AP

AP

కులం పేరుతో వైసీపీ ట్రాప్.. జనసైనికులకు పవన్ హెచ్చరిక..

ఎలాంటి భావజాలం లేని పార్టీ వైసీపీ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్.. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన నేతలతో చర్చించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ, టీడీపీ పొత్తును క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. వైసీపీ వాళ్లకు తనను విమర్శించే హక్కులేదన్నారు. కులం పేరుతో వైసీపీ చేసే ట్రాప్ లో కార్యకర్తలు పడొద్దన్నారు.   తానేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానని…

AP

బెజవాడలో భారీ బైక్‌ ర్యాలీ.. చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ..

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వచ్చారు. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లిన ఆయన.. శ్రీవారి దర్శనం తర్వాత విజయవాడకు వచ్చారు. ఇక్కడ పార్టీ అధినేతకు తెలుగుదేశం శ్రేణులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అడుగడుగునా బాబుకు ఘనస్వాగతం లభించింది.   తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకోగానే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, కొంతమంది సీనియర్‌ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్కడి నుంచి…

AP

జనసేన సీట్లు ఫైనల్, 30-2 : పవన్, నాగబాబు స్థానాలు ఖరారు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల పైన ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్న టీడీపీ, జనసేన అధినేతలు ఆ పార్టీ నుంచి స్పష్టత వచ్చిన తరువాత అధికారికంగా సీట్లను ప్రకటించనున్నారు. తాజాగా జనసేన 30 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ సీట్లను ప్రతిపాదించింది. ఈ నెల 2 లేదా 3వ తేదీ చంద్రబాబుతో పవన్ సమావేశం కానున్నారు. ఆ సమయంలో తుది నిర్ణయం తీసుకొనే…

AP

ఉరుసు ఉత్సవాల్లో వైఎస్ జగన్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలోని అమీన్‌ పీర్‌ దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. ఛాదర్‌ను సమర్పించారు. ఉరుసును పురస్కరించుకుని- కడప పెద్ద దర్గాగా రాయలసీమ వాసులకు చిరపరిచితమైన ఈ ఆధ్యాత్మిక స్థలం సందడిగా మారింది.   కర్నూలు ఓర్వకుల్లు నుంచి ప్రత్యేక విమానంలో జగన్ కడపకు బయలుదేరారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కాషాయ…

AP

ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ..?

అక్రమాస్తుల కేసుల విచారణతో జేడీ లక్ష్మీనారాయణ జాతీయ వ్యాప్తంగా సుపరిచితులయ్యారు. ముఖ్యంగా జగన్ అక్రమస్తుల కేసులను విచారణ చేపట్టింది జేడీ లక్ష్మీనారాయణే. గత ఎన్నికల ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సరిగ్గా ఎన్నికలకు 15 రోజుల ముందు జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతరం జనసేన ను వీడారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  …

AP

ఏపీ పై పవన్ ఫోకస్ .. ఆరోజు కీలక నిర్ణయాలు.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేకుండా ఏపీపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టేందుకు పవన్ డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 1న జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పవన్ తో పాటు డీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సైతం హాజరు కానున్నారు.ఎన్నికల వ్యూహాలను…

AP

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్: వైఎస్ జగన్.

రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వైఎస్ జగన్- 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరో 12 ఉప కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారాయన.   ఆయా సబ్ స్టేషన్ల వ్యయం 3,100 కోట్ల రూపాయలు. కర్నూలు, నంద్యాల, కడప, సత్యసాయి పుట్టపర్తి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ…

AP

చంద్రబాబు స్కిల్ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు – ఆంక్షల కొనసాగింపు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీని పైన విచారించిన సుప్రీం ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబుకు తాజాగా కండీషన్లు విధించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.   సుప్రీంకోర్టు ఆంక్షలు చంద్రబాబుకు సుప్రీం కోర్టు కండీషన్లు…

AP

లోకేష్ యువగళం మళ్లీ ప్రారంభం-అదే పొదలాడ నుంచి మొదలు..

టీడీపీ యువనేత నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను పునఃప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్.. ఇవాళ గతంలో ఆపిన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడ నుంచే తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్ మళ్లీ పాదయాత్రలోకి దిగడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.   గతంలో తన తండ్రి చంద్రబాబును స్కిల్ కేసులో సీఐడీ అరెస్టు చేసిన…

AP

చంద్రబాబు అరెస్ట్ పై సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశాలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబును కేసులు వెంటాడుతున్నాయి. మద్యం కేసులో చంద్రబాబును ఏ -3గా సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పై వాదనలు ముగిశాయి. దీని పైన తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు సీఐడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.   మద్యం కేసులో భాగంగా చంద్రబాబు,…