TELANGANA

TELANGANA

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం..! ఇకపై వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు..

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రిజిస్ట్రరైన అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్లు ప్లేట్లు లేకపోతే బండి సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నెంబర్ ప్లేట్ల కోసం www.siam.in వెబ్‌సైట్‌లో బుకింగ్‌ చేసుకోవాలని…

TELANGANA

రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా కంచ గచ్చిబౌలి అడవిని ధ్వంసం చేస్తున్నారు: కేటీఆర్..

కంచ గచ్చిబౌలిలోని చిట్టడవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత నిర్దయగా ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దీనివల్ల విలువైన వృక్ష, జంతుజాలం నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ అడవులను ధ్వంసం చేయడంతో ఓ జింక ప్రాణాలు కోల్పోయిందని, ఆ రక్తపు మరకలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికి అంటాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   వన్యప్రాణుల ఈ దారుణ హత్యపై సుప్రీంకోర్టు దృష్టి సారించాలని తాను కోరుతున్నానని…

TELANGANA

జీవన ప్రమాణాలు పెంచే విధంగా మన విద్యా విధానం ఉండాలి: రేవంత్ రెడ్డి..

జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం ఒక పాలసీని రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యా కమిషన్, విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు.   క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యమయ్యేలా పాలసీ ఉండాలని ఆయన అన్నారు. జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్యావిధానం ఉండాలని అధికారులకు సూచించారు. భాషతో పాటు, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలా ఈ…

TELANGANA

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 2000 ఎకరాల్లో ఎకో పార్క్..!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్కు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. HCUలోని 400 ఎకరాల్లోనే కాకుండా.. వర్సిటీలోని 1600 ఎకరాలను కలిపి వరల్డ్‌ బిగ్గెస్ట్‌ ఎకో పార్క్‌కు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. అది సింగపూర్‌ లోని నైట్‌ సఫారీ, న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్క్‌ తరహాలో ఉండేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వివాదానికి చెక్‌ పెట్టేందుకే ప్రభుత్వం కమిటీని కూడా అపాయింట్‌ చేసింది. ఈ కమిటీ ఎకో పార్క్‌పై కూడా వర్కవుట్‌ చేయనుందని తెలుస్తోంది.…

TELANGANA

400 ఎకరాల భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.   సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఈరోజు మధ్యాహ్నం మధ్యంతర నివేదికను పంపించారు. హైకోర్టు నివేదికను జస్టిస్ గవాయ్ ధర్మాసనం పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది.   కంచ…

TELANGANA

ఎమ్మెల్యే అనర్హత కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు..

ఎమ్మెల్యే అనర్హత కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అంటూ సుప్రీం ప్రశ్నించింది. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పష్టం చేసారు. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్‌ న్యాయవాది జస్టిస్ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పందించిన జస్టిస్ గవాయ్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.   బీఆర్ఎస్ కు కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ…

TELANGANA

కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు ఎంట్రీ..!

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఆ 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, HCU స్టూడెంట్స్ పిటిషన్ వేయగా.. కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున ఖరీదైన లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. ఆయనకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు.   పిటిషనర్ ఏమని వాదించారంటే..   హాలీవుడ్‌ సినిమాల తరహాలో.. భారీ సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి.. 400 ఎకరాల భూమిని చదును చేస్తున్నారని న్యాయవాది…

TELANGANA

హెచ్‌సీయూ వివాదంపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కీలక ఆదేశాలు..

హైదరాబాద్ కంచె గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.నగేశ్, రఘునందన్ రావు తదితరులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి…

TELANGANA

కాంగ్రెస్ పాలన చాలా వింతగా ఉంది: కేసీఆర్..

కాంగ్రెస్ పాలన విచిత్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. పార్టీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో బహిరంగ సభకు భూమి పూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు…

TELANGANA

ఉగాది నుండి రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. ఉత్తమ్ కీలక ప్రకటన..

ఉగాది నుంచి రేషన్‌ కోటాలో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ కుమార్‌రెడ్డి చెప్పారు. నిజమైన ఆహారభద్రత కోసం సన్నబియ్యం పంపిణీ ఈనెల 30నుంచి ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదగా సన్నబియ్యం పంపిణీ మొదలవుతుందన్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. మూడు రకాల రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. సన్నబియ్యం ఇవ్వబోయే తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు ఉత్తమ్. కొత్తరేషన్లు కార్డుల దరఖాస్తులు, మంజూరు నిరంతర ప్రక్రియగా ఉండబోతుందన్నారు. రేషన్‌లో భాగంగా…