పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్..
ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆ శాఖ అధికారులకు మరో తీపికబురు అందించారు. తాజాగా 42 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవోలు), డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా (డీడీవోలు) పదోన్నతులు కల్పించే ప్రక్రియకు పచ్చజెండా ఊపారు. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదించింది. దీంతో త్వరలోనే వీరందరూ ఉన్నత హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీరాజ్,…

