రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం..
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుపై కొందరు వ్యక్తులు రాళ్లు, మేకులతో దాడికి యత్నించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఆకివీడులోని స్థానిక రామాలయ స్థలానికి సంబంధించి గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని స్థానికుల ఆహ్వానం మేరకు రఘురామరాజు ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు.…

