ఈ నెల 23 నుంచి ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్ర: సీఎం చంద్రబాబు..
కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఇంటింటికీ విజయయాత్ర నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా… ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో…