National

National

రాఘవ్ చద్దాకు షాక్.. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు..!

రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై నిత్యం గళమెత్తే ఒక కీలక నేతను పార్టీ పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కాక విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ గొంతుకగా పేరుగాంచిన ఎంపీ రాఘవ్ చద్దాకు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పార్టీ…

National

ఎన్డీయేను గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

త‌మిళ‌నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వంపై ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దేశంలో మళ్ళీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రాల అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం పేరును కూడా మార్చే ప్రమాదం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేపుతున్నాయి.   తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్రను దెబ్బతీయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్టాలిన్ ఆరోపించారు. “బీజేపీ…

National

ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది అరెస్ట్..

దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రలు చేసిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని నెట్ వర్క్ లో ఎవరెవరు ఉన్నారు? అన్నది తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. శ్రీనగర్ కు చెందిన షబ్బీర్ అహమద్ లోన్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ఆపరేటర్. 2007లో భారత్ లో విధ్వంసం సృష్టించటానికి కుట్రలు చేసి పట్టుబడ్డాడు. అప్పట్లో పోలీసులు అతని నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.   ఢిల్లీ సమీపంలో.. ఈ…

National

నక్సలిజం దాదాపు అంతమైంది: లోక్ సభలో అమిత్ షా ప్రకటన..

నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ఆయుధాలు పట్టుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నక్సలిజాన్ని సమర్థించేవాళ్లు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆపరేషన్ కగార్, నక్సలిజం నిర్మూలన చర్యలపై ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ, మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైందని తెలిపారు.   సమాజంలో అన్యాయాలకు పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఉన్నాయని తెలిపారు. ఆయుధాలు పట్టడం సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని…

National

ఉగ్రభూమిగా పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో అగ్రస్థానం..

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం దానికి పూర్తి భిన్నమైన దిశలో పయనిస్తోంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) 2026 ప్రకారం, ఉగ్రవాదం వల్ల అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశంగా పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదికలోని గణాంకాలు పాకిస్థాన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్గత సవాళ్లను, దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాల వైఫల్యాలను స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి.   గ్రీక్ సిటీ టైమ్స్ తన కథనంలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సూచీలో పాకిస్థాన్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా…

National

సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..! తీవ్ర ఉద్రిక్తతలపై చర్చ..

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రత, నిత్యావసరాల సరఫరా, రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో… చమురు, గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో సమన్వయంతో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.   అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు…

National

పశ్చిమాసియా యుద్ధం.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. పశ్చిమాసియాలో 27 రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. యుద్ధానికి అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణ కొనసాగుతోంది.   సంక్లిష్ట పరిస్థితులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం   పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ప్రధానమంత్రి…

National

మతం మారితే రిజర్వేషన్లు కట్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

రాజ్యాంగబద్ధంగా సంక్రమించే రిజర్వేషన్ ఫలాల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వివరణ ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాలకు (SC) కేటాయించిన ప్రయోజనాలు కేవలం నిర్దేశిత మతాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేస్తూ, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు తమ ఎస్సీ హోదాను కోల్పోతారని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో మత మార్పిడి చేసుకున్న వారు ఇకపై ఎస్సీ రిజర్వేషన్ల కింద పొందే రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలకు అనర్హులవుతారని న్యాయస్థానం తేల్చి చెప్పింది.   అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన…

National

ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు..

పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో అట్టుడుకుతున్న సముద్ర మార్గంలో భారత నౌకాదళం పటిష్ట భద్రత నడుమ మూడు కీలక ఇంధన నౌకలు భారత్‌కు బయల్దేరాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్‌ త్రిపాఠి తన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు.   విశ్వసనీయ వర్గాల సమాచారం…

National

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక ముందడుగు.. 50శాతం పెరగనున్న ఎంపీ సీట్లు..!

మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల (2029) నుంచి చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన రెండు బిల్లులను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఒక సరికొత్త ఫార్ములాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం లోక్‌సభలోని ప్రస్తుత 543 స్థానాలను 50 శాతం పెంచి, మొత్తం 816కి చేర్చనున్నారు. కొత్తగా పెరిగే 273 సీట్లను పూర్తిగా…