ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం..! వారంలో ఒక రోజు ‘నో వెహికిల్ డే’..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. “నా దేశం – నా బాధ్యత” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాజం సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నామని…

