News

AP

టీడీపీకి చెందిన 7 కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు..

కాలం మారుతున్నా కొందరి మనస్తత్వాలు మాత్రం మారడం లేదు. పాత పోకడలను కొనసాగిస్తూ పంతాలకు పోతున్నారు. కక్షలతో సాటి మనుషుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏడు కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేశారు. గ్రామ బహిష్కరణ విధించారు. గ్రామస్తులెవరూ వారికి సహకరించకూడదని, శుభకార్యాలకు, పనులకు పిలవకూడదని ఆదేశించారు. గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాలన్నీ టీడీపీకి చెందినవే కావడం గమనార్హం.   వివరాల్లోకి వెళ్తే……

AP

తల్లికి వందనం, రైతు భరోసా అమలు ముహూర్తం ఫిక్స్..!

ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు పైన స్పష్టత ఇచ్చారు. అమరావతిలో నిర్మాణ పనులతో సహా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. అదే విధంగా మున్సిపల్ తో సహా పలు చట్ట సవరణలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 8న విశాఖ లో జరిగే ప్రధాని పర్యటన పైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. డీఎస్సీ నియామక ప్రక్రియ పైన చర్చ జరిగింది.…

TELANGANA

సీఎంఆర్ కాలేజీ బాత్రూం వీడియోల ఘటన… విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్..

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కండ్లకోయ సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్లో బాత్రూంలోని దృశ్యాలను చిత్రీకరించిన అంశంపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని మహిళా కమిషన్ ఆదేశించింది.   కాగా, సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్‌లో బాత్రూంల పక్కనే వంట గది ఉంది. బాత్రూం దృశ్యాలను వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు ఆరోపిస్తూ విద్యార్థినులు నిన్న మధ్యాహ్నం…

TELANGANA

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రైతు భరోసా దరఖాస్తుకు సిద్దం కండి..

తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురుచూస్తున్న ఆ పథకంపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. కొత్త ఏడాదిలో వరుస శుభవార్తలు చెప్పేందుకు సీఎం రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.   2025 జనవరి నెలలో ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను…

AP

మచిలీపట్నం పీఎస్ లో విచారణకు హాజరైన పేర్ని జయసుధ..

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని అర్ధాంగి పేర్ని జయసుధ నేడు మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు.   ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నారు.   ఈ…

AP

అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఏపీలోనే..!: సీఎం చంద్రబాబు..

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా రంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ రంగానికి హైదరాబాద్ నగరం హబ్ గా మారిందని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.   కొంతకాలంగా సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఇక ఏపీలోనే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో సినిమాలకు…

TELANGANA

తెలంగాణ ఇంటర్మీడియట్ సిలబస్ లో కోత..?

ఇంటర్ సిలబస్‌ను తెలంగాణ ప్రభుత్వం తగ్గిస్తుందా? విద్యార్థులపై ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటుందా? పాఠాలు తగ్గించి, క్వాలిటీ పెంచాలని భావిస్తుందా? నిపుణుల కమిటీ ఏం చెప్పింది? అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందా? అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.   రెండేళ్ల కిందట ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేసింది సీబీఎస్ఈ. కొన్ని పాఠాలను తొలగించింది.. ట్రెండ్‌కు అనుగుణంగా కొన్ని సబ్జెక్టులను ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు.…

TELANGANA

ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే.?

తెలంగాణకు పెట్టుబడులకు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందులో భాగంగా విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనవరి 14న నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఫారెన్ టూర్‌కి బయలు దేరనున్నారు.   జనవరి 15న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. క్వీన్స్‌లాండ్‌ క్రీడా విశ్వవిద్యాలయాన్ని పరిశీలించనున్నారు. అక్కడ 3-4 రోజుల పాటు పర్యటించనుంది. అక్కడి రేవంత్‌ బృందం జనవరి 19న సింగపూర్‌కు వెళ్లనుంది. తెలంగాణ నుంచి ఆటగాళ్లు ఒలింపిక్స్‌‌కు వెళ్లేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు…

National

తొలి రోజే దేశవ్యాప్తంగా రైతన్నలపై కేంద్రం వరాల జల్లు..

నూతన ఏడాది ప్రారంభమైన తొలి రోజే దేశవ్యాప్తంగా రైతన్నలపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి, కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతన్నలకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.   కొత్త సంవత్సరంలో కేంద్ర కేబినెట్ సమావేశాన్ని జనవరి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ, హాజరు కాగా రైతన్నలకు సంబంధించిన పలు పథకాలపై సుదీర్ఘ…

TELANGANA

న్యూ ఇయర్‌ అలర్ట్‌.. 4 గంటల నుంచే డ్రంకెన్‌ డ్రైవ్‌.. 10,000 ఫైన్, ఆరు నెలలు జైలు శిక్ష

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు నగర వాసులు రెడీ అయ్యారు. యువతను ఆకట్టుకునేందుకు పబ్‌లు, ఈవేంట్‌ ఆర్గనైజర్లు.. వివిధ ఆఫర్లతో తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో నాలుగు పబ్బులకు అనుమతి నిరాకరించారు. హాట్‌ కప్‌, అమ్నేషియా, బ్రాండ్‌ వే, బేబీ లాండ్‌ పబ్బుల్లో నూతన సంవత్సర…