TELANGANA

సింగపూర్‌లో సీఎం రేవంత్ టీమ్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. గురువారం రాత్రి సింగపూర్‌కు చేరుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడ పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.

 

తొలుత సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల నుంచి ఇరువురు చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య- నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కులు మొదలైన వాటిపై చర్చించారు. చాంగిలో సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మరో టీమ్ సందర్శిస్తోంది.

 

ఈ నేపథ్యంలో సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌‌-(ఐటీఈ‌)ని రేవంత్ టీమ్ సందర్శించనుంది. సింగపూర్ నైపుణ్యం అభివృద్ధికి ఐటీఈ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనుంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేలా ఐటీవోతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

 

సింగపూర్‌‌లో రివర్ ఫ్రంట్‌ను సందర్శించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో అక్కడ జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోనున్నారు. సింగపూర్ టూర్ అనంతరం అక్కడి నుంచి నేరుగా ఈనెల 20న రేవంత్ టీమ్ రావోస్‌కు చేరుకోనుంది. ఈనెల 22న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సుకు హాజరవుతోంది.