నేను అబద్ధం చెబితే వెంకటేశ్వరస్వామి నన్ను శిక్షిస్తాడు: విజయసాయిరెడ్డి..
కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) అనే వ్యక్తి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేయడం తెలిసిందే. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నేడు విజయసాయిరెడ్డి హైదరాబాదులో ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఆరు గంటల పాటు ప్రశ్నించారని, 25 ప్రశ్నలు అడిగారని వెల్లడించారు. కేవీ…