రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం: మంత్రి నాదెండ్ల.
రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులలో తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్డుదారులు తమ పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గడువులోగా ఈ సవరణలన్నీ ఉచితంగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.…

