ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: 28 మంది సరెండర్, రూ. 89 లక్షల రివార్డు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రేంజ్లో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పున మర్గం’ (పునరావాసం నుంచి పునరుజ్జీవనం) అనే కార్యక్రమంలో భాగంగా, మంగళవారం నారాయణ్పూర్ జిల్లాలో 28 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వీరిలో 19 మంది మహిళలు ఉండగా, అందరిపైనా కలిపి మొత్తం రూ. 89 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు వీరు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. లొంగిపోయిన…

