ఉన్నత విద్యలో ఫేస్ రికగ్నిషన్ హాజరుపై పకడ్బందీ చర్యలు: మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు.
రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముఖ ఆధారిత హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ డిగ్రీ, ఇంజనీరింగ్…

