తెలంగాణ కౌరవుల చేతిలో ఉంది.. మల్లారెడ్డి సంచలన వాఖ్యలు..!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడేళ్లు ఓపిక పడితే మన రాజ్యం వస్తుందని ఆయన అన్నారు. సోమవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలో మల్లారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రం కౌరవుల చేతిలో ఉందని, కాంగ్రెస్ నాయకులకు పాలన చేతకావడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలు నిరాశలో ఉన్నారని ఆయన ఆరోపించారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి…

