సిద్దిపేట జవాన్ భూ కబ్జా ఆరోపణ.. వీడియో షేర్ చేసిన హరీశ్ రావు..!
దేశ రక్షణలో పాలుపంచుకుంటున్న ఓ సైనికుడి భూమి కబ్జాకు గురైందంటూ వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే ఆర్మీ జవాను, తన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు వెంటనే స్పందించారు. జవాన్ రామస్వామి ఎదుర్కొంటున్న సమస్యను ఆయన తీవ్రంగా…

