TELANGANA

TELANGANA

4న తెలంగాణ కేబినెట్ భేటీ..

తెలంగాణలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. ప్రధానంగా బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై చర్చించేందుకు ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఫిబ్రవరి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.   ఫిబ్రవరి 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.…

TELANGANA

త్వరలో రేవంత్ మార్క్ బడ్జెట్.. అన్ని నియోజకవర్గాలకు గుడ్ న్యూస్..!!

ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుండి తెలంగాణా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం. అయితే ఈసారి తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.   ఈ క్రమంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో…

TELANGANA

తెలుగు రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులు, కేటాయింపులు..!

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రస్తావించిన అంశాలు, కేటాయింపుల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సమయం లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలోనే రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల పైన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. గతం కంటే అంచనాలు పెరిగినట్లు వెల్లడించారు.   ఎన్నికల ఏడాది కావటంతో నిర్మలా…

TELANGANA

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి.. తొలిసారి ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్!!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీలో గజ్వేల్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల తుంటి శస్త్ర చికిత్స జరిగిన ఆయన చేతి కర్ర సహాయంతో తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ అసెంబ్లీ వద్ద కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఆపై కెసిఆర్ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కెసిఆర్ తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత…

TELANGANA

అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక, ఎందుకంటే..?

ప్రజలను ఇబ్బంది పెట్టి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.   గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు…

APTELANGANA

ఇస్తున్నవి ఇచ్చేవి–పేదరికంని పాల దోలవు. .

ఇస్తున్నవి ఇచ్చేవి–పేదరికంని పాల దోలవు. ఫోటో రైటప్స్: 1. జనం వినతుల వెల్లువ. 2 ఆవాసం నివాసం కోసం ఎగబడిన జనం. 3 మా కోసం మా ఊరు వచ్చావయ్యా. 4 పేదల కోసం యాత్ర. 5 నా దారి పేదల రహదారి అంటూ జాతీయ రహదారిప అన్నవరం: పేదలు నిరంతరం సమస్యలు ఎదుర్కొంటూ వాటితో పోరాడుతూనే ఉన్నారని ప్రస్తుతం వారి కోసం అంటూ ఇస్తున్నవి ఇచ్చేవి పేదరికం పారదోలడానికి ఏమాత్రం ఉపయోగపడని దళాధిపతి విజయ్ పేర్కొన్నారు.…

TELANGANA

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరింది. ఈ అంశం పైన తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. దీని పైన విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీని పైన రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు ప్రారంభించారు.   హైకోర్టులో విచారణ : ఆర్టీసీ…

TELANGANA

2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తాం: గత సర్కారులా కాదంటూ రేవంత్ రెడ్డి

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం తెలిపారు.   త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు కూడా భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్…

TELANGANA

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అసలు విషయం చెప్పిన కేటీఆర్..

పదేళ్లపాటు కమిట్మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపించామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదేశించారని కేటీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.   మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఆరున్నర లక్షల…

TELANGANA

అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు..ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.   ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని…