AP

AP

ఈ నెల 23 నుంచి ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్ర: సీఎం చంద్రబాబు..

కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఇంటింటికీ విజయయాత్ర నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా… ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో…

AP

మానసికంగా చచ్చిపోయాను: పేర్ని నేని కంటతడి..

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వైసీపీ కేడర్‌పై దాడులు చేయించారని ఆరోపించారు.   కూటమి…

AP

అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్..

రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజును భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విచారణ నిమిత్తం మంగళగిరికి తరలిస్తున్నట్లు సమాచారం.   వైసీపీ అనుబంధ సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు…

AP

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో రామ్మోహన్ నాయుడు భేటీ .. మూడు ప్రధాన సమస్యలపై వినతి..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న సమావేశమయ్యారు. రాష్ట్ర రైతుల సమస్యలపై చర్చించేందుకు ఆయన ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ప్రధానంగా మూడు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.   2014-19 సంవత్సరాల మధ్య ఉపాధి పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరించి నిధులు విడుదల చేయాలని రామ్మోహన్ నాయుడు కోరారు. దేశంలోనే అత్యధిక పామాయిల్ ఉత్పత్తి చేసే…

AP

ఫ్యాక్టరీస్ యాప్ ను ప్రారంభించిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి..

పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో కార్మిక భద్రత అంతే ముఖ్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మిక భద్రతా ప్రమాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు, బీఐఎస్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం మరియు గట్టి భద్రతా ఆడిట్ శిక్షణ (IS 14489:2018 ప్రకారం)’ కార్యక్రమాన్ని నిన్న విజయవాడలోని హయత్ ప్లేస్ హోటల్‌లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్, కర్మాగార శాఖ ఏపీసీఎఫ్ఎస్ఎస్ సహకారంతో రూపొందించిన ‘factories’ యాప్‌ను ప్రారంభించారు.…

AP

భవిష్యత్ టెక్నాలజీలకు కేంద్రంగా అమరావతి..!

అమరావతిలో పెద్ద ప్రాజెక్ట్ మొదలైంది. దీనితో మూడు నగరాలకు ఊహించని కనెక్టివిటీ పెరగనుంది. అంతేకాదు ఇక్కడ ఎందరో విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే చాలు, జై అమరావతి.. జైజై రాజధాని అనేస్తారు. ఇంతకు ఆ ప్రాజెక్ట్ ఏమిటో తెలుసుకోండి. మన రాజధాని అద్భుతాన్ని తెలుసుకొని, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిద్దాం.   రాష్ట్ర రాజధాని అమరావతిని ఇప్పుడు దేశానికి గర్వకారణంగా మార్చే పనిని ఏపీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నిర్మాణం ఆగిపోయిందని…

AP

బుద్ధి మార్చుకోని జర్నలిస్ట్ కృష్ణంరాజు.. ఆధారాలున్నాయంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే యత్నం..

సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే, ఆ తర్వాతైనా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. కానీ, అమరావతి మహిళలను ఉద్దేశించి గతంలో సాక్షి చానెల్‌లో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. పైగా, తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు మరింత వివాదాస్పద చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆయన తన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవిగోనంటూ కొన్ని పాత వార్తా కథనాలను చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   గతంలో…

AP

అమరావతిని వేశ్యల రాజధాని అన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు… రాష్ట్రంలో భగ్గుమన్న నిరసనలు..

అమరావతి మహిళలను కించపరిచేలా ‘సాక్షి’ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు, వాటిని సమర్థించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సాక్షి’ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుపై నిన్న అన్ని జిల్లాల్లోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతులు, మహిళలు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.   రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఫిర్యాదులు నిన్న రాష్ట్రంలోని…

AP

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు నమోదు..!

అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తులూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.   వైకాపా ప్రభుత్వ హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటెయినర్ల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని…

AP

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..! యాంకర్ కొమ్మినేని అరెస్టు..

అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. కొమ్మినేనిని ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై సాక్షి టీవీ చర్చలో మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో…