జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు..!
దేశ ద్రోహి,పాక్ గూఢచారి, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ టూర్ కు సంబంధించిన వివరాలను పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పాకిస్థాన్ జర్నీ ఆహ్లాదకరంగా సాగిందని.. అక్కడ ఆతిథ్యం బాగుందని రాసుకొచ్చింది. ఈ మేరకు జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ ను పొగుడుతూ రాసుకున్నట్లు పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకుని పరిశీలించారు.…

