AP

APCINEMA

గేమ్ చేంజర్, వీరమల్లు సినిమాలపై రోజా కీలక వ్యాఖ్యలు..!

టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఆయన నటించిన వార్-2 సినిమా ఎలా ఆడుతుందో చూస్తామని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించినట్టుగా వార్తలు రావడం… దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమనడం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ ఫ్లెక్సీలు ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై వైసీపీ మహిళా నేత రోజా స్పందించారు.   “ఇవేమైనా ఈవీఎంలు అనుకున్నారా… మార్చివేసి మోసం చేయడానికి! సినిమాలు…

AP

జగన్ దేశాన్ని అవమానించారు… జాతికి క్షమాపణ చెప్పాలి: నారా లోకేశ్..

వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి పవిత్రమైన రోజున జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి జగన్ గైర్హాజరు కావడం దేశాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.   ఈ సందర్భంగా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకపోవడం కేవలం అహంకారం మాత్రమే కాదు, మన దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని తీవ్రంగా అవమానించడం” అని వ్యాఖ్యానించారు. జగన్ చర్య, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం…

AP

ధర్మవరంలో ఉగ్ర కలకలం… వివరాలు తెలిపిన ఎస్పీ రత్న..

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహహ్మద్ అనే వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చూడటానికి అమాయకంగా కనిపించే వ్యక్తి, తెరవెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న వాట్సాప్ గ్రూపులతో సంబంధాలు నెరుపుతూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నూర్ మహమ్మద్ అనే ఈ వ్యక్తితో పాటు మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వి. రత్న మీడియాకు వెల్లడించారు.   ఎస్పీ రత్న తెలిపిన వివరాల…

AP

ఆ ఆడియో నాది కాదు… ఎన్టీఆర్ అభిమానులు బాధపడితే క్షమించాలి: ఎమ్మెల్యే ప్రసాద్..

సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న వివాదాస్పద ఆడియో క్లిప్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దూషిస్తున్నట్లుగా ఉన్న ఆ ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. అది తన గొంతు కాదని, స్థానిక రాజకీయాల్లో తనపై గిట్టనివారే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.   ఈ వివాదంపై దగ్గుపాటి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. “సోషల్ మీడియాలో…

AP

అనంతపురం టీడీపీలో రచ్చ… ఎమ్మెల్యే Vs ప్రభాకర్ చౌదరి..

అనంతపురం టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా దగ్గుపాటికి ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. దగ్గుపాటి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని… ఇద్దరం ఎన్నికల్లో పోటీ చేద్దామని… ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దామని సవాల్ విసిరారు. సమాధులు ఆక్రమించిన వాళ్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన…

AP

ఏపీలో మొదలైన మహిళల ఫ్రీ బస్..!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మొదలయ్యాక, RTC బస్సులు ఇప్పుడు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, సమాచారం పంచే మాధ్యమాలుగా కూడా మారిపోయాయి. కండక్టర్ చేతిలో మైక్ పట్టుకుని, మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఆధార్ చూపించి సద్వినియోగం చేసుకోండని బస్సు మొత్తం మార్మోగేలా చెబితే, ప్రయాణికుల ముఖాల్లో ఒక ఆసక్తి, ఒక సంతోషం కనబడుతోంది. గ్రామీణ రూట్లలో అయితే ఈ సన్నివేశం మరింత అందంగా, మరింత దగ్గరగా అనిపిస్తోంది.   ఏపీ…

AP

వైనాట్ పులివెందుల అంటూన్న టీడీపీ నేతలు..! జగన్ కు కౌంటర్ ..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ నష్టపోయిందేంటి? పోనీ ఆ గెలుపుతో టీడీపీ సాధించిందేంటి? లాభ నష్టాల సంగతి బేరీజు వేసే కంటే, ఇగో శాటిస్ఫాక్షన్ కి ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అవును, వైనాట్ కుప్పం అంటూ గతంలో జగన్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తే, ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ దెబ్బకొట్టిమరీ చూపించారు టీడీపీ నేతలు.   అలా మొదలైంది.. వాస్తవానికి పులివెందులలో గెలవాలని టీడీపీకి, కుప్పం ఏరియాలో గెలవాలని…

AP

కొత్త జిల్లాల ఏర్పాటుపై వినతులు స్వీకరిస్తాం: మంత్రి అనగాని..

గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను అస్తవ్యస్తంగా చేపట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. తొందరపాటు చర్యలు, ఒత్తిళ్లతో జిల్లాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా జిల్లాల ఏర్పాటు జరగలేదని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటులో సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.   మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సమావేశాలు…

AP

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేసి మళ్లీ జరపాలి: జగన్ డిమాండ్..

పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక…

AP

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!

రాష్ట్రంలోని మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారబోయే ‘స్త్రీశక్తి’ పథకం ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఈ పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అధిక రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, భద్రత అంశంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం…