National

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్ట్

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ముష్కరులలో దీపాంశు అలియాస్ మోను, మొయినుద్దీన్ అలియాస్ సల్మాన్ ఉన్నారు.

వీరిద్దరూ సల్మాన్ త్యాగి గ్యాంగ్‌కు చెందినవారు కాగా.. సల్మాన్ త్యాగికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉంది. దుండగులిద్దరూ ఈనెల 19న రాత్రి రాజౌరి గార్డెన్ ప్రాంతంలోని రెండు వేర్వేరు చోట్ల వ్యాపారుల దుకాణాలపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.

 

క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సీపీ రవీంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులకు ముందు వ్యాపారవేత్తలిద్దరికీ వర్చువల్ కాల్ ద్వారా రేడింపియేషన్ (విమోచన) కాల్ వచ్చింది. ఒక్కొక్కరు రూ.50 లక్షలు డబ్బులు చెల్లించాలని ఇద్దరు వ్యాపారుల నుంచి డిమాండ్ చేశారు. అయితే వారు డబ్బులు ఇవ్వకపోవడంతో వారి దుకాణాలపై కాల్పులు జరిపారు. ఈ కేసును ఛేదించేందుకు క్రైం బ్రాంచ్ ఘటనా స్థలం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించింది. దాని ద్వారా ఇద్దరు దుండగులను గుర్తించారు. అనంతరం వారి కోసం వెతకగా.. దీపాంశు అకా మోను అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతని నుండి 2 పిస్టల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని విచారించగా కీలక విషయాలు బయటపడ్డాయి.

 

సల్మాన్ త్యాగిని కలిసేందుకు తరచూ జైలుకు వెళ్లేవారని విచారణలో వారు చెప్పారు. అంతేకాకుండా తమను సల్మాన్ త్యాగి తన గ్యాంగ్‌లో చేర్చుకున్నాడని తెలిపారు. ఆయుధాలు ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడ బుల్లెట్లు దొరుకుతాయోనని జైలు లోపల నుంచి వారికి సమాచారం అందించేవాడు. ఆ తర్వాత సల్మాన్ త్యాగి సూచనల మేరకు వారిద్దరూ ఈ నేరానికి పాల్పడ్డారు. వాస్తవానికి వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో చేరాల్సి ఉందని చెప్పారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు పెరగడంతో.. స్థానిక నేరస్థులు, మైనర్ అబ్బాయిలు లారెన్స్ గ్యాంగ్‌లో చేరడం ప్రారంభించారు. సల్మాన్ త్యాగి కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో చేతులు కలిపారు.