News

CINEMA

బాక్సాఫీస్ వద్ద ‘ధురంధ‌ర్ 2’ వసూళ్ల సునామీ: రికార్డులను తిరగరాస్తున్న రణ్‌వీర్

భారీ అంచనాలతో విడుదలైన ‘ధురంధ‌ర్ 2: ది రివెంజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండో రోజు కూడా తన జోరును కొనసాగించి, దేశవ్యాప్తంగా రూ. 80.72 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ. 226.27 కోట్లకు చేరాయి. మొదటి రోజుతో పోలిస్తే వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, శుక్రవారం కూడా భారీ…

TELANGANA

గ్యాస్ కష్టాలకు చెక్: కొండారెడ్డిపల్లి ‘సౌర’ విప్లవం.. సీఎం రేవంత్ సొంతూరి స్మార్ట్ స్టోరీ

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత మరియు డెలివరీలో జాప్యం నెలకొన్నా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామస్తులు మాత్రం నిశ్చింతగా ఉన్నారు. ఈ గ్రామంలో గ్యాస్ వినియోగం కంటే ఇండక్షన్ స్టవ్‌ల వాడకమే ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. రెండేళ్ల క్రితం టీజీరెడ్కో ఆధ్వర్యంలో ఇక్కడ పీఎం సూర్యఘర్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేశారు. గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటిపైనా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడంతో గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోయింది.…

TELANGANA

ఉద్యోగాల పేరుతో మోసం: బెజ్జూర్ మహిళల అక్రమ రవాణా కేసు గుట్టురట్టు

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన మహిళల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాధితులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించి సురక్షితంగా తీసుకువచ్చారు. మంచిర్యాల ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు యువతులకు ఉద్యోగాల పేరుతో ఎర వేసిన నిందితులు, వారిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయించినట్లు సిఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. బాధితులను వారి కుటుంబ సభ్యులకు…

AP

విశాఖ వాసులకు గుడ్ న్యూస్: ఆనందపురం జంక్షన్‌లో భారీ ఫ్లైఓవర్, ట్రాఫిక్ కష్టాలకు చెక్!

విశాఖపట్నం నగరాన్ని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే క్రమంలో అత్యంత కీలకమైన ఆనందపురం జంక్షన్‌ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మరో మూడు నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, విశాఖ మరియు అనకాపల్లి వైపు నుండి వచ్చే వాహనాల రద్దీని తట్టుకునేలా ఇక్కడ ఒక భారీ ఫ్లైఓవర్ (Flyover) నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించాయి. ఏడాదిన్నర నుండి రెండేళ్లలో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు…

World

వారసురాలికి యుద్ధ తంత్రాల్లో శిక్షణ: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్ జోంగ్ ఉన్ షికారు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన వింత చర్యలతో అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు యేతో కలిసి ఆయన ఒక ఆర్మీ ట్రైనింగ్ యూనిట్‌ను సందర్శించారు. వీరిద్దరూ నలుపు రంగు లెదర్ జాకెట్లు ధరించి, యుద్ధ ట్యాంక్ హ్యాచ్ నుంచి బయటకు వచ్చి నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం సందర్శనకే పరిమితం కాకుండా, ట్యాంకర్ లోపల కూర్చుని…

CINEMA

‘ధురంధర్-2’పై నటి రమ్య ఘాటు విమర్శలు: థియేటర్లో సమయం, డబ్బు వృథా అంటూ వ్యాఖ్య

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్-2’ చిత్రంపై నటి రమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనను తీవ్రంగా నిరాశపరిచిందని, చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రాన్ని చూసిన అనంతరం ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇది ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ఉందని, థియేటర్లలో సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని అభిమానులకు సూచించారు. ఈ సినిమా ఓటీటీలో చూడటానికే సరిపోతుందని…

CINEMA

యాక్షన్ లెజెండ్ చక్ నోరిస్ కన్నుమూత: మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో ఒక శకం ముగింపు

ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ హీరో, మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం చక్ నోరిస్ (86) శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన ప్రశాంతంగా కన్నుమూసినట్లు సన్నిహితులు వెల్లడించారు. తన అద్భుతమైన పోరాట నైపుణ్యంతో తరతరాల ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం అంతర్జాతీయ సినీ రంగానికి తీరని లోటు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఒక లెజెండ్‌గా ఆయన పేరు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వెండితెరపై అసాధ్యమైన…

AP

ఐస్ క్రీమ్ ఆటోలకు మరియు ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు.

  పిల్లల ఆరోగ్యం కోసం ఓ గ్రామం వినూత్న ప్రయత్నం గూడూరు గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు అని బ్యానర్లు ఏర్పాటు. నిషేధాన్ని ఉల్లంఘించి ఐస్ క్రీం బండి ఊర్లోకి వస్తే రూ.5,000 జరిమానా. ఇప్పుడు ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

AP

రాష్ట్రస్థాయి ఉగాది వేడుకల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులను ఘనంగా సత్కరించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం పంచాంగ శ్రవణంలో శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అర్చకం వెంకట నరసింహ వసంతచార్యుల వారిని సత్కరించిన ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.

AP

రాయలసీమ బీడు భూముల్లో సోలార్ వెలుగులు: కరువు నేలపై కురుస్తున్న కాసుల వర్షం.. అన్నదాతలకు అండగా కొత్త ప్రాజెక్టులు

సీమలో సోలార్ కాంతులు. ………………………………. *రానున్న కొత్త ప్రాజెక్టులు.. మట్టి మనిషికి మంచి రోజులు. *బీడు పడ్డ రైతు పొలాల్లో విద్యుత్ వెలుగులు. *అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు. ………………………………… ఒకప్పుడు రత్నాలను రాశులుగా పోసి మురిసి పోయిన రాయలసీమను కరువు రక్కసి కౌగిలించుకుంది. ప్రతీ ఏటా పచ్చి, వట్టి కరువు కన్నీరు మిగిల్చింది.రైతు కళ్లెదుటే పొలాలు బీళ్లు గా మారాయి. కన్న బిడ్డల్లా పెంచుకున్న మూగజీవాలు మేత లేక విలవిల లాడుతున్నాయి.ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఉన్న…