News

AP

నేడు మెగా డీఎస్సీ ఎంపిక జాబితా విడుద‌ల‌..

మెగా డీఎస్సీ-2025 అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజుతో తెరపడనుంది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ నేడు విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది అభ్యర్థుల పేర్లతో కూడిన ఈ జాబితాలను జిల్లాల కలెక్టర్, డీఈఓ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. దీంతో పాటు అధికారిక వెబ్‌సైట్ cse.apcfss.in లో కూడా అందుబాటులో ఉంచుతామని డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి నిన్న‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.   మొత్తం 16,347 పోస్టుల…

National

నా బుర్రలో రూ.200 కోట్ల విలువైన ఆలోచనలున్నాయి..ఈ20 ఇంధనంపై వివరణ: గడ్కరీ..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తన ఆర్థిక స్థితిగతులపై వస్తున్న విమర్శలకు ఆయన గట్టిగా బదులిచ్చారు. “నాకు డబ్బుకు కొదవలేదు. నా మెదడులో రూ.200 కోట్ల విలువైన ఆలోచనలు ఉన్నాయి. నేను మోసం చేయకుండానే సంపాదిస్తున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.   నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ, తనకు నెలకు రూ.200 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. “ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం…

National

ఓటరు నమోదు ప్రక్రియలో మార్పు..!

ఓటరు జాబితా సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చేపట్టే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా, ఓటరు గుర్తింపు కోసం సమర్పించే ధ్రువపత్రాల జాబితాలో ఆధార్ కార్డును కూడా చేర్చాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (సీఈవోలకు) స్పష్టమైన సూచనలు జారీ చేసింది.   ఓటరు జాబితా వెరిఫికేషన్ కోసం ప్రస్తుతం పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 11 రకాల డాక్యుమెంట్లను…

TELANGANA

తెలంగాణ కేసీఆర్ వల్లే రాలేదు.. ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత కేవలం కేసీఆర్‌కు మాత్రమే దక్కదని, రాష్ట్రం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ఆయనది ఒక పాత్ర మాత్రమేనని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం వచ్చిందనే వాదనను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.   కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర భయాందోళనల మధ్య బతికారని,…

AP

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ ఆరోపణ… సీఎం చంద్రబాబు క్లారిటీ..

ఏపీలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తాము మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలోనే ముందుకు వెళుతున్నామని, దీనివల్ల ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వానివే ఉంటాయని, వైద్య విద్యార్థులకు గానీ, రోగులకు గానీ ఎలాంటి ఇబ్బంది రానివ్వబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరు బెదిరించినా భయపడే పరిస్థితి…

TELANGANA

గోదావరి పుష్కరాలు-2027.. ఇప్పటినుంచే తెలంగాణ ప్రభుత్వం ఫోకస్..

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటినుంచే కార్యాచరణను ప్రారంభించింది. ఈ పుష్కరాలను ‘దక్షిణ కుంభమేళా’గా పరిగణించి, భారీ ఏర్పాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కోరాలని నిర్ణయించింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.   పుష్కరాలు ప్రారంభం కావడానికి ఇంకా 22 నెలల సమయం ఉన్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీర్ఘకాలిక…

AP

ఆయేషా మీరా తల్లిదండ్రులకు విజయవాడ సీబీఐ కోర్టు నోటీసులు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ సీబీఐ కోర్టు పంపిన నోటీసులను స్వీకరించేందుకు ఆయేషా తల్లిదండ్రులు నిరాకరించారు. న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న తమను పదేపదే కోర్టుల చుట్టూ తిప్పడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.   వివరాల్లోకి వెళితే, కేసులో నిందితుడిగా ఉన్న పిడతల సత్యంబాబుపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం),…

National

యూపీఐ పేమెంట్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు.. ఎవరికంటే..?

దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులకు చేసే (పర్సన్-టు-మర్చంట్) యూపీఐ చెల్లింపుల గరిష్ఠ పరిమితిని పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం, నిర్దిష్ట కేటగిరీలలోని ధృవీకరించిన వ్యాపారులకు వినియోగదారులు ఒకే రోజులో గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు చెల్లింపులు జరపవచ్చు.   అయితే, వ్యక్తుల మధ్య (పర్సన్-టు-పర్సన్) జరిగే నగదు బదిలీల…

TELANGANA

మేడారం పర్యటనకు సీఎం రేవంత్‌ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ నెల 13, 14 తేదీల్లో ములుగు జిల్లాలోని మేడారాన్ని సందర్శించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లను వేగవంతం చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ స్వయంగా మేడారాన్ని సందర్శించి, జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు.   గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన   సీఎం పర్యటనలో భాగంగా, మేడారం గద్దెల ఆధునీకరణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి రెండు…

TELANGANA

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిని.. పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో.. రైల్వే ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారులు పాల్గొన్నారు.   కీలక అధికారుల హాజరు   ఈ సమీక్ష సమావేశానికి ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్‌పోర్ట్ అండ్ బిల్డింగ్స్ స్పెషల్ సెక్రటరీ…