేదిక తానే ఏర్పాటు చేస్తానని, మధ్యవర్తిత్వం…

AP

ఐదేళ్లలో ఎంత నష్టం జరిగిందో అంతకు వడ్డీతో కలిపి తీసుకువస్తాం: మంత్రి నారా లోకేశ్..

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు… రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో మీరంతా చూస్తున్నారు…. చంద్రబాబు గారి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి… మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడదామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేశ్ అతిథిగా విచ్చేశారు. ఈ…

AP

కర్మభూమిలో ఎదగండి… జన్మభూమి కోసం నిలవండి: సింగపూర్ లో తెలుగువారికి చంద్రబాబు పిలుపు..

విదేశాల్లో స్థిరపడి… సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మరిచిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా తొలి రోజున ఆదివారం స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో తెలుగు డయాస్పొరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా, థాయ్ ల్యాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు హాజరయ్యారు. సీఎం సభా ప్రాంగణానికి రాగానే సభకు హాజరైన…