TELANGANA

TELANGANA

హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్.. కేంద్ర మంత్రికి రేవంత్ కీలక ప్రతిపాదనలు

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పెద్దలను కలుస్తూనే.. మరోవైపు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలు కేంద్రమంత్రి ముందుంచారు. హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.…

TELANGANA

అన్నదాతలకు శుభవార్త.. ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణ మాఫీ..!

తెలంగాణలో అధికారంలోకి రాగానే రూ.2 లక్ష రైతు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో అన్నదాతల రుణాలు మాఫీ చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అన్నదాతలపై వడ్డీ భారం లేకుండా రుణ మాఫీ చేయాలనీ యోచిస్తోంది. రైతు రుణ మాఫీ ఒకేసారి చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు దఫాలుగా రుణ మాపీ చేసినా.. అందరు రైతులకు రుణ మాఫీ కాలేదు.  …

TELANGANA

వచ్చే నెల నుంచే గృహజ్యోతి, రూ.500 లకే సిలిండర్..!

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఆభయ హస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఆభయ హస్తం దరఖాస్తు వివరాలను సిస్టంలో ఎంట్రీ చేస్తున్నారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాపాలన సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులపై చర్చించారు.   ఈ దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ ఎక్కడి వరకు వచ్చింది. ఎప్పుడు…

TELANGANA

మైక్రాన్ కంపెనీ సీఈవోతో సిఎం రేవంత్ భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ సీఈవో సంజయ్ మెహ్రోత్రాతో గురువారం సిఎం నివాసంలో భేటీ అయ్యారు. అమెరికాలోని మైక్రాన్ టెక్నాలజీస్ కంపెనీ.. ప్రపంచంలోనే అతి పెద్ద మెమోరీ చిప్ తయారీ సంస్థలో ఒకటి. అమెరికా నుంచి సీఈవో సంజయ్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు వచ్చారు. మెమోరీ చిప్ తయారీ పరిశ్రమ స్థాపించేందుకు, కంపెనీ పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూలంగా ఉందని సంజయ్ తెలిపారు.   సిఎం రేవంత్ రెడ్డి కూడా మైక్రాన్ కంపెనీ పరిశ్రమ…

TELANGANA

బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ గా మార్పు..!?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ తిరిగి శక్తి పుంజుకొనే ప్రయత్నం చేస్తోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో పార్టీ పేరు పైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్పు చేయాలని సీనియర్లు కోరుతున్నారు. మరి ఈ దిశగా కేసీఆర్ అంగీకరిస్తారా.   తిరిగి మారుస్తారా : బీఆర్ఎస్ పేరును తిరిగి…

TELANGANA

వాహనదారులకు గుడ్ న్యూస్-జనవరి 31వరకూ గడువు పొడిగింపు..

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ఇవాళ్టితో ముగిసింది. దీనికి వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అయితే సర్వర్ సమస్యల కారణంగా ఆన్ లైన్లో ఎక్కువ మంది ఈ అవకాశం వినియోగించుకోలేకపోయామంటూ ఫిర్యాదులు చేశారు. దీంతో వీరంతా చెల్లింపు కేంద్రాలకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువును ఈ నెలాఖరు వరకూ పెంచింది.   ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3.59…

TELANGANA

తెలంగాణలో నూతన విద్యుత్ విధానం, నిరంతర విద్యుత్..

రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సుదీర్ఘంగా సమీక్షించారు.   రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీధర్ బాబులతో…

TELANGANA

సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడక్షరాలే చాలా పవర్‌ఫుల్—; కేటీఆర్..

తెలంగాణ రాష్ట్రంలో రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రంగంలోకి దిగిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా తెలంగాణా భవన్ లో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలోకి రాని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి నెలలో ప్రజల మధ్యకు వస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండటం…

TELANGANA

మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ.. ఎన్ని జిల్లాలు ఎగిరిపోతాయో..?

తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాజకీయ అవసరాల కోసం పది జిల్లాలో ఏర్పడిన తెలంగాణలో పాత జిల్లాలను చలువలు పలువలుగా చీల్చేసింది. పదికి అదనంగా 23 జిల్లాలు.. మొత్తం 33 జిల్లాలుగా మార్చేసింది. ఇక రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కూడా అస్తవ్యస్తంగా జరిగింది. పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై సమీక్ష చేయాలని భావిస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌…

TELANGANA

బీజేపీకి 10 సీట్లు, తెలంగాణలో భారీ స్క్రీన్లలో రామ మందిర ప్రారంభోత్సవం: కిషన్ రెడ్డి..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) ధీమా వ్యక్తం చేషశారు. 10 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్న బీజేపీ.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంఛార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ హాజరయ్యారు.…