61 ఏళ్ల భూ సమస్యకు తెరదించిన సీఎం చంద్రబాబు..! రైతుల కళ్లలో ఆనందం..
ఆరు దశాబ్దాలుగా తమ బతుకుల్లో అలుముకున్న అనిశ్చితికి తెరపడింది. మూడు తరాలుగా సాగుచేస్తున్న భూమికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. తమదన్న హక్కు పత్రాలు చేతికి అందడంతో ఆ రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామంలో 61 ఏళ్లుగా నలుగుతున్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపారు. శనివారం కంగుందిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 322 రైతు కుటుంబాలకు చెందిన 460.19 ఎకరాల భూమికి సంబంధించిన డీకేటీ…

