రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జూన్ 8) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాస్పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాస్పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది, పారదర్శకమైన రీతిలో…

