హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్.. కేంద్ర మంత్రికి రేవంత్ కీలక ప్రతిపాదనలు
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పెద్దలను కలుస్తూనే.. మరోవైపు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలు కేంద్రమంత్రి ముందుంచారు. హైదరాబాద్-విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.…

