News

AP

తిరుమల ఇక నో ఫ్లయింగ్ జోన్..? కేంద్రానికి లేఖ రాసిన టీటీడీ చైర్మన్..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా పలు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు ఇప్పటికే పలు తీర్మానాలు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సమస్యకు సంబంధించి జోక్యం చేసుకోవాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.   తాజాగా తిరుమల కొండపై నుంచి వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఎప్పటి నుంచో ఇలాగే…

AP

పోసాని గుండెనొప్పి ఫేక్- తేల్చేసిన పోలీసులు-మళ్లీ జైలుకు..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు అయి రాజంపేట జైల్లో ఉన్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి అస్వస్ధతకు గురికావడం అబద్దమని తేలిపోయింది. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గుండెనొప్పి వచ్చినట్లు జరిగిన ప్రచారం అంతా ఫేక్ అని పోలీసులు తేల్చేసారు. ఈ మేరకు రాజంపేట పోలీసులు ఓ ప్రకటన చేశారు.   ఇవాళ రాజంపేట జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి గుండె…

TELANGANA

కొచ్చి తరహాలో మామునూరు విమానాశ్రయం..

వరంగల్ మామునూరు విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఎక అసెట్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు.   విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వరంగల్ మామునూరు…

TELANGANA

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో 8 మంది ఆనవాళ్ల గుర్తింపు, దారుణంగా లోపలి పరిస్థితులు..

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది సిబ్బందిని బయటికి తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు వివరాలను మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉందని తెలిపారు.   టన్నెల్ వద్ద సహాయక చ్యలను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టన్నెల్‌లో మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు కనిపించిన ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. 5-8 మీటర్ల…

AP

అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని నేడు కలిశారు..

అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని నేడు కలిశారు. అంబుల వైష్ణవి గతేడాది జూన్‌లో రాజధానికి రూ.25 లక్షలు, 2019కి ముందు పలుసార్లు కలిపి రూ.25 లక్షలను విరాళంగా అందించారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం ను వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు.

CINEMA

రాజమౌళికి తాంత్రిక విద్యలు కూడా తెలుసు… పోటీగా ఉన్న డైరెక్టర్లను తొక్కేశాడు: శ్రీనివాసరావు..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన టార్టర్ భరించలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వీడియో, లేఖను విడుదల చేశారు. ‘యమదొంగ’ సినిమాకు శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.   రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందని శ్రీనివాసరావు చెప్పారు. ఒక అమ్మాయితో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలిపారు. ఆమెను ముందు రాజమౌళి ప్రేమించాడని, ఆ తర్వాత తాను ప్రేమించానని చెప్పారు.…

TELANGANA

హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన పీసీసీ చీఫ్.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు. రైలులో కాచిగూడకు చేరుకున్న ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శాలువా కప్పి స్వాగతం పలికారు.   నేడు గాంధీ భవన్‌లో జరగనున్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షితోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్ట విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అలాగే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

AP

ఏపీ బడ్జెట్.. ఆ శాఖకు భారీ కేటాయింపులు..

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. మొత్తం రూ. 3.22 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత పాలకులు ప్రతి శాఖలో ఆర్థిక అరాచకం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుంది.   అప్పు తీసుకునే శక్తి లేని ఏకైరా రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్నారు ఆర్థిక…

NationalUncategorized

రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయండి.. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు..!

తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శించండని సూచించారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామ కృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపీలతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.   రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల…

AP

న్యాయమూర్తి ముందు పోసాని ఆవేదన..

న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి… పోసాని కృష్ణమురళికి 14రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. రాజంపేట సబ్‌జైలుకు తరలించారు పోలీసులు. అయితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిని 9 గంటల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నిన్నరాత్రి 9 గంటల 30 నిమిషాలకు రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు ఏడు…