TELANGANA

TELANGANA

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చారు.   నారాయణఖేడ్ సబ్ కలెక్టర్‌గా ఉమాహారతి, భైంసాకు అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్మూర్‌కు అభిజ్జాన్ మాల్వియా, కల్లూరుకు అజయ్ యాదవ్, భద్రాచలానికి మృణాళ్ శ్రేష్ఠ, బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా మనోజ్‌ను నియమిస్తూ సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.

TELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

బీజేపీలో కుల రాజకీయాలకు తావులేదని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా ఆసక్తికరంగా స్పందించారు.   బీజేపీలో కుల రాజకీయాలకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో ఇరవై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారని గుర్తు చేశారు. ఆయన తర్వాత కూడా…

TELANGANA

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీకి వెళుతున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని వ్యంగ్యం ప్రదర్శించారు.   ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని…

TELANGANA

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి అరుదైన ఘనత..!

హైదరాబాద్‌లోని నిమ్స్ యూరాలజీ విభాగం అరుదైన రికార్డును నెలకొల్పింది. గత ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. 1989లో ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడి అవసరమైన వారికి నిమ్స్ ఆశాదీపంలా కనిపిస్తోంది.   2015లో సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి డా. సి. రామ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. డా. రామ్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్‌ల బృందం గత పదేళ్లలో 1000కి…

TELANGANA

జీమెయిల్ లో కొత్త ఫీచర్..? ఇక ఆ మెయిల్స్‌కు చెక్..!

గూగుల్ తన జీమెయిల్ లో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది, దీని పేరు ‘మేనేజ్ సబ్‌స్క్రిప్షన్స్’. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఇన్‌బాక్స్‌లో అవసరం లేని సబ్‌స్క్రిప్షన్ మెయిల్స్‌ను ఒక్క క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.   ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?   ‘మేనేజ్ సబ్‌స్క్రిప్షన్స్’ డాష్‌బోర్డ్ ద్వారా వినియోగదారులు తాము సబ్‌స్క్రైబ్ చేసుకున్న అన్ని మెయిలింగ్ లిస్ట్‌లను ఒకే చోట చూడవచ్చు. ఈ డాష్‌బోర్డ్‌లో మీకు అవసరం లేని మెయిల్స్‌ను గుర్తించి, వాటి పక్కన…

TELANGANA

బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే.. కవిత సంచలన వాఖ్యలు..!

తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తన దారికి రావాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.   బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని తొలుత డిమాండ్ చేసింది తానేనని కవిత చెప్పారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్టు చెప్పారు.   కేంద్ర జలశక్తి మంత్రితో…

TELANGANA

కేసీఆర్ కుటుంబంపై కోర్టులకు వెళతాం: తీన్మార్ మల్లన్న..

బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిందని… లేకపోతే ఆ అరాచకం ఇప్పటికీ కొనసాగేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్ తో పాటు ఈ దారుణానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ పిలుపుతో తీన్మార్ మల్లన్న ఈరోజు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా మల్లన్న స్టేట్మెంట్ ను సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు.   విచారణ అనంతరం మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు…

TELANGANA

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!

తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో 31 జెడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా, 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు తెలిపింది.   ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను…

APNationalTELANGANA

బనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు..

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ జలవివాదాలపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగానే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై సీఆర్ పాటిల్ తెలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. గోదావరి…

APNationalTELANGANA

బనకచర్లపై నో డిస్కషన్.. : సీఎం రేవంత్..

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయిన విషయం తెలిసిందే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగానే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదించగా.. తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో…