AP

AP

రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం..

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుపై కొందరు వ్యక్తులు రాళ్లు, మేకులతో దాడికి యత్నించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది.     పూర్తి వివరాల్లోకి వెళితే… ఆకివీడులోని స్థానిక రామాలయ స్థలానికి సంబంధించి గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని స్థానికుల ఆహ్వానం మేరకు రఘురామరాజు ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు.…

AP

అమరావతి పై జగన్‌కు మంత్రి లోకేశ్ సూటి ప్రశ్న..?

అమరావతి రాజధాని అంశంపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. “ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని మా నినాదం. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. అమరావతి పై మీ స్టాండ్ ఏంటి జే టర్న్ జగన్ గారూ?” అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన సవాల్ విసిరారు. రాజధానిపై తమ ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేస్తూనే, జగన్ ను లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.…

AP

శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్…

  శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యాలు విరాజిల్లాలని ఆకాంక్షించారు. ధర్మం, సత్యం, క్రమశిక్షణ వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన కోరారు.

AP

వడ్డెర్లకు మైనింగ్ లీజులు… మరో యువగళం హామీ నెరవేర్చిన లోకేశ్..

రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గ అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. వారి కులవృత్తిని ప్రోత్సహించి, ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కేటాయించాలని నేడు ఏపీ క్యాబినెట్ మంత్రివర్గం నిర్ణయించింది. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.   గతంలో లోకేశ్ పాదయాత్ర…

AP

కీలక అంశాలపై ఏపీ క్యాబినెట్ తీర్మానాలు ఇవే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించి, కొత్త రాజధానిగా ‘అమరావతి’ పేరును అధికారికంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.   ఈ నెల 28న జరగనున్న ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారు. అనంతరం, పునర్విభజన…

AP

బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పాలాభిషేకం…

  అనంతపురం జిల్లా RDT సంస్థకు సంబంధించిన ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (FCRA) నమోదు పునరుద్ధరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వెలువడిన సందర్భంగా ఈ అంశానికి సంబంధించి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారిని అభినందనలు తెలుపుతూ ఈరోజు కదిరి నియోజకవర్గంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.…

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’: డ్రోన్లతో గాలింపు.. కార్డన్ సెర్చ్‌తో నేరగాళ్ల గుండెల్లో వణుకు!

శ్రీ సత్య సాయి జిల్లా..   ఆపరేషన్ ‘వజ్రప్రహార్’లో భాగంగా మంగళమడక , ఎన్.పి కుంట గ్రామాలలో కార్డెన్, సర్చ్ నిర్వహించిన పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో కార్డన్ & సెర్చ్. మత్తు పదార్థాల నిర్మూలనపై ఉక్కుపాదం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించిన పోలీసులు.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు, *జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్…

AP

ఘోర బస్సు ప్రమాదం…. కనీసం 10 మంది సజీవదహనం……

  ఆంధ్రప్రదేశ్: * మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. * రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. * మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమయ్యాయి. * కనీసం 10 మంది సజీవదహనం అయ్యారు. * మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. * చందూ ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి ఉదయగిరి వెళ్తేందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. *…

AP

విజయవాడలో ఉగ్ర కలకలం… ముగ్గురు యువకుల అరెస్ట్..

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడలో ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ అధికారులు మంగళవారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ (23), ఎండీ డానిష్ (27), మీర్జా సోహైల్ బేగ్ (23)‌లను అదుపులోకి తీసుకున్నారు.   విజయవాడలోని వించిపేటలో నిందితుల నివాసాల సమీపంలో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నివాసాల్లో సోదాలు…

AP

జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. నోవాటెల్ భేటీలో కీలక నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా పటిష్టం చేయాలనే అంశంపై కూలంకషంగా చర్చించనున్నారు. కేవలం ఎన్నికల విజయానికే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా జనసేనను ప్రతి గ్రామంలోనూ నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.   ముఖ్యంగా పార్టీని…