ఆక్వాకల్చర్ అభివృద్ధి పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (APSADA) సభ్యుల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాల నుండి, మత్స్య పరిశ్రమకు సంబంధించిన విభిన్న రంగాల ప్రముఖులను ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. సభ్యులుగా నియమితులైన వారిలో దేశంసెట్టి వెంకట లక్ష్మీ నారాయణ (అమలాపురం, ప్రాసెసింగ్ ప్లాంట్లు విభాగం), గుట్టికొండ శ్రీ రాజబాబు (గుడివాడ, ఫీడ్ తయారీదారులు), లంకే నారాయణ ప్రసాద్…