News

AP

నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు… అంతా బ్లడ్ బుక్కే!: రఘురామ..

అమెరికాలో నిర్వహించిన తానా 24వ ద్వైవార్షిక మహాసభల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు గనుక మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు? అని కార్యక్రమ యాంకర్ మూర్తి ప్రశ్నించారు. అందుకు రఘురామ బదులిస్తూ, రోజులో 8 గంటలు తనను మంత్రిగా చేస్తే 6 గంటలు హోంమంత్రిగా, మిగతా 2 గంటలు వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేస్తానని అన్నారు.…

TELANGANA

తెలంగాణలో యూరియా కొరతపై విచారణ జరపాలి: కేటీఆర్..

తెలంగాణలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.   ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందించారు. “సబ్సిడీపై రూ.266.50కి లభించాల్సిన యూరియా బస్తా ధర, ఇప్పుడు రూ.325కి ఎందుకు పెరిగింది? దీనికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలి” అని…

National

డెంగ్యూపై పోరులో కీలక ముందడుగు.. త్వరలో అందుబాటులోకి టీకా..!

దేశంలో ఏటా వర్షాకాలంలో లక్షలాది మందిని వణికిస్తున్న డెంగ్యూ మహమ్మారికి అడ్డుకట్ట వేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రయోగాలు విజయవంతమైతే, ఏడాదిలోగా ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రఖ్యాత ఫార్మా సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ‘టెట్రావ్యాక్స్-డీవీ’ పేరుతో రూపొందించిన ఈ టీకా…

AP

అమరావతికి మరో 20 వేల ఎకరాలు… సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్..

రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాజధాని పరిధిలో అదనంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో జరిగిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశంలో మొత్తం 7 ప్రధాన అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా అమరావతి,…

TELANGANA

ఆసక్తికరం.. తెలంగాణలో ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు.. ఎందుకంటే..?

తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. వేములవాడ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన చెన్నమనేని రమేష్ తన ఓటు హక్కును కోల్పోయారు. ఆయన భారత పౌరుడు కాదని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు ఆయన పేరును వేములవాడ ఓటరు జాబితా నుంచి తొలగించారు.   ఈ మేరకు ఎన్నికల అధికారులు చెన్నమనేని రమేష్ నివాసానికి నోటీసులు అంటించారు. ఆయన పౌరసత్వం చెల్లదని, అందువల్ల ఓటరుగా కొనసాగే అర్హత లేదని…

TELANGANA

సీతక్కకు బెదిరింపు లేఖ.. మావోయిస్టుల కొత్త ట్విస్ట్..!

రాష్ట్ర మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ కొన్ని రోజుల క్రితం విడుదలైన మావోయిస్టుల లేఖ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. అయితే, ఈ వ్యవహారంలో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ లేఖను తాము విడుదల చేయలేదని మావోయిస్టు పార్టీయే స్వయంగా ప్రకటించింది.   వారం క్రితం మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. ఇది మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారమైంది. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లోనూ ఆందోళన…

National

హిమాచల్ ప్రదేశ్ లో ‘క్లౌడ్ బరస్ట్’… 69కి పెరిగిన మృతుల సంఖ్య..

దేవభూమిగా పేరొందిన హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా జూన్ 20 నుంచి జూలై 3 మధ్యకాలంలో సుమారు 69 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.   వరదల తీవ్రతకు మండీ జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఇక్కడ…

TELANGANA

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..!

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా, కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది.రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి ఆరేళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా…

AP

ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్ డిమాండ్..

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, సాధారణ పౌరులకు రక్షణ కరువైందని, ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.   “ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్త‌మోడుతోంది. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతూ…

Uncategorized

వాటిలో ఒక్కటి తగ్గినా కాళ్ళు మొక్కి పదవి నుండి తప్పుకుంటాను..-: సీఎం రేవంత్ రెడ్డి..

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఈ గణాంకాలపై చర్చకు ఎవరైనా రావొచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎవరైనా చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాల సంఖ్యలో ఒక్కటి తగ్గినా తాను కాళ్ళు మొక్కి పదవి నుండి తప్పుకుంటానని అన్నారు.   హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన…