అమరావతిలో కాస్మోస్ ప్లానెటోరియం… నిర్మల, చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ‘కాస్మోస్ ప్లానెటోరియం’ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రిచంద్రబాబు సమక్షంలో శుక్రవారం ఏపీ సీఆర్డీఏ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరిగింది. ఈ ఒప్పందంతో రాజధాని నగరంలో విజ్ఞాన, వినోద రంగాలకు సంబంధించిన ఓ అద్భుతమైన నిర్మాణం రూపుదిద్దుకోనుంది. ఈ…

