AP

AP

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పై సుప్రీంలో తాజా అప్డేట్..!!..

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో 53 రోజులు రిమాండ్ ఎదుర్కొన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీని పైన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు.   సుప్రీంలో విచారణ చంద్రబాబుకు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో హైకోర్టు బెయిల్‌…

AP

వైసీపీ ఐదో జాబితా విడుదలకు కసరత్తు..

ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఐదో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్ని పిలిపించి చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు.   ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నాలుగు జాబితాల్లో…

AP

ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు కేసులో సుప్రీంలో కీలక పరిణామం..!!

ఏపీలో ఎన్నికల వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసులో సుప్రీంలో విచారణకు కేసు లిస్టు అయింది. తెలంగాణ హైకోర్టు మే 31న ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటీషన్ ఫిబ్రవరి 5న విచారణకు రానుంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు…

AP

జనసేనకు మరో ఎంపీ అభ్యర్ధి…

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే ఓవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలో చేరికలు పెరుగుతుండగా.. ఇవాళ ఓ కీలక నేత ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన.. జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.   టీడీపీతో పొత్తులో భాగంగా దాదాపు 40…

AP

ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కరణ..

విజయవాడలో అంబేద్కర్ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు తన సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న, అంబేద్కర్ గారి మహా శిల్పం మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అని కితాబిచ్చారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు. ఇది సామాజిక న్యాయ మహా శిల్పం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.   ఈ నెల 19న, చారిత్రక, స్వరాజ్య మైదానంలో…

AP

ఏపీలో ఎన్నికల ఎఫెక్ట్.. 21 మంది అధికారుల బదిలీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగి ఏర్పాట్లు ప్రారంభించింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జోన్-4 పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది అధికారులను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ మేరకు సంబంధిత కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. కర్నూలు జిల్లా.. పత్తికొండ తహసీల్దార్‌గా పద్మజ, కోసగికి పీ మురళి, కౌతాళంకు అలెగ్జాండర్, అనంతపురం…

AP

చంద్రబాబు కేసుల్లో వాట్ నెక్స్ట్ – నేడే కీలకం, ఉత్కంఠ..!!.

ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటోంది. చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన సుప్రీం తీర్పు వెలువరించింది. 17ఏ పైన మాత్రం ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. అరెస్ట్, రిమాండ్ విషయంలో చంద్రబాబు వాదనతో ఏకీభవించలేదు. ఈ రోజు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్‌నెట్‌ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.   ఫైబర్ కేసులో తీర్పు: చంద్రబాబు స్కిల్…

AP

ఎంపీ బెల్లాన దారెటు..?

అభ్యర్ధుల మార్పులు చేర్పులతో ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. నాలుగో జాబితా మీద ఇంకా తర్జన భర్జనలు పడుతోంది. అన్ని లెక్కలను, సర్వేలనూ ముందేసుకొని ఎవర్ని ఉంచాలో? ఎవర్నీ పక్కనపెట్టాలో? అన్నదానిపై కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించి సదరు సిట్టింగుల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఫోర్త్ లిస్ట్‌కు సంబంధించి విజయనగరం జిల్లా నుండి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు బెల్లానకి అధిష్టానం ఏమని సంకేతాలు పంపింది..? దానిపై సదరు ఎంపీ…

AP

రాజన్న బాణంలా దూసుకొస్తున్న షర్మిల..!

ఏపీ కాంగ్రెస్‌లో అనుకున్నదే జరిగింది. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. పీసీసీ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినప్పుడే ఆమెకు లైన్ క్లియర్ అయింది. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలస్యం చేయకుండా షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పింది. ఇక ఇప్పుడు రాష్ట రాజకీయాల్లో.. అది కూడా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా యాక్టివ్ అవ్వనున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కార్యాచరణ ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.   వైఎస్ షర్మిలకు…

AP

చంద్రబాబు స్కిల్ కేసుపై తీర్పు..

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ టీడీపీ నాయకుల్లో నెలకొంది. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబు తరఫు లాయర్లు, అవినీతి కేసుల్లో ఈ నిబంధన వర్తించదని సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించిన విషయం విధితమే.