పరకామణి కేసులో జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ విమర్శలు: ‘తన మతంలో జరిగితే ఊరుకుంటారా?’
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, తిరుమల పరకామణి చోరీ కేసును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నదిగా అభివర్ణించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, జగన్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ, “తన మతంలో ఇలా జరిగితే ఊరుకుంటారా?” అని సూటిగా ప్రశ్నించారు. భారత రాజ్యాంగం అన్ని మతాలకూ ఒకేలా వర్తిస్తుందని, ధర్మం, రాజ్యాంగం ఒకే దిశలో మార్గదర్శకాలుగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ,…

