News

AP

నేడు పల్నాడుకి జగన్..!

వైసీపీ వేసే అడుగులు.. చేసిన పనులు కూటమి జాగ్రత్తగా గమనిస్తోందా? ఈ మధ్యకాలంలో జగన్ టూర్ల వెనుక అసలు కారణమేంటి? ఏపీలో శాంతి భద్రతలు లేవని క్రియేట్ చేసే పనిలోపడ్డారా? అందుకోసమే పోలీసులు ఆంక్షలు పెట్టారా? అయినా పార్టీ నేత చనిపోయిన ఏడాది తర్వాత ఓదార్పు దేనికి? ఇవే ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను సైతం వెంటాడుతున్నాయి.   కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను నెగిటివ్‌గా మార్చి తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ…

AP

అగ్రీగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ .. బాధితుల సొమ్ము చెల్లించేందుకు చర్యలు..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అందింది. అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.1000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ అప్లికేషన్‌కు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఆమోదం తెలిపింది. గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది అగ్రిగోల్డ్ యాజమాన్యం మూలంగా మోసపోయినట్లు ఈడీ గుర్తించింది. బాధితులను ఆదుకునేందుకు ఈడీ కీలక ముందడుగు వేసింది.   తాజాగా అగ్రిగోల్డ్…

AP

ఈ నెల 23 నుంచి ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్ర: సీఎం చంద్రబాబు..

కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఇంటింటికీ విజయయాత్ర నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా… ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో…

National

హనీమూన్ హత్యకేసులో మరో ట్విస్ట్..!

ఇండోర్‌ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా భార్య సోనమ్ రఘువంశీ బతికే ఉండేందుకు, ఆమె స్థానంలో మరో అపరిచిత మహిళను హత్య చేసి, ఆ మృతదేహాన్ని సోనమ్‌దిగా నమ్మించి, నిజం బయటపడే వరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని హంతకులు పథకం పన్నినట్టు మేఘాలయ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ దారుణమైన కుట్రకు సోనమ్ ప్రియుడిగా చెబుతున్న రాజ్ కుష్వాహా…

TELANGANA

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితం..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త తెలిపారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం గురించి వివరిస్తూ ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. “ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు విడతల వారీగా రూ. 5 లక్షలు అందజేస్తున్నాం” అని మంత్రి…

TELANGANA

పంచాయతీ ఎన్నికలు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ దిశగా కసరత్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సీతక్క చేసిన ప్రకటన ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. జూలై నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.   శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, “రాబోయే జూలై నెలలో సర్పంచ్…

TELANGANA

చార్మినార్, ఫలక్‌నుమా వద్ద మెట్రో పనులకు హై కోర్టు బ్రేక్..!

హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు వారసత్వ కట్టడాల వద్ద అవరోధం ఎదురైంది. చారిత్రక చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలో ఎలాంటి మెట్రో నిర్మాణ పనులు చేపట్టరాదని తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.   హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా కారిడార్-6 పనులను వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంబంధించి ఎలాంటి అధ్యయనం…

National

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: డీఎన్ఏ టెస్టులు చేశాకే మృతులను ప్రకటిస్తామన్న అమిత్ షా..

అహ్మదాబాద్‌లో గురువారం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆయన అహ్మదాబాద్‌కు చేరుకుని, ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులలో పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విచారాన్ని నింపిందని తెలిపారు.   క్షతగాత్రులను పరామర్శించిన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, “ఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది” అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.…

National

విమాన ప్రమాదం: దర్యాప్తు కోసం భారత్ వస్తున్న బ్రిటన్ సంస్థ..

అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నట్లు సమాచారం.   ఈ భారీ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు భారత్ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో పాలుపంచుకునేందుకు బ్రిటన్‌కు చెందిన ‘ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్’ (ఏఏఐబీ) బృందం…

National

విమాన ప్రమాదంలో 241 మంది మృతి.. ఒకరు మాత్ర‌మే బ‌తికారు: ఎయిరిండియా ప్ర‌క‌ట‌న‌..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిన్న ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన AI171 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ధ్రువీకరించింది. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.…