News

National

జీఎస్టీలో భారీ సంస్కరణలు..! సామాన్యుడికి భారీ ఊరట..!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘డబుల్ దీపావళి’ హామీ కార్యరూపం దాల్చనుంది. దేశ పరోక్ష పన్నుల విధానంలో సంచలన మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న పలు జీఎస్టీ శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులను కొనసాగించాలనే కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇది అమల్లోకి వస్తే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వాడే అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.   కొత్త విధానం…

TELANGANA

విమర్శించడం లేదంటూనే రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇటీవల తరచూ విరుచుకుపడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సొంతపార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో గత రాత్రి నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ ‘పదవులూ మీకే.. పైసలూ మీకేనా?’ అని నిలదీశారు. వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లు రావడం లేదని కాంట్రాక్టర్ పని చేయడం లేదని, ముఖ్యమంత్రి ఇస్తేనే ఆ బిల్లు వస్తుందని అన్నారు. కాబట్టే సీఎంను ప్రశ్నిస్తున్నానని,…

TELANGANA

తెలంగాణలో వాహనదారులకు షాక్..!

తమకు ఇష్టమైన వాహనం కొనుగోలు చేసిన తర్వాత, దానికో ఫ్యాన్సీ నంబర్ కోసం వేలంలో పోటీ పడేవారికి తెలంగాణ రవాణా శాఖ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ప్రాథమిక ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో రవాణా శాఖకు ఏటా రూ. 100 కోట్లకు పైగా వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రవాణా శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు…

TELANGANA

కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు..! బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ..!

కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సిఎం రేవంత్ రెడ్డి.. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఒక్క కార్పొరేషన్ పై దృష్టి పెట్టడం అరుదు. అయితే అక్కడ కాంగ్రెస్ ఎగురవేయాలని.. పట్టుదలతో ఉన్నారు. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో బిజెపితో పాటు బీఆర్ఎస్ గట్టిగా ఉంది. గత రెండు సార్లు మేయర్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండటంతో.. మేయర్ సీటు సాధించాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారంట. అయితే అక్కడ బలమైన నేత…

AP

ఏపీలో మొదలైన మహిళల ఫ్రీ బస్..!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మొదలయ్యాక, RTC బస్సులు ఇప్పుడు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, సమాచారం పంచే మాధ్యమాలుగా కూడా మారిపోయాయి. కండక్టర్ చేతిలో మైక్ పట్టుకుని, మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఆధార్ చూపించి సద్వినియోగం చేసుకోండని బస్సు మొత్తం మార్మోగేలా చెబితే, ప్రయాణికుల ముఖాల్లో ఒక ఆసక్తి, ఒక సంతోషం కనబడుతోంది. గ్రామీణ రూట్లలో అయితే ఈ సన్నివేశం మరింత అందంగా, మరింత దగ్గరగా అనిపిస్తోంది.   ఏపీ…

AP

వైనాట్ పులివెందుల అంటూన్న టీడీపీ నేతలు..! జగన్ కు కౌంటర్ ..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ నష్టపోయిందేంటి? పోనీ ఆ గెలుపుతో టీడీపీ సాధించిందేంటి? లాభ నష్టాల సంగతి బేరీజు వేసే కంటే, ఇగో శాటిస్ఫాక్షన్ కి ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అవును, వైనాట్ కుప్పం అంటూ గతంలో జగన్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తే, ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ దెబ్బకొట్టిమరీ చూపించారు టీడీపీ నేతలు.   అలా మొదలైంది.. వాస్తవానికి పులివెందులలో గెలవాలని టీడీపీకి, కుప్పం ఏరియాలో గెలవాలని…

TELANGANA

సెమీకండక్టర్ ప్రాజెక్టుపై తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది: శ్రీధర్ బాబు..

సెమీకండక్టర్ ప్రాజెక్టు కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు అవమానకరంగా ఉన్నాయని చెప్పారు.   కేంద్రం విధానాలను తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులకు ఇలాంటి నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పారు. సెమీకండక్టర్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రైమ్ లొకేషన్…

AP

కొత్త జిల్లాల ఏర్పాటుపై వినతులు స్వీకరిస్తాం: మంత్రి అనగాని..

గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను అస్తవ్యస్తంగా చేపట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. తొందరపాటు చర్యలు, ఒత్తిళ్లతో జిల్లాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా జిల్లాల ఏర్పాటు జరగలేదని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటులో సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.   మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సమావేశాలు…

AP

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేసి మళ్లీ జరపాలి: జగన్ డిమాండ్..

పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక…

National

జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం.

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల విచారణపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జడ్జెస్ (ఇంక్వైరీ) ఆక్ట్- 1968 కింద ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులుగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరవింద్…