డీఎస్సీలో భారీ స్కామ్ జరిగింది.. మంత్రి లోకేశ్ రాజీనామా చేసి, సీబీఐతో విచారణ జరిపించాలి: సజ్జల..
రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నియామక ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. ఇది ‘క్యాష్ ఫర్ టీచర్ పోస్ట్’ స్కామ్ అని అభివర్ణించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.సోమవారం అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో…

