AP

AP

ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఆయన హస్తిన వెళ్తున్నారు.   వివరాల్లోకి వెళితే, ఈ నెల 14వ తేదీన, అంటే వచ్చే సోమవారం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ముఖ్యులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా కేంద్ర హోం శాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి శాఖల మంత్రులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతారు.  …

AP

2027 నాటికి పోలవరం పూర్తవుతుందా..?

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దశాబ్దాలుగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందనేది ఓ ఆన్సర్ లేని క్వశ్చన్. త్వరలోనే ఆ ప్రశ్నకు గోదావరి అంత సమాధానం దొరకబోతోంది. మరో రెండేళ్లలోనే పోలవరం పూర్తి చేయాలని సంకల్పించింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో పోలవరం పనులు ఎంతవరకొచ్చాయ్? ఏయే పనులు.. ఏ దశలో ఉన్నాయ్? ఓవరాల్‌గా.. పోలవరం ప్రోగ్రెస్ ఏంటి? అనే దాని గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.   వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం…

AP

విశాఖలో 150 పైగా ప్రముఖ కంపెనీల పెట్టుబడులు..! ఇక ఉద్యోగాల జాతర..

ఐటీ పరిశ్రమ అభివృద్ధితో విశాఖ దశ మారిపోయేల కనిస్తుంది. దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ.. స్టార్టప్ కంపెనీలే కాకుండా ప్రపంచ మేటి కంపెనీలను కూడా ఆకర్శిస్తుంది. క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న వేళ.. విశాఖలో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేస్తే అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖలో ఇప్పటికే ఇన్‌ఫోసిస్, టెక్ మహింద్రా, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి 150 బడా…

AP

నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు… అంతా బ్లడ్ బుక్కే!: రఘురామ..

అమెరికాలో నిర్వహించిన తానా 24వ ద్వైవార్షిక మహాసభల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు గనుక మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు? అని కార్యక్రమ యాంకర్ మూర్తి ప్రశ్నించారు. అందుకు రఘురామ బదులిస్తూ, రోజులో 8 గంటలు తనను మంత్రిగా చేస్తే 6 గంటలు హోంమంత్రిగా, మిగతా 2 గంటలు వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేస్తానని అన్నారు.…

AP

అమరావతికి మరో 20 వేల ఎకరాలు… సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్..

రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాజధాని పరిధిలో అదనంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో జరిగిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశంలో మొత్తం 7 ప్రధాన అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా అమరావతి,…

AP

ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్ డిమాండ్..

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, సాధారణ పౌరులకు రక్షణ కరువైందని, ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.   “ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్త‌మోడుతోంది. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతూ…

AP

రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు ప్రకటించిన మంత్రి అనగాని..

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని, పేద ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యమని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన రెవెన్యూ శాఖ సమీక్ష అనంతరం అనగాని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే పలు సంస్కరణలను ప్రకటించారు. ఇకపై కేవలం రూ.100 నామమాత్రపు రుసుముతో వారసత్వ ధృవీకరణ పత్రం…

AP

సీనియర్లకు చెక్ పెడుతున్న జగన్..!

వైసీపీ యూత్ వింగ్ మీటింగ్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పాదయాత్ర చేపట్టబోతున్నానని, అప్పుడు అందర్నీ ప్రత్యేకంగా కలుస్తానన్నారు. యూత్ వింగ్ నేతల అంతిమ లక్ష్యం ఎమ్మెల్యే కావడం అని ఉద్బోధించారు. జనంలోకి వెళ్లి, జనంతో మమేకమై స్థానికంగా బలపడాలన్నారు, సోషల్ మీడియాని వాడుకోవాలన్నారు. ఒకరకంగా ఇటీవల కాలంలో జగన్ పెట్టిన అన్ని మీటింగుల్లోకి ఇదే కాస్త ఆసక్తికరంగా ఉంది. మిగతా నేతలతో మొక్కుబడిగా మాట్లాడి ముగించిన జగన్, యువ నేతలతో మాత్రం…

AP

ఏపీ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు మరోసారి పాత రోజులు గుర్తొచ్చే అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మద్యం దుకాణాల లోపలే తాగడానికి ప్రత్యేక గదులు ఉండేవి అవే పర్మిట్ రూమ్స్. అయితే, వాటిని రద్దు చేసిన తర్వాత బహిరంగంగా తాగడం పెరిగి, మద్యం ప్రియులకు అసౌకర్యంగా మారింది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం మళ్లీ పర్మిట్ రూమ్స్‌ను మంజూరు చేయడానికి సిద్ధమవుతోంది.   తాజా సమాచారం ప్రకారం, ఈ పర్మిట్ రూమ్స్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు…

AP

అమెరికాలో సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతిలో క్వాంటం వ్యాలీ: చంద్రబాబు..

అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ని ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీనిని 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు.   విజయవాడలో సోమవారం నిర్వహించిన ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన…