AP

AP

తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక ట్విస్ట్ లు..!

ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కీలక పాత్రదారులుగా గుర్తించిన అధికార పార్టీ నాయకులను పార్టీ సస్పెండ్‌ చేసింది. పలువురు వ్యక్తులు అరెస్ట్‌ అయ్యారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీకి విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు కూటమి నేతలు.   ఏపీ కల్తీ మద్యం కేసులో రాజకీయ దుమారం.. ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేసిన సీఐ   మొత్తం 12 మంది…

AP

చైల్డ్ కేర్ సెంటర్ లో శిశువు మరణంపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు తీవ్రమైన ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని ప్రభుత్వ శిశుగృహంలో ఏడాదిన్నర బాలుడు మృతి చెందడం, పార్వతీపురం మన్యం జిల్లాలోని గురుకుల పాఠశాలలో 85 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడంపై ఆయన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి. సంధ్యారాణితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.   అనంతపురం…

AP

కిలో టమాటా ఒక్క రూపాయి… కర్నూలు జిల్లాలో రైతుల ఆగ్రహం..

కంటికి రెప్పలా కాపాడుకున్న పంటకు కనీస ధర కూడా దక్కకపోవడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో ధర కేవలం రూపాయికి పడిపోవడంతో ఆగ్రహించిన రైతులు, తాము పండించిన టమాటాలను రోడ్డుపై పారబోసి తీవ్ర నిరసన చేపట్టారు. టమాటాలతో నిండిన బుట్టలను రహదారిపై కుమ్మరించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.   ఈ నిరసన కారణంగా పత్తికొండలోని గుత్తి-మంత్రాలయం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రైతులు…

AP

ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై రంగంలోకి డిప్యూటీ సీఎం..!

కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ తో ఎమ్మెల్సీ హరిప్రసాద్, పిఠాపురం ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన నేతలు భేటీ అయ్యి పిఠాపురం అభివృద్ధి పనులపై చర్చించారు. మత్స్యకారుల సమస్యలు, కంపెనీల కాలుష్యంపై కలెక్టర్ తో నేతలు చర్చించారు.   మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై ఈ సమావేశం చర్చించారు. వచ్చే నెల 10లోగా…

AP

ఆక్వాకల్చర్ అభివృద్ధి పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (APSADA) సభ్యుల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   వివిధ జిల్లాల నుండి, మత్స్య పరిశ్రమకు సంబంధించిన విభిన్న రంగాల ప్రముఖులను ప్రభుత్వం సభ్యులుగా నియమించింది.   సభ్యులుగా నియమితులైన వారిలో దేశంసెట్టి వెంకట లక్ష్మీ నారాయణ (అమలాపురం, ప్రాసెసింగ్ ప్లాంట్లు విభాగం), గుట్టికొండ శ్రీ రాజబాబు (గుడివాడ, ఫీడ్ తయారీదారులు), లంకే నారాయణ ప్రసాద్…

AP

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా… 23 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వి. అయ్యన్న పాత్రుడు శనివారం ప్రకటించారు. ఈ సెషన్‌లో మొత్తం 23 బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించడం విశేషం.   ఈ సమావేశాలు మొత్తం 8 రోజుల పాటు 45 గంటల 53 నిమిషాల పాటు కొనసాగాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పరిపాలన, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు.…

AP

పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా… సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

పర్యాటక రంగంతోనే రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు…

AP

సుగాలి ప్రీతి కేసులో కీలక పరిణామం.. మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్..

ఏపీలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏళ్లుగా విచారణలో ఉన్న ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఇకపై సీబీఐ చేపట్టనుంది.   వివరాల్లోకి వెళితే… 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్…

AP

జగన్ అక్రమాస్తుల కేసు: రూ. 793 కోట్ల దాల్మియా ఆస్తుల జప్తును సమర్థించిన అథారిటీ..

వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడాన్ని అడ్జుకేటింగ్ అథారిటీ సమర్థించింది.   దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్‌కు కడప జిల్లాలో 407 హెక్టార్ల సున్నపురాయి గనులను ప్రభుత్వం లీజుకు కేటాయించింది. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ, జగన్‌కు చెందిన కంపెనీలలో భారీగా పెట్టుబడులు…

AP

వైసీపీ ‘డిజిటల్ బుక్’.. అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తామన్న జగన్..

అధికార టీడీపీ కూటమిపై ప్రతిపక్ష వైసీపీ రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. తమ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులు, వేధింపులను నమోదు చేసేందుకు ‘డిజిటల్ బుక్’ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టేది…